Cinema Ticket War: ఏపీలో టికెట్ల వార్.. తాడోపేడో అంటున్న ఎగ్జిబిటర్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీలో సినిమా టిక్కెట్ వ్యవహారం కొన్ని నెలల క్రితం ఎంత హాట్ టాపిక్గా మారిందో ప్రత్యేకంగా చెప్పనక్ర్లేదు.ఇప్పుడు టికెట్ వసూళ్ళ వ్యవహారం మరో సారి తెరపైకి వచ్చింది…సినిమా టికెట్ల అమ్మకాల కోసం ఆన్ లైన్ గేట్ వే తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దీనికి హైకోర్టు నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో.. ఇటీవలే సినిమా టిక్కెట్ల అమ్మకాలపై గైడ్ లైన్స్ జారీ చేస్తూ జగన్ సర్కారు ప్రకటన చేసింది.
అన్ని థియేటర్లు మరియు ప్రైవేట్ సంస్థలు ఈ గేట్ వే ద్వారానే సినిమా టికెట్ల విక్రయాలు చేపట్టాలని మార్గదర్శకాలు ఇచ్చింది. ఈ మేరకు జూన్ 2న ఏపీ సర్కారు జీవో 69ను జారీ చేసింది. నెల రోజుల్లో థియేటర్లు ప్రభుత్వంతో ఎంవోయూ కుదుర్చుకోవాలని ఆదేశించింది. టికెట్ల విక్రయించిన తర్వాత థియేటర్లకు డబ్బు ఎన్ని రోజుల్లో జమ చేస్తారనే దానిపై స్పష్టత ఇవ్వలేదు. దీంతో ఈ విషయంలో ఎగ్జిబిటర్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు..టికెట్ వసూళ్లు ప్రభుత్వ ఖాతాలో వేసుకుంటే ఇబ్బందులు తప్పవంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు…
Also Read
- Talliki Vandanam: ఏపీ ప్రభుత్వం మరో శుభవార్త.. 41 లక్షల మంది ఖాతాల్లో డబ్బులు జమ..
- Free Flight Journey: వారికి భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. ఒక రోజు ఉచిత విమాన ప్రయాణం..
- Gold In Bag: అలిపిరిలో దొరికిన బంగారం బ్యాగ్.. సీసీటీవీ పరిశీలించిన అధికారులు..
- Pawan Kalyan: పవన్ కళ్యాణ్ ఆదేశాలతో.. మన్యం జిల్లాకు రెండు కుంకీ ఏనుగులు..
ఎంవోయూపై సంతకం పెడితే ప్రభుత్వ చేతుల్లోకి వెళ్లినట్లే అని ఎగ్జిబిటర్లు,డిస్టిబ్యూటర్స్, థియేటర్స్ యాజమాన్యం ఆందోళన వ్యక్తం చేస్తోంది. అందుకే ఒప్పందంపై సంతకాలు చేయడానికి ససేమిరా అంటున్నారు. అవసరమైతే థియేటర్లను మూసివేసేందుకు కూడా వెనుకాడేది లేదని…టికెట్ డబ్బులు ప్రభుత్వ ఖాతాల్లో కాకుండా ఫిలిం ఛాంబర్ ఆధ్వర్యంలో కానీ,పాత పద్దతిలో కానీ జరగాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం చెప్తున్న 2 పర్సెంట్ కమిషన్ తీసుకున్న కూడా ఏపీలో సినిమా రంగం బాగా దెబ్బ తింటుందని… ఏ కారణం వల్ల సినిమా ఆగిన ఏదైనా కూడా సినిమా డబ్బులు వెంటనే ఇవ్వకపోతే హాళ్ళు పగల కొడతారు దానికి ప్రభుత్వం బాధ్యత తీస్కుంటుందా అన్నారు. అనుభవం లేని జీవోల వల్ల ఇలా అవుతుంది అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు..
