ఏపీ ఫైబర్నెట్ కేసు.. తొలిరోజు సీఐడీ విచారణ ఇలా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీ ఫైబర్ నెట్ కేసులో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన దర్యాప్తు అధికారులు… విచారణకు హాజరుకావాలంటూ ముగ్గురు నిందితులకు నోటీసులిచ్చారు. గత ప్రభుత్వంలో ఈ గవర్నెన్స్ సలహాదారుగా ఉన్న వేమూరి హరి ప్రసాద్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఎండిగా చేసిన సాంబశివరావుతో పాటు.. టెండరు దక్కించుకున్న టెరా సాఫ్ ఎండి గోపీచంద్ కు నోటీసులు ఇచ్చారు. నోటీసులు అందుకున్న ముగ్గురిలో హరిప్రసాద్, సాంబశివరావు విచారణకు హాజరు అయ్యారు. సత్యనారాయణ పురంలోని సీఐడీ రిజనల్ కార్యాలయంలో రెండు గంటల పాటు నిందితులను వివిధ అంశాలపై అధికారులు విచారించారు.
ఇక, విచారణకు హాజరైన ఇద్దరు నిందితుల్లో హరిప్రసాద్ ను అధికారులు ప్రశ్నించలేదు. ఆయన కేవలం విచారణకు హారయ్యారు తప్ప… లోపల ఎలాంటి విచారణ జరగలేదు. మళ్లీ విచారణకు రావల్సి ఉంటుందని అధికారులు చెప్పారని… తాను వస్తానని చెప్పినట్లు హరిప్రసాద్ తెలిపారు. ఫైబర్ నెట్ ప్రాజెక్టులో అవినీతి అనేది అవాస్తవం అన్న హరి ప్రసాద్… విచారణ తర్వాత అన్ని అంశాలు వెల్లడిస్తానన్నారు. కేంద్ర ప్రభుత్వ అధికారి అయిన సాంబశివరావు ను మాత్రం కొద్ది సేపు విచారించినట్లు తెలుస్తోంది. ఆయన నుంచి కొంత సమాచారం, కొన్ని అంశాలపై వివరాలు సేకరించినట్లు సమాచారం. ఫైబర్ నెట్ ప్రాజెక్ట్ మొత్తం విలువ 321 కోట్లు కాగా….అందులో 121 కోట్ల అక్రమాలు జరిగాయి అనేది ఆరోపణ. నిబంధనలు ఉల్లంగించి టెండర్లు దక్కించుకున్నారని ప్రస్తుత యాజమాన్యం ఆరోపిస్తోంది. ఇకపోతే నోటీసు అందుకున్న టెరా సాఫ్ ఎండి గోపీచంద్ విచారణకు రాలేదు. ముందస్తు బెయిల్ కోసం గోపీచంద్ ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం.
Also Read
తాజావార్తలు
-
Amit Shah: మధ్యాహ్నం 3 గంటలకు రెడీగా ఉండండి.. విపక్షాలకు అమిత్ షా సవాల్
-
Samuk: ఏలియన్ సినిమాకు సిద్ధమవుతున్న అక్షయ్ .. 90% షూటింగ్ లండన్లో…
-
AI పెట్టుబడుల వేళ Oracleలో ఉద్యోగాల కోతలు.. వేలాది ఉద్యోగాలపై వేటు?
-
CM Vijay: ఆ స్థానాలే కొనసాగించాలి.. డీలిమిటేషన్పై అసెంబ్లీలో విజయ్ తీర్మానం
-
N Chandrasekaran: టాటా గ్రూప్లో కీలక పరిణామం.. చైర్మన్ పదవికి ‘చంద్రశేఖరన్’ రాజీనామా?
ట్రెండింగ్
-
Akhil NRD: “ప్రేమ పెళ్లి”.. కండక్టర్తో లేచిపోయిన ప్రముఖ యూట్యూబర్ భార్య..
-
Ridge Gourd Peel Chutney: బీరకాయ తొక్కతో నోరూరించే పచ్చడి.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే!
-
4K 180Hz డిస్ప్లేతో 55, 65, 75 అంగుళాల్లో Hisense UR8S MiniLED TVలు లాంచ్..!
-
9,070mAh బ్యాటరీ, IP69 రేటింగ్, AMOLED డిస్ప్లేతో REDMI K100 Pro Max లాంచ్..!
-
200MP ట్రిపుల్ కెమెరా సెటప్, 8,580mAh బ్యాటరీ, 185Hz డిస్ప్లేతో REDMI K100 Pro లాంచ్.. ధర ఎంతంటే?