Land Dispute: భూ ఆక్రమణలపై తిరుపతి జిల్లా అధికార యంత్రాంగం విచారణ ముమ్మరం చేసింది. చిన్న గొట్టిగల్లు మండలం దేవరకొండ రెవెన్యూ పరిధిలో భూ వివాదం.. బాపట్ల ఎస్పీ కుటుంబ సభ్యులపై ప్రభుత్వ భూముల ఆక్రమణ ఆరోపణలు వచ్చాయి. హైకోర్టులో పిటిషన్ దాఖలు కావడంతో ఉన్నతాధికారులు రంగంలోకి దిగారు. పూర్తిస్థాయి విచారణ అధికారిగా జేసీ గోవిందరావు నియామకం అయ్యారు. 687, 688, 689 సర్వే నంబర్లలో 11.71 ఎకరాల భూమి ఆక్రమణకు గురైనట్లు గుర్తించారు. రోడ్లు, అటవి బఫర్ జోన్లు, కుంటలను కలిపి వేసుకున్నారని రెవెన్యూ అధికారుల ప్రాథమిక నివేదికలో తేలింది.
అయితే, ప్రభుత్వ భూమిలో అక్రమంగా మామిడి తోటలను సాగు చేస్తున్నట్లు ఆరోపణలు వచ్చాయి. రెండు మూడు వారాల్లో ప్రభుత్వానికి నివేదిక సమర్పించనున్న జేసీ గోవిందరావు పేర్కొన్నారు. జేసీ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలకు ఏపీ ప్రభుత్వం సిద్ధమవుతుంది.