Andrapradesh : తిరుపతిలో ఘోర రోడ్డు ప్రమాదం..ఐదుగురు మృతి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చిత్తూరు జిల్లా తిరుపతిలో వరుస ప్రమాదాలు జరుగుతున్నాయి.. తాజాగా మరో ఘోర ప్రమాదం జరిగింది.. ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడిక్కడికే చనిపోగా, 8 మందికి తీవ్రగాయాలు అయ్యాయి.. తిరుపతి జిల్లా ఎస్వీ పురం టోల్ప్లాజా సమీపంలో ఎదురుగా వస్తున్న టెంపో ట్రావెలర్ వాహనాన్ని హెరిటేజ్ మిల్క్ ట్యాంకర్ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది.. పుత్తూరు-తిరుపతి జాతీయ రహదారిపై అంజేరమ్మ కనుమ వద్ద ఈ ఘోర ప్రమాదం జరిగింది.. అతి వేగం వల్లే ప్రమాదం జరిగిందని పోలీసులు గుర్తించారు..
పోలీసుల వివరాల మేరకు..తిరుపతిలోని ఎస్ఆర్ ఇండియా ప్రైమ్ ప్రాపర్టీస్ రియల్ ఎస్టేట్ నిర్వాహకులు సుబ్రహ్మణ్యం, రాజశేఖర్రెడ్డి వడమాలపేట మండలం ఎస్వీ పురంలోని అంజేరమ్మకు మొక్కు చెల్లించేందుకు ఆదివారం బయలుదేరారు.. వారి కార్యాలయంలో పనిచేసే 12 మంది సిబ్బంది టెంపో ట్రావెలర్లో బయలుదేరారు. టెంపో టోల్ప్లాజా దాటి అంజేరమ్మ ఆలయానికి వెళ్తున్న సమయంలో ఎదురుగా వేగంగా వస్తున్న హెరిటేజ్ పాల ట్యాంకర్ ను ఢీ కొట్టింది.. ఈ ప్రమాదం సమయంలో టెంపోలో 12 మందితోపాటు మిల్క్ ట్యాంకర్ డ్రైవర్కు తీవ్ర గాయాలయ్యాయి…
Also Read
- RK Roja: రాజకీయాలంటేనే టెన్షన్.. ఎమ్మెల్యే అయ్యాకే బీపీ, షుగర్ ఎటాక్..!
- Chittoor Mayor Couple Murder Case: మాజీ మేయర్ కఠారి దంపతుల హత్య కేసు.. మరోసారి కోర్టు సీరియస్.. కలెక్టర్కు కీలక అదేశాలు..
- AP Crime: పేకాటలో బాకీ వివాదం.. స్నేహితుడిని తుపాకీతో కాల్చి చంపిన యువకుడు..
- Young Man D*ied with Heart Attack in Gym: జిమ్లో గుండెపోటుతో యువకుడు మృతి..
టోల్ ప్లాజా అంబులెన్స్ లో క్షతగాత్రులను పుత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ ఇద్దరు మృతి చెందారు.. ఇక మెరుగైన చికిత్స కోసం తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించగా.. అక్కడ కూడా చికిత్స పొందుతూ మరో ముగ్గురు మృతి చెందినట్లు సమాచారం.. క్షతగాత్రుల్లో నెల్లూరు కు చెందిన రాజశేఖర్, తిరుపతి కొత్తపల్లెకి చెందిన లతారెడ్డి, సత్యనారాయణపురానికి చెందిన కాంతిరేఖ, నారాయణరెడ్డి, రెడ్డిగుంటకు చెందిన కుమారస్వామి రెడ్డి, అన్నమయ్య జిల్లా రామాపురానికి చెందిన నరసింహులు, రాజంపేటకు చెందిన సుజాత, సత్యసాయి జిల్లాకు చెందిన ఆంజనేయులు వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.. ఈ ఘటన పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.. తాజాగా మరో ప్రమాదం జరిగింది.. రెండు టెంపో ట్రావెలర్ వాహనాలకు బ్రేక్ ఫెయిల్ కావడంతో ఐదుగురికి గాయాలయ్యాయి.పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నాయి..
తాజావార్తలు
-
NEET-UG 2026 paper leak: నీట్ పేపర్ లీక్ను ఛేదించిన సీబీఐ.. అసలు సూత్రధారి కెమిస్ట్రీ లెక్చరర్..
-
Viral Suit Chef: రోడ్డు పక్కన ఫ్రైడ్ రైస్ అమ్ముతూ నెల రూ.7 లక్షలు సంపాదిస్తున్న 19 ఏళ్ల కుర్రాడు..
-
Chennai: టెక్ మహీంద్రా కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం.. మంటల్లో ఆఫీస్ దగ్ధం
-
Pawan Kalyan : ఒక్కడిగా మొదలై.. లక్షలాది మంది సైన్యంగా.. జనసేన విస్తరణపై పవన్ కీలక వ్యాఖ్యలు.!
-
FSSAI : పామాయిల్పై కీలక ప్రకటన.. అపోహలు వద్దు.. అది సురక్షితం..!
ట్రెండింగ్
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!