Site icon NTV Telugu

CM Chandrababu: నేడు చిత్తూరు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన

Chandrababu

Chandrababu

CM Chandrababu: ఇవాళ చిత్తూరు జిల్లా జీడీ నెల్లూరు జిల్లాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు. మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో జీడీ నెల్లూరులోని రామానాయుడు పల్లెకు చేరుకోనున్నారు. జీడి నెల్లూరులో ఎన్టీఆర్ భరోసా పింఛన్లు లబ్ధిదారులకు అందివ్వనున్నారు సీఎం. పది సూత్రాలలో భాగంగా ఏర్పాటు చేసిన స్టాల్స్ పరిశీలించనున్నారు. అలాగే, ప్రజా వేదిక సభ నుంచి స్థానిక ప్రజల్ని ఉద్దేశించి చంద్రబాబు మాట్లాడనున్నారు. రామానాయుడు పల్లెలో స్థానిక టీడీపీ నేతలతో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. మధ్యాహ్నం 3.55 గంటలకు తిరుపతిలోని రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుంచి తిరిగు పయనంలో అమరావతికి రానున్నారు సీఎం చంద్రబాబు.

Exit mobile version