AP Youth Trapped: విదేశాల్లో ఉద్యోగాల పేరుతో యువతను అమ్ముతున్న వైనం.. నరకం చూపిస్తున్న ఏజెన్సీలు
- ఉద్యోగాల పేరుతో విదేశాలకు వెళ్ళిన తెలుగు యువతపై అమానుష ఘటన..
- ఏపీకి చెందిన 21 మందిని కిడ్నాప్ చేసి చిత్రహింసలు పెట్టినట్లు బాధితులు ఆరోపణలు..
- కిడ్నాప్ కు గురైన బాధితులను విడిపించాలని కోరతున్న నంద్యాల టీడీపీ ఎంపీ బైరెడ్డి శబరి..
AP Youth Trapped: ఉద్యోగాల పేరిట విదేశాలకు వెళ్ళిన తెలుగు యువతపై అమానుష సంఘటన వెలుగులోకి వచ్చింది. విదేశీ ఏజెన్సీల మోసపూరిత విధానాలతో మయన్మార్ సరిహద్దులో ఏపీ యువత బందీగా ఉన్నారు. తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాలకు చెందిన 21 మంది యువకులు బందీగా ఉన్నట్లు తెలుస్తుంది. మొదట థాయిలాండ్లో ముగ్గురు వ్యక్తులు చెప్పడంతో స్నేహితులంతా ఉద్యోగాల కోసం వెళ్లగా, ఆ తర్వాత మోసపోయారు. అయితే, థాయిలాండ్ ఏజెన్సీ నిర్వాహకులు మొదట ఆశలు చూపించి ఉద్యోగాల్లో చేర్చగా, తరువాత మయన్మార్ ఏజెన్సీకి యువతను అమ్మేశారు. అక్కడ యువతను ఆన్లైన్లో అమ్మాయిల మాదిరి మాట్లాడిస్తూ చాటింగ్ చేయించడమే పని అని చెప్పినట్లు తెలుస్తోంది. ఆ పని చేయలేమని చెప్పగానే ఏజెన్సీ నిర్వాహకులు చిత్రహింసలు పెట్టినట్లు బాధితులు తెలియజేశారు.
Read Also: Asim Munir: దేవుడు నన్ను రక్షకుడిని చేశాడు.. నాకు ఏ పదవి వద్దు..
అయితే, విదేశీ ఏజెన్సీల నునంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తే శాశ్వతంగా జైల్లో నిర్బంధిస్తామనే బెదిరింపులను కూడా ఎదుర్కొంటున్నారని బాధితులు తెలిపారు. దీంతో మమ్మల్ని రక్షించండి అని ఆర్తనాలు వినిపించారు. మేము ఎక్కడ ఉన్నామో మాకే తెలియదు, మా లొకేషన్ కూడా తెలియడం లేదని చెప్పుకొచ్చారు. కాగా, బాధిత యువత కుటుంబ సభ్యులు తెలుగు రాష్ట్రాల్లోని ప్రజా ప్రతినిధులను వరుసగా కలుస్తున్నారు. దీంతో నంద్యాల ఎంపీ, పార్లమెంటరీ ఫ్లోర్ లీడర్ బైరెడ్డి శబరిని ఢిల్లీలో బాధితుల తల్లిదండ్రులు కలిసి సమస్యను వివరించారు. దీంతో ఎంపీ శబరి విదేశాంగ శాఖకు స్వయంగా కంప్లైంట్ చేశారు. ఇక, అదే విధంగా ఈ విషయంపై కేంద్ర మంత్రి బండి సంజయ్కు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై నేరుగా వీడియో కాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బాధితులతో మాట్లాడి ధైర్యం చెప్పినట్లు తెలుస్తుంది.
ఇక, నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు, లోక్ సభ టీడీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ డాక్టర్ బైరెడ్డి మాట్లాడుతూ.. ఏపీకి చెందిన యువకులు ఉపాధి కోసం మయన్మార్ కి వెళ్తే.. అక్కడ కిడ్నాప్ కు గురయ్యారనీ తెలియజేశారు. బాధితులను భారత్ కు తీసుకోచ్చేలా కేంద్ర ప్రభుత్వం చూడాలని కోరారు. బంధించబడి తీవ్రమైన హింస, బలవంతపు పనులకు గురవుతున్న తమ రాష్ట్ర యువతను తక్షణమే విడుదల చేసి తీసుకు రావాలన్నారు.
తాజావార్తలు
-
Kids Wellness : పిల్లల ఆరోగ్యం పదిలంగా ఉండాలంటే.. ఈ హెల్త్ టెస్టులు తప్పనిసరి.!
-
Chia Seeds : మధుమేహానికి చెక్ పెట్టే చియా సీడ్స్.. షుగర్ లెవల్స్ తగ్గాలంటే ఇలా తిని చూడండి!
-
Women Reservation: అంకెల్లో గెలిచి.. అధిక్యంలో ఓడి.. బిల్లు వీగిపోవడం వెనుక ఉన్న కారణాలివే..
-
Reed Hastings: సొంత కంపెనీ నుంచి తప్పుకున్న ఫౌండర్.. నెట్ఫ్లిక్స్లో ముగిసిన ‘రీడ్ హేస్టింగ్స్’ శకం
-
Womens Reservation Bill: నారీ శక్తి బిల్లుపై ఓటమి.. మరి మిగిలిన రెండు బిల్లుల సంగతేంటి?
ట్రెండింగ్
-
రాత్రి పడుకునే ముందు శరీరంలోని ఈ రెండు భాగాలకు ఆవనూనెతో ఎందుకు మర్దన చేయాలి?
-
Burning Feet Hacks: పాదాల్లో మంటలా..? ఇంటి చిట్కాలతో ఇలా చెక్ పెట్టండి.!
-
Neem Juice: వేప రసం తాగుతున్నారా? అయితే ఈ షాకింగ్ విషయాలు తెలుసుకోవాల్సిందే.!
-
Health Tips : వర్కౌట్ బట్టల్లో ప్రాణాంతక రసాయనాలు.. ఫిట్నెస్ కోసం వెళ్తే అనారోగ్యం ఫ్రీ.!
-
Train Ticket Rules: రైలు ప్రయాణికుల టెన్షన్కు ఇక సెలవు.. అమల్లోకి కొత్త చార్ట్ రూల్స్.!