జులై 2 లోపు ఎంవోయూ లపై సంతకం చేయకపోతే లైసెన్స్ లు రద్దు చేస్తామని అధికారులు తెలిపిన నేపథ్యంలో.. ఎగ్జిబిటర్ల ఆందోళనను అభ్యంతరాలను తెలియజేస్తూ ఏపీ సీఎంఓకు ఫిలిం ఛాంబర్ లేఖ రాసినట్లు తెలుస్తోంది. ఇకపోతే ఏపీలో ఆన్ లైన్ సినిమా టికెటింగ్ విధానం తీసుకొస్తూ 2021 డిసెంబర్ 17న ప్రభుత్వం జీవో నెం. 142 జారీ చేసింది.టికెట్ ధరల నియంత్రణతో పాటుగా బ్లాక్ టికెట్ల దందాకు చెక్ పెట్టడానికే ఈ గేట్ వే ను తీసుకొస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
పారదర్శకతతో కూడిన ధరలను అమలు చేస్తామని.. ప్రభుత్వ నిర్దేశించిన ధరలను మాత్రమే థియేటర్లో అమలు చేయాలని పేర్కొన్నారు. కానీ ఇందులో కూడా ఇబ్బందులు ఎదుర్కుంటున్నాం అని ప్రభుత్వ తీరుపై ఏపీ ఫిలిం ఛాంబర్ సభ్యులు మండిపడుతున్నారు. ఎన్ని సార్లు చర్చలు పెట్టినా ఉన్న సమస్యలు చెప్పినా పట్టించుకోకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. దానివల్ల సినిమా హాళ్ళు మూసుకోవటం తప్ప ప్రయోజనం లేదని ప్రభుత్వం ఇప్పటికైనా తన తీరును మార్చుకోవాలని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
తాజావార్తలు
-
India Test Squad: శ్రీలంకతో టెస్టు సిరీస్.. టీమిండియాలోకి మరో కొత్త ప్లేయర్!
-
CM Vijay and Trisha Controversy: ఆలయ ఉత్సవాల్లో త్రిష, విజయ్ ఫొటోలతో వివాదాస్పద ఫ్లెక్సీ.. ఇద్దరిపై కేసు
-
Yamaha Electric Scooter: యమహా నుంచి కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. కీ-లెస్ ఇగ్నిషన్, మార్చుకోగల బ్యాటరీతో త్వరలో ఎంట్రీ?
-
Lalit Kumar Modi: ఐపీఎల్ 2009 ఫెమా కేసులో క్లీన్ చిట్.. ఆనందంతో డాన్స్ చేస్తూ రచ్చ రచ్చ.!
-
Cyber Crime: 11వ తరగతి డ్రాపౌట్.. రూ. 64 కోట్ల సైబర్ దోపిడీ.. 18 ఏళ్ల మాస్టర్మైండ్ అరెస్ట్!
ట్రెండింగ్
-
10 రోజుల బ్యాటరీ, 80+ స్పోర్ట్స్ మోడ్లు.! స్క్రీన్ లేకుండానే హెల్త్ ట్రాకింగ్.. Garmin CIRQA స్మార్ట్ బ్యాండ్ లాంచ్.!
-
OLED డిస్ప్లే, RTX 5090 GPUతో పవర్ఫుల్ పనితీరుతో Dell కొత్త Alienware గేమింగ్ ల్యాప్టాప్లు లాంచ్..! ఫీచర్స్, ధరలు ఇలా..!
-
Best Camera Phones: DSLRకు పోటీగా ఫొటోగ్రఫీ అనుభవం..! బెస్ట్ కెమెరా ఫోన్ల లిస్ట్ ఇదిగో..!
-
Cleaning Hacks : తుప్పు పట్టిన ఇనుప అల్మారా కొత్తదానిలా మెరవాలా? ఈ 4 చిట్కాలు చాలు.!
-
Remote Cleaning : వర్షాల్లో టీవీ రిమోట్ పనిచేయడం లేదా? ఈ 4 ట్రిక్స్తో కొత్తదానిలా మారుతుంది.!