Chandrababu to Visit Flood Affected Areas: విలీన మండలాల్లో చంద్రబాబు పర్యటన.. షెడ్యూల్ ఇదే..!
జులై నెలలోనే గోదావరి పోటెత్తింది.. లంక గ్రామాలు సహా.. ఎన్నో ప్రాంతాలను ముంచెత్తింది.. చేసేది ఏమీ లేక.. ఉన్న ఊళ్లను వదిలి.. పునరావాస కేంద్రాల్లో తలదాచుకోవాల్సిన పరిస్థితి వచ్చింది.. ఇక, వదరలు తగ్గుముఖం పట్టడంతో.. బాధితులంతా మళ్లీ గ్రామాలకు చేరుకుంటున్నారు.. బురదతో నిండిపోయిన తమ ఇళ్లను పరిసరాలను క్లీన్ చేసుకుంటున్నారు.. ఇదే సమయంలో.. పరామర్శల పర్వం కొనసాగుతోంది.. ఇప్పటికే ముంపు ప్రాంతాల్లో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటించగా.. ఇప్పుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటన.. పరామర్శలు కొనసాగుతున్నాయి.. మరోవైపు.. పోలవరం విలీన మండలాల్లో పర్యటించేందుకు సిద్ధం అయ్యారు చంద్రబాబు నాయుడు.. రేపు, ఎల్లుండి.. రెండు రోజుల పాటు.. ఆయన గోదావరి వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్నారు.
Read Also: Minister KTR : కాలికి గాయంతోనే ప్రజాసేవలో కేటీఆర్
Also Read
- Chandrababu warning: పార్టీ నేతలకు చంద్రబాబు క్లాస్.. తప్పులు చేస్తే హెడ్లైన్స్లోకి వెళ్తారు అంటూ హెచ్చరిక
- Chandrababu: తెలుగు జాతి ఉన్నంత వరకు టీడీపీ ఉంటుంది.. కార్యకర్తలు ఎప్పుడూ మీసం మెలేస్తారు.. ఎవ్వరికీ తలవంచరు..
- TDP నూతన కార్యవర్గం ప్రమాణస్వీకారం.. చంద్రబాబు ఆధ్వర్యంలో ఘనంగా కార్యక్రమం
- AP SSC Results 2026: రేపే ఏపీ టెన్త్ ఫలితాలు.. ఇలా కూడా చెక్ చేసుకోవచ్చు..
ఇక, గోదావరి వరద ప్రభావిత ప్రాంతాల్లో రేపు, ఎల్లుండి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి సంబంధించిన పర్యటన వివరాల్లోకి వెళ్తే.. రేపు ఉదయం 8 గంటలకు తన నివాసం నుంచి వరద ప్రాంతాల పర్యటనకు బయల్దేరనున్నారు చంద్రబాబు. మొదటి రోజు అనగా ఈ నెల 28వ తేదీన.. వేలేరుపాడు, కుక్కునూరు మండలాల్లో బాబు పర్యటన కొనసాగనుంది.. శివకాశీపురం, కుక్కునూరులో బాధితులను పరామర్శించనున్న ఆయన.. అనంతరం భద్రాద్రి జిల్లా బూర్గంపహాడ్ లో ముంపు ప్రాంతాలకు వెళ్లనున్నారు.. మరోవైపు.. రెండో రోజు ఎటపాక, కూనవరం, వీఆర్ పురం మండలాల్లో పర్యటించనున్నారు చంద్రబాబు. తోటపల్లి, కోతులగుట్ట, కూనవరం, రేఖపల్లి ప్రాంతాల్లో ఆయన పర్యటన సాగనుంది.. ఇక, గురువారం రాత్రి భద్రాచలంలో బస చేయనున్న చంద్రబాబు… శుక్రవారం భద్రాద్రి రామయ్యను దర్శించుకోనున్నారు.. ఇప్పటికే భద్రాచలం సమీపంలోని ఐదు గ్రామ పంచాయతీలు.. తమను తెలంగాణలో కలపాలని కోరుతూ ఏకగ్రీవంగా తీర్మానాలు చేసిన విషయం తెలిసిందే.. ఈ సమయంలో విలీన మండలాల్లో టీడీపీ అధినేత చంద్రబాబు టూర్.. ఆసక్తికరంగా మారింది.
తాజావార్తలు
-
Ramya Krishna : రేపు పెళ్లి అనంగా.. రాత్రి 2 వరకు ఎన్టీఆర్ తోనే ఉన్న..!
-
Donald Trump: ట్రంప్ను రోస్ట్ చేసిన కింగ్ చార్లెస్.. మేము లేకపోతే మీరు ఫ్రెంచ్ మాట్లాడేవారంటూ ఎగతాళి
-
KTR: కేసీఆర్ అప్పుడే చిలుకకు చెప్పినట్టు చెప్పారు.. కల్వకుర్తి సభను గుర్తు చేసిన కేటీఆర్..
-
Uttam Kumar Reddy: ప్రాణహిత-చేవెళ్లపై వెనక్కి తగ్గేదే లేదు! తుమ్మిడిహట్టి ప్రతిపాదనలపై మంత్రి ఉత్తమ్ కీలక ప్రకటన
-
Malla Reddy: పార్టీ మార్పుపై మాజీ మంత్రి మల్లారెడ్డి కీలక వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో