ఎస్ఈసీకి చంద్రబాబు లేఖ.. తక్షణం చర్యలు తీసుకోండి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నెల్లూరు కార్పొరేషన్ ఎన్నికల ప్రక్రియలో అక్రమాలు చోటు చేసుకుంటున్నాయంటూ ఎస్ఈసీకి లేఖ రాశారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. నెల్లూరు కార్పోరేషన్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తుది జాబితాను ప్రకటించడంలో అధికారులు కావాలనే జాప్యం చేస్తున్నారని లేఖలో పేర్కొన్నారు… డాక్యుమెంట్లను తారుమారు చేసేందుకే అభ్యర్థుల తుది జాబితాను ప్రకటించడం లేదనే అనుమానాన్ని వ్యక్తం చేశారు చంద్రబాబు. ఫోర్జరీ సంతకాలతో ప్రతిపక్ష పార్టీ అభ్యర్థుల నామినేషన్లను విత్ డ్రా చేసుకున్నట్టు డాక్యుమెంట్లు సృష్టిస్తున్నారని ఎస్ఈసీకి తన లేఖ ద్వారా ఫిర్యాదు చేశారు టీడీపీ అధినేత.. నెల్లూరు కార్పోరేషన్ ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడిన అధికారులపై వెంటనే చర్యలు తీసుకోవాలని కూడా ఆయన డిమాండ్ చేశారు.. నెల్లూరు కార్పోరేషన్ ఎన్నికల్లో అక్రమాలను నివారించేలా తక్షణం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్త చేశారు.
మరోవైపు.. స్థానిక ఎన్నికల్లో అక్రమాలు.. దౌర్జన్యాలు.. దురాగతాలు చేస్తున్నారంటూ ఆరోపించారు చంద్రబాబు.. నెల్లూరు కార్పోరేషన్ ఎన్నికల్లో ఇప్పటి వరకు పోటీలో ఉన్న అభ్యర్థులెవరో ఎందుకు ప్రకటించడం లేదు..? అని ప్రెస్మీట్లో నిలదీసిన ఆయన.. ఎస్ఈసీ ఏం చేస్తున్నారు..? కలెక్టర్ ఏం చేస్తున్నారు..? అంటూ ప్రశ్నించారు.. దినేష్ కుమార్ అనే అధికారి వైసీపీకి అనుకూలంగా అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.. నెల్లూరు కార్పోరేషన్ పరిధిలో మొత్తంగా 8 డివిజన్లు ఏకగ్రీవం అని ఏకపక్షంగా ప్రకటించేశారని విమర్శించారు.. అభ్యర్థుల జాబితాను ప్రకటించకుండా.. ఏకగ్రీవాలను ప్రకటించేస్తారా..? ఎంత ధైర్యం ఉంటే ఈ విధంగా అడ్డగోలుగా వ్యవహరిస్తారూ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.. నెల్లూరు కార్పొరేషన్ ఎన్నికలను నిలుపుదల చేయాలని డిమాండ్ చేశారు.. నెల్లూరు కార్పోరేషన్ ఎన్నికల్లో జరిగిన అక్రమాలను నిగ్గు తేల్చండి.. ఆ తర్వాతే ఎన్నికలను నిర్వహించాలని.. వైసీపీకి పోటీ చేసే అర్హతే లేదని కామెంట్ చేశారు చంద్రబాబు.
Also Read
- Big Scam: సహకార సొసైటీలో భారీ స్కాం.. ఎరువులు రైతులకు ఇస్తున్నట్లు నమ్మించి రూ.1.60 కోట్లు స్వాహా...
- DSC Notification: నిరుద్యోగులకు శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. డీఎస్సీకి ముహూర్తం ఖరారు..
- Nara Lokesh: గిరిజన ప్రాంతాలకు గుడ్ న్యూస్.. వచ్చే ఏడాదిలోగా పాఠశాలలకు సొంత భవనాలు
- Dharmana Krishnadas: 'ఈరోజు అప్పలరాజు.. రేపు మేమే'.. కూటమి ప్రభుత్వంపై ధర్మాన సంచలన వ్యాఖ్యలు
- Tags
తాజావార్తలు
-
Abhijeet Dipke: సోనమ్ వాంగ్చుక్, కాంగ్రెస్పై అభిజిత్ దీప్కే సంచలన వ్యాఖ్యలు..
-
Vaibhav Sooryavanshi: అమ్మా… నీ కోసమే ఈ ఫిఫ్టీ.. వైభవ్ సూర్యవంశీ భావోద్వేగ ప్రకటన..
-
Khammam Cyber Fraud : రూ.1,000 కోట్ల సైబర్ స్కామ్.. ఖమ్మం కేసులో SIT ఎంట్రీ
-
Gujarat Floods: గుజరాత్ను ముంచెత్తిన వరదలు.. నీళ్లల్లోనే పలు నగరాలు
-
Bitchat: సీజేపీ నిరసనల్లో ఉపయోగించిన ‘‘బిట్చాట్’’ యాప్పై కేంద్రం చర్యలు..
ట్రెండింగ్
-
కేవలం రూ. 8,999 లకే120Hz డిస్ప్లే, 6000mAh బ్యాటరీతో Lava Virat V1 5G, Virat V1 స్మార్ట్ఫోన్లు లాంచ్..!
-
రూ. 19,499లకే 50MP సోనీ కెమెరా, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో iQOO Z11 Lite 5G లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: సక్సెస్ను తలకెక్కించుకోను.. బుద్దిగా ఉంటా.. వైభవ్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Kakarakaya Ulli Karam: చేదు లేకుండా కమ్మటి ‘కాకరకాయ ఉల్లి కారం’.. ఇలా చేస్తే పిల్లలు కూడా వదలకుండా తింటారు!
-
Vaibhav Sooryavanshi: బుడ్డోడి బ్యాటింగ్ మిస్ అయ్యారా?.. వైభవ్ మెరుపు ఇన్నింగ్స్ ఫుల్ వీడియో మీకోసమే!