Chandra Babu: కొండల్ని అక్రమంగా తవ్వేస్తున్న వారందరినీ బోనెక్కిస్తాం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ అధినేత చంద్రబాబు మరోసారి నిప్పులు చెరిగారు. జగన్ రెడ్డి గ్యాంగ్ కొండల్ని తవ్వేసి చెరువులుగా చేసేస్తున్నారు. చెట్లని కొట్టేస్తే పెంచొచ్చు.. కొండల్ని తవ్వేస్తే ఎలా అని వైసీపీ నేతలను ప్రశ్నించారు. విశాఖలోని రుషికొండను ఇష్టం వచ్చినట్లు తవ్వేశారని.. విశాఖకు మణిహారంగా ఉన్న రుషికొండను ధ్వంసం చేయడంపై చంద్రబాబు మండిపడ్డారు. రుషికొండను తవ్వొద్దంటూ ఎన్జీటీ ఆదేశాలపై ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లిందని.. కాలజ్ఞానం రాసిన బ్రహ్మంగారికి కూడా అంతుబట్టని విధంగా రవ్వల కొండను తవ్వేశారని ఆవేదన వ్యక్తం చేశారు. రవ్వల కొండలో బ్రహ్మంగారు కాలజ్ఞానం రాశారని.. అలాంటి కొండను తవ్వేసి సెంటిమెంటును దెబ్బ తీశారన్నారు.
Read Also: Tirumala: తిరుమలలో యూపీఐ ద్వారా చెల్లింపులు షురూ
Also Read
- Nellore: కోడూరు బీచ్లో విషాదం.. ముగ్గురు గల్లంతు.. బాలుడి మృతి
- CM Chandrababu : మార్కాపురం జిల్లా హామీని నిలబెట్టుకున్నాం.. రాష్ట్ర అభివృద్ధి కోసమే కూటమి ఏర్పాటు
- CM Chandrababu: వెలిగొండ ప్రాజెక్ట్తో దశాబ్దాల కరవు పోతుంది.. అభివృద్ధికి ఓటేయాలన్న చంద్రబాబు
- Pawan Kalyan: సంక్షేమ పథకాలపై పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు.. దానికి వైసీపీనే ఉదాహరణ..!
వైసీపీ అధికారంలోకి వచ్చాక కాకినాడలో మడ అడవులు కొట్టేశారని.. తుఫాన్ల నుంచి రక్షణగా నిలిచేందుకు మడ అడవులు ఉపయోగపడతాయని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. ప్రకృతి నాశనం అయ్యేలా వ్యవహరిస్తోన్న అంశంపై సీఎం జగన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. భారతీ సిమెంట్స్ కోసం బమిడికలొద్దిలో లాటరైట్, బాక్సైట్ తవ్వకాలు జరుపుతున్నారన్నారు. కుప్పంలో కూడా ఇదే తరహాలో తవ్వేస్తున్నారన్నారు.కుప్పంలో అక్రమంగా జరిగే మైనింగ్ ప్రాంతం వద్దకు తాను వెళ్లినా రానివ్వకుండా అడ్డుకున్నారని ఆరోపించారు. వైసీపీకి ఖండకావరం పెరిగిందని.. కొండల్ని అక్రమంగా తవ్వేస్తున్న వారందర్ని బోనెక్కిస్తామని చంద్రబాబు హెచ్చరించారు. ఇసుక మాఫియా కారణంగా అన్నమయ్య డ్యాం కొట్టుకెళ్లిందని.. 60 మందికి పైగా ప్రాణాలు పోయాయన్నారు. ప్రభుత్వం దున్నపోతు మీద వర్షం పడిన తరహాలో వ్యవహరిస్తోందన్నారు. టీడీపీ హయాంలో ఏపీలో గ్రీనరీ కవర్ పెంచామని.. చెట్ల వల్లే క్వాలిటీ ఆఫ్ లైఫ్ వస్తుందన్నారు. తొలుత కొండలకు గుండు కొట్టారని.. ఆ తర్వాత చెరువులను తవ్వేశారని చంద్రబాబు చురకలు అంటించారు.
కొండల్ని చెరువులుగా మారుస్తున్న జగన్ రెడ్డి గ్యాంగ్ – టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు మీడియా సమావేశం, ఎన్టీఆర్ భవన్, అమరావతి నుండి ప్రత్యక్ష ప్రసారం. https://t.co/CfBRFyaIAn
— Telugu Desam Party (@JaiTDP) July 13, 2022
తాజావార్తలు
-
Nellore: కోడూరు బీచ్లో విషాదం.. ముగ్గురు గల్లంతు.. బాలుడి మృతి
-
Rajasthan: 13 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం.. రాజస్థాన్ను కుదిపేస్తున్న ఘటన..
-
Indiramma Houses: ఇందిరమ్మ ఇళ్లకు కొత్త రూల్స్.. స్లాబ్ పెద్దదైతే డబ్బులు కట్.!
-
Supreme Court: నెహ్రూ నుంచి మోడీ పాలన దాకా పెండింగ్లో ఉన్న భూ-కేసు పరిష్కారం.. మిస్టరీ ఏంటంటే..!
-
Varanasi : జక్కన్న ఇలా షాకిచ్చాడేంటి?
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!