Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Ap Rajyasabha Electionbs Unanimous

Rajyasabha Elections: ఏపీలో 4 రాజ్యసభ స్థానాలు ఏకగ్రీవం

Published Date :June 3, 2022 , 4:35 pm
By NTV WebDesk
Rajyasabha Elections: ఏపీలో 4 రాజ్యసభ స్థానాలు ఏకగ్రీవం
  • Follow Us :
  • google news
  • dailyhunt

ఆంధ్రప్రదేశ్‌ లో రాజ్యసభ ఎన్నికల ప్రక్రియ ముగిసింది. రాజ్యసభ ఎన్నికలకు నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది. రాజ్యసభ ఎంపీలుగా వైసీపీ నుంచి నలుగురు అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అసెంబ్లీ సెక్రటరీ చేతుల మీదుగా డిక్లరేషన్ సర్టిఫికెట్లు అందుకున్నారు విజయసాయిరెడ్డి, నిరంజన్ రెడ్డి, కృష్ణయ్య, బీద మస్తాన్ రావు. ప్రస్తుతం రాజ్యసభ ఎంపీగా కొనసాగుతున్న విజయసాయిరెడ్డిని తిరిగి రెండోసారి ఎంపికచేశారు సీఎం జగన్. అలాగే బీసీ వర్గానికి చెందిన ఆర్‌.కృష్ణయ్య, బీదా మస్తాన్‌రావు, సుప్రీంకోర్టులో న్యాయవాది ఎస్‌,నిరంజన్‌రెడ్డిలకు జగన్ అవకాశం ఇచ్చారు. వీరిలో ఇద్దరు రాష్ట్రానికి చెందిన వారు కాగా, మరో ఇద్దరు తెలంగాణకు చెందిన వారు కావడం విశేషం.

తాను తెలంగాణలోనే పోరాడలేదని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌తో పాటు, దేశవ్యాప్తంగా ఉన్న బీసీల అభివృద్ధి కోసం పని చేస్తున్నానని రాజ్యసభకు ఎన్నికైన కృష్ణయ్య అంటున్నారు. చట్టసభల్లో రిజర్వేషన్లు కావాలంటే తెలంగాణకే కాకుండా దేశంలో అందరి కోసం రిజర్వేషన్లు ఉండాలన్నారు. కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖ పెట్టాలని రాజ్యసభలో కొట్లాడతానని చెప్పారు.

బీసీలంటే బ్యాక్‌వర్డ్‌ క్లాస్‌ కాదు.. బ్యాక్‌బోన్‌క్లాస్‌ అని నమ్మిన సీఎం ఆచరణలో చేసి చూపించారు. బీసీల సమస్యలపై జీవితమంతా ఆర్‌ కృష్ణయ్య పోరాటం చేశారని వైసీపీ నేతలు అభిప్రాయపడ్డారు. రెండవసారి తనకు అవకాశం ఇచ్చిన జగన్‌ కి ధన్యవాదాలు తెలిపారు విజయసాయిరెడ్డి. వైసీపీలో కీలకంగా వ్యవహరిస్తున్న విజయసాయికి రెండవసారి అవకాశం ఇస్తారని ముందునుంచే అంతా భావించారు. కానీ ఆర్‌.కృష్ణయ్య, నిరంజన్‌ రెడ్డిలకు అవకాశం ఇవ్వడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ముందునుంచీ తనతో సన్నిహితంగా మెలిగిన నటుడు అలీకి అవకాశం ఇస్తారని భావించారు. కానీ అలా జరగలేదు.

అలీకి నామినేటెడ్ పదవిని కట్టబెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ఎన్నో ఆశలు పెట్టుకున్న మాజీ కేంద్ర మంత్రి కిల్లి కృపారాణికి సైతం సీఎం అవకాశం ఇవ్వకపోవడంతో ఆమె అసహనంతో వున్నారు. గతంలో రిలయెన్స్ నుంచి పరిమళ్ నత్వానికి అవకాశం ఇచ్చినట్టు ఈసారి అదానీ కుటుంబీకులకు పదవి కట్టబెడతారని భావించారంతా. కానీ అలా జరగలేదు. మొత్తం మీద ఈసారి రాజ్యసభ ఎన్నికలు ఊహించిన దానికంటే భిన్నంగా జరిగాయి. నలుగురు సభ్యుల ఎంపికతో రాజ్యసభలో వైసీపీ సభ్యుల బలం పెరిగింది.

Ap Rajyasabha: బలహీనవర్గాలకు సీఎం జగన్ పెద్ద పీట

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • ap rajyasabha
  • bc card
  • Beeda Masthan Rao
  • cm jagan
  • niranjan reddy

తాజావార్తలు

  • OTR: ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ZP ఛైర్‌పర్సన్ అసంతృప్తి రాగం..!

  • OTR: జీవన్ రెడ్డి రాకను వ్యతిరేకించిన నేతలు ఇప్పుడు ఎందుకు సైలెంట్ అయ్యారు?

  • Off The Record: ఈటల రాజేందర్ కమలంలో కంఫర్ట్ గానే ఉన్నారా?

  • Opinion Poll 2026: నాలుగు రాష్ట్రాల ఎన్నికల్లో గెలిచేది వీరేనా? ఒపీనియన్ పోల్స్‌లో ఆసక్తికర ