AP Update : ఏపీ సర్కార్ సంచలనం.. గ్రామ సచివాలయాల పేరు మార్పు

  • గ్రామ సచివాలయాల పేరు మార్చుతున్నాం
  • ఇక నుండి వీటిని విజన్ యూనిట్స్ గా పిలుస్తాము.
  • సమర్థంగా ప్రజలకు సేవలు అందించే కేంద్రాలుగా రూపొందిస్తాము : సీఎం చంద్రబాబు
Chandrababu Naidu

Chandrababu Naidu

AP Update : ఆంధ్రప్రదేశ్‌లో గ్రామ సచివాలయాల వ్యవస్థకు కొత్త రూపురేఖలు ఇవ్వడానికి సీఎం చంద్రబాబు ప్రభుత్వం సిద్ధమవుతోంది. గ్రామ సచివాలయాలకు కొత్త పేరు పెట్టే దిశగా చర్యలు ప్రారంభమయ్యాయి. ఇకపై వాటిని “విజన్ యూనిట్స్‌” (Vision Units)గా పిలవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు జరిగిన మంత్రులు, అధికారుల సమీక్ష సమావేశంలో సీఎం చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. ఆయన మాట్లాడుతూ, “గ్రామ సచివాలయాల వ్యవస్థ ప్రజలకు మరింత సమర్థవంతంగా సేవలు అందించే విధంగా రూపకల్పన చేయాలి. అందుకే వాటిని విజన్ యూనిట్స్‌గా మార్చుతున్నాం. ఇవి భవిష్యత్తులో ప్రజా సేవలకు కేంద్ర బిందువుగా నిలుస్తాయి” అని చెప్పారు.

ఇకపై ఈ విజన్ యూనిట్స్‌ ద్వారా ప్రజలకు ప్రభుత్వ సేవలను వేగంగా, సమర్థంగా అందించేందుకు ప్రత్యేక సాంకేతిక పద్ధతులను ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం. పౌరులకు అవసరమైన సంక్షేమ పథకాలు, రికార్డులు, సర్టిఫికేట్లు, ప్రభుత్వ సహాయ పథకాలను ఒకే వేదికపై అందించే విధంగా ఈ యూనిట్స్‌ పని చేయనున్నాయి. సీఎం చంద్రబాబు విజన్ యూనిట్స్‌ రాష్ట్ర భవిష్యత్ పరిపాలనలో కీలక పాత్ర పోషిస్తాయని, గ్రామస్థాయి పాలనను ఆధునిక సాంకేతికతతో మిళితం చేస్తామని తెలిపారు.

×
×
Ad

West Bengal: చెరువులో వందలాది ఆధార్ కార్డులు.. “సర్” సమయంలో బెంగాల్‌లో వివాదం..