Chandrababu to Visit Flood Affected Areas: విలీన మండలాల్లో చంద్రబాబు పర్యటన.. షెడ్యూల్ ఇదే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జులై నెలలోనే గోదావరి పోటెత్తింది.. లంక గ్రామాలు సహా.. ఎన్నో ప్రాంతాలను ముంచెత్తింది.. చేసేది ఏమీ లేక.. ఉన్న ఊళ్లను వదిలి.. పునరావాస కేంద్రాల్లో తలదాచుకోవాల్సిన పరిస్థితి వచ్చింది.. ఇక, వదరలు తగ్గుముఖం పట్టడంతో.. బాధితులంతా మళ్లీ గ్రామాలకు చేరుకుంటున్నారు.. బురదతో నిండిపోయిన తమ ఇళ్లను పరిసరాలను క్లీన్ చేసుకుంటున్నారు.. ఇదే సమయంలో.. పరామర్శల పర్వం కొనసాగుతోంది.. ఇప్పటికే ముంపు ప్రాంతాల్లో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటించగా.. ఇప్పుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటన.. పరామర్శలు కొనసాగుతున్నాయి.. మరోవైపు.. పోలవరం విలీన మండలాల్లో పర్యటించేందుకు సిద్ధం అయ్యారు చంద్రబాబు నాయుడు.. రేపు, ఎల్లుండి.. రెండు రోజుల పాటు.. ఆయన గోదావరి వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్నారు.
Read Also: Minister KTR : కాలికి గాయంతోనే ప్రజాసేవలో కేటీఆర్
Also Read
- APL 2026: బోణీ కొట్టిన అమరావతి రాయల్స్.. 6 వికెట్ల తేడాతో విజయం
- Pawan Kalyan: ‘ఇది ఎవరి జాగీరు కాదు.. నా మాతృభూమి’.. మీ అయ్య జాగీరా అనొద్దా?
- Home Minister Anitha: విశాఖలో జగన్ పర్యటనపై హోంమంత్రి కౌంటర్.. మీకు ఆ హక్కు లేదు..!
- Amaravati Development: అమరావతికి కేంద్రం భారీ శుభవార్త.. రాజధాని రూపురేఖలు మారనున్నాయా..?
ఇక, గోదావరి వరద ప్రభావిత ప్రాంతాల్లో రేపు, ఎల్లుండి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి సంబంధించిన పర్యటన వివరాల్లోకి వెళ్తే.. రేపు ఉదయం 8 గంటలకు తన నివాసం నుంచి వరద ప్రాంతాల పర్యటనకు బయల్దేరనున్నారు చంద్రబాబు. మొదటి రోజు అనగా ఈ నెల 28వ తేదీన.. వేలేరుపాడు, కుక్కునూరు మండలాల్లో బాబు పర్యటన కొనసాగనుంది.. శివకాశీపురం, కుక్కునూరులో బాధితులను పరామర్శించనున్న ఆయన.. అనంతరం భద్రాద్రి జిల్లా బూర్గంపహాడ్ లో ముంపు ప్రాంతాలకు వెళ్లనున్నారు.. మరోవైపు.. రెండో రోజు ఎటపాక, కూనవరం, వీఆర్ పురం మండలాల్లో పర్యటించనున్నారు చంద్రబాబు. తోటపల్లి, కోతులగుట్ట, కూనవరం, రేఖపల్లి ప్రాంతాల్లో ఆయన పర్యటన సాగనుంది.. ఇక, గురువారం రాత్రి భద్రాచలంలో బస చేయనున్న చంద్రబాబు… శుక్రవారం భద్రాద్రి రామయ్యను దర్శించుకోనున్నారు.. ఇప్పటికే భద్రాచలం సమీపంలోని ఐదు గ్రామ పంచాయతీలు.. తమను తెలంగాణలో కలపాలని కోరుతూ ఏకగ్రీవంగా తీర్మానాలు చేసిన విషయం తెలిసిందే.. ఈ సమయంలో విలీన మండలాల్లో టీడీపీ అధినేత చంద్రబాబు టూర్.. ఆసక్తికరంగా మారింది.
తాజావార్తలు
-
Story Board: హైదరాబాద్లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
-
RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
-
Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
-
Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
-
Whats App: వాట్సాప్లో అద్బుత ఫీచర్.. ఫార్వార్డెడ్ మెసేజ్ మొదట ఎక్కడ నుంచి వచ్చిందో కనిపెట్టడం చాలా ఈజీ..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!