Chandrababu to Visit Flood Affected Areas: విలీన మండలాల్లో చంద్రబాబు పర్యటన.. షెడ్యూల్ ఇదే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జులై నెలలోనే గోదావరి పోటెత్తింది.. లంక గ్రామాలు సహా.. ఎన్నో ప్రాంతాలను ముంచెత్తింది.. చేసేది ఏమీ లేక.. ఉన్న ఊళ్లను వదిలి.. పునరావాస కేంద్రాల్లో తలదాచుకోవాల్సిన పరిస్థితి వచ్చింది.. ఇక, వదరలు తగ్గుముఖం పట్టడంతో.. బాధితులంతా మళ్లీ గ్రామాలకు చేరుకుంటున్నారు.. బురదతో నిండిపోయిన తమ ఇళ్లను పరిసరాలను క్లీన్ చేసుకుంటున్నారు.. ఇదే సమయంలో.. పరామర్శల పర్వం కొనసాగుతోంది.. ఇప్పటికే ముంపు ప్రాంతాల్లో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటించగా.. ఇప్పుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటన.. పరామర్శలు కొనసాగుతున్నాయి.. మరోవైపు.. పోలవరం విలీన మండలాల్లో పర్యటించేందుకు సిద్ధం అయ్యారు చంద్రబాబు నాయుడు.. రేపు, ఎల్లుండి.. రెండు రోజుల పాటు.. ఆయన గోదావరి వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్నారు.
Read Also: Minister KTR : కాలికి గాయంతోనే ప్రజాసేవలో కేటీఆర్
Also Read
- AP Government Schools: ప్రైవేట్ స్కూళ్లకు షాక్.. ప్రభుత్వ పాఠశాలల్లో భారీగా విద్యార్థుల చేరిక
- Deputy CM Pawan Kalyan: రాష్ట్ర సంపదను కాపాడుతాం.. స్మగ్లర్లకు పవన్ కల్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్..
- IAS Srilakshmi: ఏపీ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా శ్రీలక్ష్మి.. రెండేళ్ల తర్వాత కీలక పోస్టింగ్.. ట్విస్ట్ ఏంటంటే..?
- CM Chandrababu: మూడు రాష్ట్రాల భవిష్యత్తుకు తుంగభద్ర నాంది.. చరిత్ర సృష్టించిన సీఎంల భేటీ..
ఇక, గోదావరి వరద ప్రభావిత ప్రాంతాల్లో రేపు, ఎల్లుండి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి సంబంధించిన పర్యటన వివరాల్లోకి వెళ్తే.. రేపు ఉదయం 8 గంటలకు తన నివాసం నుంచి వరద ప్రాంతాల పర్యటనకు బయల్దేరనున్నారు చంద్రబాబు. మొదటి రోజు అనగా ఈ నెల 28వ తేదీన.. వేలేరుపాడు, కుక్కునూరు మండలాల్లో బాబు పర్యటన కొనసాగనుంది.. శివకాశీపురం, కుక్కునూరులో బాధితులను పరామర్శించనున్న ఆయన.. అనంతరం భద్రాద్రి జిల్లా బూర్గంపహాడ్ లో ముంపు ప్రాంతాలకు వెళ్లనున్నారు.. మరోవైపు.. రెండో రోజు ఎటపాక, కూనవరం, వీఆర్ పురం మండలాల్లో పర్యటించనున్నారు చంద్రబాబు. తోటపల్లి, కోతులగుట్ట, కూనవరం, రేఖపల్లి ప్రాంతాల్లో ఆయన పర్యటన సాగనుంది.. ఇక, గురువారం రాత్రి భద్రాచలంలో బస చేయనున్న చంద్రబాబు… శుక్రవారం భద్రాద్రి రామయ్యను దర్శించుకోనున్నారు.. ఇప్పటికే భద్రాచలం సమీపంలోని ఐదు గ్రామ పంచాయతీలు.. తమను తెలంగాణలో కలపాలని కోరుతూ ఏకగ్రీవంగా తీర్మానాలు చేసిన విషయం తెలిసిందే.. ఈ సమయంలో విలీన మండలాల్లో టీడీపీ అధినేత చంద్రబాబు టూర్.. ఆసక్తికరంగా మారింది.
తాజావార్తలు
-
Harmanpreet Kaur: ‘చాలా సంతోషంగా ఉంది.. ఈ సీక్రెట్ ప్లాన్తో ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్కు వెళ్తాం’..
-
HYDRAA : హైదరాబాద్ చెరువులకు హైడ్రా టచ్.. రూ.107 కోట్ల భారీ ప్రాజెక్ట్.!
-
Kitchen Cleaning Tips: వంటగది లైట్ స్విచ్లపై జిగురు మరకలా? 5 నిమిషాల్లో క్లీనింగ్కు సూపర్ టిప్స్
-
Ind Vs Ban: బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం.. సెమీస్ రేసులో దూసుకెళ్లిన టీమిండియా..
-
First T20 Captain: ధోని కాదు.. భారత్కు తొలి టీ-20 కెప్టెన్ ఎవరో తెలుసా..?
ట్రెండింగ్
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!