MLA Thomas: జీడీ నెల్లూరు ఎమ్మెల్యే డాక్టర్ థామస్ మరోసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బూత్ లెవెల్ ఏజెంట్ల సమావేశంలో థామస్ చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి. నారాయణస్వామి ఎంపీపీ సీటు అమ్ముకుని తిరుపతిలో కోటిన్నర విల్లా కొన్నాడని ఓపెన్ గా ఎటాక్ చేశారు. నారాయణస్వామి నన్ను గెలకవద్దు.. నన్ను గెలికితే నీకు రాత్రి పూట నిద్ర కూడా పట్టదు.. ఏ అర్ధరాత్రో హార్ట్ ఎటాక్ వచ్చి పోతావ్” అంటూ థామస్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గతంలో జీడీ నెల్లూరులో పాదయాత్ర చేసిన నారా లోకేష్ పై అక్రమంగా కేసులు పెట్టించావని, లోకేష్ పై కేసు పెట్టేంత మగాడివా నువ్వు… నేను అనుకుంటే ఈ రాత్రికే కట్ డ్రాయర్ తో పోలీస్ స్టేషన్ లో నిన్ను కూర్చోబెట్టగలను… చంద్రబాబుకు ఇలాంటి పనులు నచ్చవు కాబట్టే తాము పద్ధతిగా పోతున్నామన్నారు.
ఇక, నారాయణస్వామికి మతిస్థిమితం లేదని బయట ఎక్కడా మంచి హాస్పిటల్ దొరకనట్లు ఉందని, ఒకవేళ తన హాస్పిటల్ కి వస్తే మూడు సార్లు కరెంట్ షాక్ ఇస్తే అంతా సెట్ అవుతాయాన్నారు థామస్.. తాను చదువుకున్న వాడిని కాబట్టే ఎంతో బాధ్యతగా మాట్లాడుతున్నానని, నారాయణస్వామి కంటే దారుణంగా బూతులు మాట్లాడగలనని చెప్పారు. తాను గనుక నోరు తెరిచి మాట్లాడితే ముక్కు, చెవుల నుంచి రక్తం వస్తుందని హెచ్చరించారు. అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబును ఎంత అసభ్య పదజాలంతో దూషించావో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసని నేను ఒక్క పిలుపు ఇస్తే నారాయణస్వామి ఇల్లు దాటి బయటకు కూడా రాలేడంటూ వార్నింగ్ ఇచ్చారు ఎమ్మెల్యే థామస్..

