Living Daughter Last Rites: చిత్తూరు జిల్లాలోని SR పురం మండలం పిల్లారి కుప్పం గ్రామంలో తల్లిదండ్రులను కాదని ప్రేమ పెళ్లి చేసుకున్న కుమార్తెకు తల్లిదండ్రులు కర్మకాండలు నిర్వహించారు. పిల్లారి కుప్పం గ్రామంలో సుబ్రహ్మణ్యం రెడ్డి కుమార్తె హేమ ప్రియ అదే గ్రామానికి చెందిన కిషోర్ అనే యువకుడు ప్రేమించుకున్నారు. అబ్బాయి తల్లిదండ్రులు అమ్మాయి తల్లిదండ్రులని గత వారం క్రితం మీ కుమార్తెను మా కుమారుడికి ఇచ్చి పెళ్లి చేయండి, వాళ్లిద్దరూ ప్రేమించుకుంటున్నారు అని అబ్బాయి తల్లిదండ్రులు అడగడంతో కుదరదని అమ్మాయి పేరెంట్స్ తెలిపారు.
Read Also: 9500 ప్రాసెసర్, 1.5K AMOLED డిస్ప్లే, హెవీ మల్టీటాస్కింగ్తో Oppo K14 Turbo Series లాంచ్
దీంతో హేమ ప్రియ- కిశోర్ ఇద్దరూ ఇంటి నుంచి వెళ్లి వివాహం చేసుకొని బెంగళూరుకు వెళ్లినట్లు సమాచారం. ఇది తెలుసుకున్న అమ్మాయి తల్లిదండ్రులు తర్వాత రోజు గ్రామంలో నా కుమార్తె చనిపోయింది అని పిండ ప్రదానం చేశారు. ఆ అమ్మాయి చిత్రపటానికి నివాళులర్పించారు. గ్రామంలో బంధువులకి మా కుమార్తె చనిపోయింది అని కర్మ క్రియలు చేస్తూ అన్నదానం చేశారు.
