Site icon NTV Telugu

Bode Ramachandra Yadav: బీసీ హక్కుల కోసం మంగళగిరిలో మహా పోరాటం.. రామచంద్ర యాదవ్ ఆమరణ దీక్ష

Bode Ramachandra

Bode Ramachandra

బీసీ సామాజిక వర్గాల సమగ్ర అభ్యున్నతే ధ్యేయంగా భారత చైతన్య యువజన (బీసీవై) పార్టీ అధినేత బోడె రామచంద్ర యాదవ్ మంగళగిరిలో ఆమరణ నిరాహార దీక్షకు శ్రీకారం చుట్టారు. మంగళగిరిలోని పార్టీ ప్రధాన కార్యాలయ ఆవరణలో ప్రారంభమైన ఈ ‘ధర్మ దీక్ష’కు రాష్ట్రవ్యాప్తంగా వివిధ బీసీ సంఘాల నాయకులు, మేధావులు పెద్ద సంఖ్యలో హాజరై తమ సంఘీభావాన్ని ప్రకటించారు. గతంలో నిర్వహించిన “బీసీ సింహగర్జన” సభలో ఐదు కీలక డిమాండ్లను ప్రస్తావించిన రామచంద్ర యాదవ్, వాటిపై ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతోనే ఈ నిరసన బాట పట్టినట్లు స్పష్టం చేశారు. అణగారిన వర్గాల హక్కుల కోసం రాజీలేని పోరాటం చేస్తానని, బీసీల సమస్యల పరిష్కారం అయ్యే వరకు వెనక్కి తగ్గేది లేదని ఆయన ఈ సందర్భంగా భీష్మించుకున్నారు.

Home Minister Vangalapudi Anitha: ఆపరేషన్ ట్రేస్‌లో 900 పిల్లలను రక్షించాం..

రామచంద్ర యాదవ్ చేపట్టిన ఈ పోరాటానికి జాతీయ స్థాయిలోనూ భారీ మద్దతు లభించింది. ఓబీసీ రిజర్వేషన్ల కోసం చారిత్రాత్మక పోరాటం చేసిన బీపీ మండల్ మనుమడు డా. సూరజ్ మండల్ స్వయంగా హాజరై ఈ దీక్షకు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఆయనతో పాటు జ్యోతిబా పూలే మనుమరాలు డా. ఎస్. పూలే కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని రామచంద్ర యాదవ్ చేస్తున్న పోరాటాన్ని అభినందించారు. బీసీలందరూ ఏకతాటిపైకి వచ్చి రాజ్యాధికారాన్ని సాధించినప్పుడే సామాజిక సమన్యాయం జరుగుతుందని, అణగారిన వర్గాల గొంతుకగా నిలుస్తున్న ఈ దీక్షకు తాము ఎల్లవేళలా అండగా ఉంటామని వారు వ్యాఖ్యానించారు. బీసీల చైతన్యమే లక్ష్యంగా సాగుతున్న ఈ దీక్ష ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తిని రేపుతోంది.

Rilee Rossouw: “ఐపీఎల్ ఒక సినిమా డ్రామా”.. IPL కంటే PSL గ్రేట్ అంటూ రోసో పిచ్చి కూతలు..

Exit mobile version