Byreddy Siddharth Reddy: కూటమి అధికారంలోకి వచ్చినప్పుడే అక్రమ అరెస్టులు ఉంటాయని తెలుసు..
- కూటమి అధికారంలోకి వచ్చినప్పుడే అక్రమ అరెస్టులు ఉంటాయని తెలుసు..
- ఎంపీ మిథున్ రెడ్డి అరెస్ట్ మాకు ఆశ్చర్యం కలిగించే విషయం కాదు..
- మిథున్ రెడ్డిని మానసికంగా ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతోనే అక్రమ కేసులు పెట్టారు..
- నకిలీ మద్యం సేవించి వేలాది మంది చనిపోయారని పుకార్లు పుట్టించారు..
- నకిలీ మద్యం కేసులో ఇప్పటి వరకూ ఎవరినైనా అరెస్ట్ చేశారా?: బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Byreddy Siddharth Reddy: రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్లో ఉన్న ఎంపీ మిథున్ రెడ్డిని, వైసీపీ యువనేత, శాప్ మాజీ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి పరామర్శించారు. మధ్యంతర బెయిల్ అనంతరం ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో తిరిగి రిమాండ్ కొనసాగుతున్న మిథున్ రెడ్డిని, సిద్ధార్థ రెడ్డితో పాటు రాజమండ్రి రుడా మాజీ చైర్మన్ షర్మిలా రెడ్డి ఇవాళ ములాఖాత్ అయ్యారు. ఈ సందర్భంగా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి మాట్లాడుతూ.. చిత్తూరు జిల్లాలో మూడు దశాబ్దాలుగా పెద్దిరెడ్డి కుటుంబం ప్రజలకు సేవ చేస్తోందని అన్నారు. నారా లోకేష్ భవిష్యత్తుకు మిథున్ రెడ్డి అడ్డుగా మారతాడనే ఉద్దేశంతోనే అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేశారని ఆరోపించారు. అలాగే, సుగాలీ ప్రీతి కేసులో ఆమె తల్లిదండ్రులు టీడీపీ వారిపైనే ఆరోపణలు చేస్తున్నారని విషయం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అర్థం చేసుకోవాలని సూచించారు. రాష్ట్రంలో యువతకు జరుగుతున్న అన్యాయంపై దశల వారీగా ఉద్యమాలు చేస్తామని బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి వెల్లడించారు.
Read Also: Sprouts: మొలకెత్తిన ధాన్యాలు పచ్చిగా తింటే మంచిదా? లేక ఉడికించి తింటే మంచిదా?
Also Read
- AP Government Schools: ప్రైవేట్ స్కూళ్లకు షాక్.. ప్రభుత్వ పాఠశాలల్లో భారీగా విద్యార్థుల చేరిక
- Deputy CM Pawan Kalyan: రాష్ట్ర సంపదను కాపాడుతాం.. స్మగ్లర్లకు పవన్ కల్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్..
- IAS Srilakshmi: ఏపీ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా శ్రీలక్ష్మి.. రెండేళ్ల తర్వాత కీలక పోస్టింగ్.. ట్విస్ట్ ఏంటంటే..?
- CM Chandrababu: మూడు రాష్ట్రాల భవిష్యత్తుకు తుంగభద్ర నాంది.. చరిత్ర సృష్టించిన సీఎంల భేటీ..
ఇక, ఎంపీ మిథున్ రెడ్డి అరెస్టు తమకు ఆశ్చర్యం కలిగించిన విషయం కాదు అని శాప్ మాజీ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడే అక్రమ అరెస్టులు చేస్తారని తెలుసు అన్నారు. మిథున్ రెడ్డి గెలిచింది మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పైనా.. మిథున్ రెడ్డిని మానసికంగా ఇబ్బంది పెట్టాలని ఉద్దేశంతోనే అక్రమ కేసులు పెట్టారు అని ఆరోపించారు. ఇంత వరకు మిథున్ రెడ్డి మీద కస్టడీ పిటిషన్ వేయలేదంటేనే ఇది అక్రమ కేసు అని మనం అర్థం చేసుకోవాలన్నారు. ఎన్నికల ముందు 20 వేల మంది అమ్మాయిలు మిస్సింగ్ అయ్యారని చెప్పి.. అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కరినైనా వెనక్కి తీసుకొచ్చారా అని ప్రశ్నించారు. అలాగే, నకిలీ మద్యం సేవించి వేలాది మంది చనిపోయారని అసత్య ప్రచారం చేశారు.. నకిలీ మద్యం కేసులో ఎవరినైనా ఇంత వరకు అరెస్టు చేశారా అని సిద్ధార్థ్ రెడ్డి అడిగారు.
తాజావార్తలు
-
TG20 League 2026: రాయుడు ‘హిట్’ ఇన్నింగ్స్.. పాలమూరు స్ట్రైకర్స్ ఘన విజయం!
-
Friday Horoscope: శుక్రవారం దిన ఫలాలు.. వృత్తి, ఉద్యోగ రంగాల్లో మిశ్రమ ఫలితాలు!
-
Ranabaali : ‘రణబాలి’ వివాదంపై మైత్రి రవిశంకర్ స్పందన.. విజయ్పై కీలక వ్యాఖ్యలు
-
Viral Video: ఎవరయ్యా ఈయన.. మద్యం మత్తులో 11KV విద్యుత్ స్తంభం ఎక్కి తీగలపై పడుకున్నాడు.!
-
8849 Tank 5: ప్రొజెక్టర్తో 8849 ట్యాంక్ 5 స్మార్ట్ఫోన్ విడుదల.. 17,600mAh భారీ బ్యాటరీ, 3K డిస్ప్లే
ట్రెండింగ్
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!