Aqua Sector: ఆక్వా రంగంపై యుద్ధం ప్రభావం
- యుద్ధ ప్రభావంతో పడిపోయిన రొయ్యల ధరలు
- ఎగుమతులు ఆగిపోవడంతో రైతులకు భారీ నష్టం
- పెరిగిన సాగు ఖర్చులు.. తగ్గిన మార్కెట్ ధరలు
- ప్రభుత్వ జోక్యం కోరుతున్న ఆక్వా సాగుదారులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధ మేఘాలు ఆంధ్రప్రదేశ్లోని ఆక్వా రంగాన్ని, ముఖ్యంగా రొయ్యల సాగుదారులను తీవ్ర సంక్షోభంలోకి నెట్టాయి. గత ఏడాది అమెరికా విధించిన సుంకాల నుండి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ఆక్వా రైతులకు, ప్రస్తుత యుద్ధ పరిస్థితులు మరో భారీ దెబ్బగా మారాయి. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో సుమారు రెండు లక్షల ఎకరాల్లో రొయ్యల సాగు జరుగుతుండగా, అంతర్జాతీయ ఎగుమతులు నిలిచిపోవడంతో ధరలు అమాంతం పడిపోయి రైతులు కంటిమీద కునుకు లేకుండా గడుపుతున్నారు.
PM Modi: తృణమూల్ అహంకారం ముక్కలవుతుంది.. మమతా సర్కార్పై ప్రధాని ఫైర్..
Also Read
- Perni Nani: చంద్రబాబుకు రాజకీయ నీతి గురించి మాట్లాడే అర్హత లేదు.. సీఎంపై పేర్ని నాని ఫైర్..
- Thalliki Vandanam: తల్లికి వందనం లబ్ధిదారులకు బిగ్ అలర్ట్.. ఈ మూడు పనులు చేయకుంటే డబ్బులు రావు!
- Rajnath Singh: భారత నౌకాదళం ఆర్థిక ప్రయోజనాలకు రక్షకుడు
- Vietnam: వియత్నాంలో ఘోర బోటు ప్రమాదం.. 19కు చేరిన తెలుగు పర్యాటకుల మృతుల సంఖ్య
గత నాలుగైదు రోజులుగా రొయ్యల ధరలు కేజీకి ₹30 నుండి ₹40 వరకు పతనమవ్వడంతో, ఒక్కో టన్ను పట్టుబడిపై రైతుకు సుమారు ₹40,000 వరకు నష్టం వాటిల్లుతోంది. ముఖ్యంగా 30 కౌంట్ రొయ్యల ధర ₹510 నుండి ₹470కి, 40 కౌంట్ ధర ₹410 నుండి ₹360కి పడిపోవడం సాగుదారులను కోలుకోలేని దెబ్బ తీసింది.
మార్కెట్లో ఒకవైపు ధరలు తగ్గుతుంటే, మరోవైపు సాగు ఖర్చులు విపరీతంగా పెరగడం రైతులకు తలకు మించిన భారంగా మారింది. మేత (Feed) ధరలు, విద్యుత్ ఛార్జీలు, కూలీల ఖర్చులు పెరగడంతో పెట్టిన పెట్టుబడి కూడా తిరిగి వచ్చే పరిస్థితి కనిపించడం లేదు.
Prize Money: ఫైనల్లో గెలిచిన జట్టుపై కాసుల వర్షం.. మొత్తం ప్రైజ్ మనీ ఎంతంటే?
దీనికి తోడు మార్కెట్లో ఏ చిన్న అనిశ్చితి ఏర్పడినా ప్రాసెసింగ్ యూనిట్లు , ఏజెంట్లు ‘సిండికేట్’గా ఏర్పడి ధరలను కావాలనే తగ్గిస్తున్నారని, యుద్ధం నెపంతో ట్రేడర్లు తమను దోచుకుంటున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నాణ్యమైన సీడ్ (Seed) లభించకపోవడం, వైరస్ వ్యాధుల ముప్పు కూడా తోడవ్వడంతో ఆక్వా రంగం అస్తవ్యస్తంగా మారింది.
నిజానికి కరోనా కాలం నుండి ఆక్వా రంగం వరుస విపత్తులను ఎదుర్కొంటూనే ఉంది. మొదట రవాణా ఆటంకాలు, ఆపై అమెరికా ఆంక్షలు, ప్రకృతి వైపరీత్యాలు ఒకదాని తర్వాత ఒకటిగా రైతులను దెబ్బతీశాయి. ఇప్పుడు తాజాగా పశ్చిమాసియా యుద్ధం కారణంగా ఎగుమతి నౌకలు నిలిచిపోవడంతో పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చింది. ఈ విపత్కర పరిస్థితుల్లో ప్రభుత్వం వెంటనే స్పందించి ప్రాసెసింగ్ యూనిట్ల యాజమాన్యాలతో చర్చలు జరపాలని, రైతులకు కనీస మద్దతు ధర లభించేలా చూడాలని ఆక్వా సాగుదారులు డిమాండ్ చేస్తున్నారు. లేనిపక్షంలో అప్పుల బాధ తాళలేక వేలాది కుటుంబాలు వీధిన పడే ప్రమాదం ఉందని వారు హెచ్చరిస్తున్నారు.
తాజావార్తలు
-
Nagarjuna: కొడుకు సక్సెస్ కోసం నాగార్జున తపన.. ‘లెనిన్’ స్క్రిప్ట్లో కింగ్ రైటింగ్!
-
CM Revanth Reddy : కాళేశ్వరం ప్రాజెక్టుపై బీఆర్ఎస్, బీజేపీ కుట్రలను తిప్పికొడతాం
-
Shravan Month Dreams: శ్రావణ మాసంలో మీ కలలో ఇవి కనిపిస్తే.. మీ దరిద్రం తీరిపోయినట్లే! అవి ఏంటో తెలుసా?
-
TMC CRISIS: మమతా బెనర్జీకి షాక్.. రెబల్ వర్గంలో చేరిన కీలక అనుచరుడు..
-
Jananayagan : విజయ్ లాస్ట్ మూవీతో కిరణ్కు తిప్పలు
ట్రెండింగ్
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..
-
అబ్బో.. BSNL ప్లాన్ మాములుగా లేదుగా.! 5TB డేటా, 200Mbps స్పీడ్, ఫ్రీ OTTలు..
-
Kanpur: డ్రైవ్లో బాలికలు, మహిళల ప్రైవేట్ వీడియోలు.. గూగుల్ అలర్ట్తో పోలీసులకు చిక్కిన యువకుడు.!
-
New Car Features: మైలేజ్ రోజులు పోయాయి.. ఇప్పుడు కార్లలో ఈ ఫీచర్లకే భారీ క్రేజ్.!