AP Weather Alert : ఏపీలో నిప్పుల కుంపటి.. 8 జిల్లాలకు ‘రెడ్ అలర్ట్’ జారీ!.
- ఏపీలో ఎండల ఎఫెక్ట్.. 40 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు
- పలుచోట్ల తీవ్రమైన వడగాలుల హెచ్చరిక
- పగలే కాదు.. రాత్రిళ్లు కూడా పెరుగుతున్న వేడి
- ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారుల సూచన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Weather Alert : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని భానుడు భయపెడుతున్నాడు. రాబోయే రోజుల్లో ఎండల తీవ్రత మరింత పెరగనుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నెల 26 వరకు కోస్తాంధ్ర ప్రాంతానికి ప్రచండ ఎండల ముప్పు పొంచి ఉందని, మరో ఐదు రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా అతి తీవ్రమైన వడగాలులు (Heat Waves) వీస్తాయని భారత వాతావరణ కేంద్రం (IMD) వెల్లడించింది. ముఖ్యంగా దక్షిణ కోస్తా జిల్లాల్లో అత్యధిక వేడి వాతావరణం నెలకొంటుందని స్పష్టం చేసింది. బాపట్లలో ఈ సీజన్ సాధారణ ఉష్ణోగ్రత కంటే ఏకంగా 7.4 డిగ్రీలు అధికంగా నమోదు కావడం అక్కడి వాతావరణ తీవ్రతకు అద్దం పడుతోంది.
ఎండలు, వడగాలుల తీవ్రత దృష్ట్యా వాతావరణ శాఖ జిల్లాల వారీగా హెచ్చరికలు జారీ చేసింది. తీవ్రమైన ఉష్ణోగ్రతలు నమోదవుతున్న దక్షిణ కోస్తాలోని 8 జిల్లాలకు అత్యంత ప్రమాదకరమైన ‘రెడ్ అలర్ట్’ (Red Alert) ప్రకటించింది. మరో 6 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, మూడు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఉత్తరాంధ్రాలోని శ్రీకాకుళం, విజయనగరం మినహా రాష్ట్రంలోని మిగిలిన అన్ని జిల్లాలకు విపత్తుల నిర్వహణ సంస్థ , ఐఎండీ అప్రమత్తత హెచ్చరికలు జారీ చేశాయి. ప్రజలు అత్యవసరమైతే తప్ప మధ్యాహ్నం వేళల్లో బయటకు రావద్దని అధికారులు సూచిస్తున్నారు.
Also Read
- Sidiri Appala Raju : మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుకు 14 రోజుల రిమాండ్.!
- Kadambari Jethwani : సీఐడీ ఛార్జ్షీట్పై కాదంబరి జెత్వానీ ఫైర్.!
- CM Chandrababu : భూములకు బ్లాక్చెయిన్ రక్షణ.. ఏపీలో కొత్త వ్యవస్థ ప్రారంభం
- Kandula Jessie: 108 దేశాలు, 12 వేల మంది పోటీదారులు.. ప్రపంచ అంతరిక్ష మిషన్కు ఎంపికైన ఏపీ ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని!
ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఎండల తీవ్రత ఎలా ఉందంటే.. దాదాపు అన్ని జిల్లాల్లోనూ ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల మార్కును దాటేశాయి. కేవలం పగటి పూట మాత్రమే కాకుండా, రాత్రి వేళల్లో కూడా ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరుగుతున్నాయి. దీనివల్ల ‘వార్మ్ నైట్స్’ (Warm Nights) సంఖ్య పెరుగుతోందని, రాత్రి పూట కూడా వేడి గాలులు, ఉక్కపోతతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఈ ప్రచండ వేడి నుంచి ఉపశమనం పొందడానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ఎక్కువగా ద్రవపదార్థాలు తాగాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
తాజావార్తలు
-
Delhi: జంతర్మంతర్ దగ్గర ఇంటర్నెట్, మొబైల్ సేవలు నిలిపివేత.. భారీగా పోలీసులు మోహరింపు
-
ZIM vs IND: జింబాబ్వేపై టీమిండియా ఘన విజయం.. 19 బంతుల్లో వైభవ్ సూర్యవంశీ హాఫ్ సెంచరీ!
-
Sidiri Appala Raju : మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుకు 14 రోజుల రిమాండ్.!
-
Rahul Gandhi: విద్యార్థులు ఒంటరి కాదు.. అండగా ఉంటాం.. ఇండియా కూటమి ప్రకటన
-
Bangladesh: షేక్ హసీనాకు అధ్యక్షుడి పిలుపు.. బంగ్లాదేశ్లో రాజకీయ కల్లోలం..
ట్రెండింగ్
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?