Sake Sailajanath: మోడీ హయాంలో ఈడీ, ఐటీ, సీబీఐ దుర్వినియోగం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ (Sonia Gandhi), ఆమె తనయుడు రాహుల్ గాంధీ (Rahul Gandhi) పట్ల కేంద్ర ప్రభుత్వ కక్ష పూరితంగా వ్యవహరిస్తోందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈడీ పేరుతో తాజాగా సోనియాగాంధీని విచారిస్తున్న సంగతి తెలిసిందే. కాంగ్రెస్ నాయకులను, కార్యకర్తలను ఎవరూ భయపెట్టలేరన్నారు ఏపీసీసీ చీఫ్ సాకె శైలజానాథ్. రాజ్యాంగ వ్యవస్థలను, నిఘా వ్యవస్థలను దుర్వినియోగం చేస్తున్న మోడీ ప్రభుత్వం తీరుపై ఆయన మండిపడ్డారు. ఈ నెల 21న సోనియా గాంధీ ఈడీ ముందు హాజరయ్యారు. మరోసారి ఈనెల 26న ఈడీ విచారణకు రానున్నారు.
సోనియా గాంధీపై ఈడి విచారణ కక్షపూరితధోరణికి సంకేతం అన్నారు. కేంద్ర ప్రభుత్వం రాజకీయంగా కక్ష సాధించడానికి, ఈడీ, ఐటీ , సిబిఐ లను దుర్వినియోగం చేస్తోందని విమర్శలు చేశారు. నేషనల్ హెరాల్డ్ కేసు (National Herald case) లో సోనియా గాంధీ, రాహుల్ గాంధీల పై పెట్టిన తప్పుడు కేసులను న్యాయబద్ధంగా ఎదుర్కొంటాం అన్నారు. 2024 ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అధికారాన్ని అప్పగించే సమయం ఆసన్నమైందన్నారు.
Also Read
- Tirupati Corporation: తిరుపతి కార్పొరేషన్లో పెరిగిన వార్డులు.. 50 నుంచి 66కి పెంపు..
- Ambati Rambabu: అంబటి రాంబాబుపై మరో కేసు నమోదు.. పోలీసు నోటీసులపై అంబటి ఆగ్రహం..
- LV Prasad Hospital: అమరావతిలో ఎల్.వి.ప్రసాద్ కంటి ఆసుపత్రి.. 12 ఎకరాల స్థలంలో నిర్మాణం..
- Agni veer Rally: సైనిక కల కల్లైంది.. విశాఖ అగ్నివీర్ ర్యాలీలో విషాద ఛాయలు..
Draupadi Murmu: ప్రమాణ స్వీకారంలో సంతాలి చీర ధరించిన ముర్ము.. ప్రత్యేకతలేంటో తెలుసా?
ఈ నెల 26న విజయవాడలో సోనియాగాంధీని ఈడీ విచారించడంపై శాంతియుత సత్యాగ్రహం నిర్వహిస్తున్నాం అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున ఈ సత్యాగ్రహంలో పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. నేషనల్ హెరాల్డ్ ముద్రించే అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్కు ఉన్న రూ.90కోట్ల అప్పును యంగ్ ఇండియాకు బదలాయించడంపై ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈడీ ప్రధానంగా ఈ అంశంపైనే ప్రశ్నలు సంధించే అవకాశముంది.
యంగ్ ఇండియా బోర్డ్ ఆఫ్ డైరెక్టరుగా ఉన్న సోనియాకు 38శాతం వాటా ఎలా వచ్చిందన్న దానిపైన ఫోకస్ పెట్టనున్నారు. ఇంతకుముందే ఢిల్లీలో ఎంపీలు, కాంగ్రెస్ శ్రేణులు నిరసన తెలిపారు. మళ్ళీ ఆందోళనలు నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ కోరింది. ఎక్కడా హింసాత్మక చర్యలకు దిగకుండా శాంతియుతంగా నిరసనలు తెలపాలని సూచించింది. మంగళవారం ఉదయం 11 గంటలకు సోనియా గాంధీ ఈడీ కార్యాలయానికి వెళ్ళనున్నారు. మరి ఈ సారి ఈడీ ఎంతసేపు సోనియాగాంధీని విచారిస్తుందో చూడాలి.
Srinu Vaitla: భార్య లేకున్నా వారు ఉంటే చాలు అంటున్న స్టార్ డైరెక్టర్..?
తాజావార్తలు
-
Ind vs Afg T20 : ఆఫ్ఘన్పై భారత్ జోరు.. సిరీస్ కైవసం.!
-
Story Board : దిగ్గజాలు వద్దంటున్నారు..ట్రంప్ కావాలంటున్నారు..అసలు ఏఐ విషయంలో ఏం జరుగుతోంది..?
-
Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
-
OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
-
OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్లో ఏం మాట్లాడుకున్నారు..?
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?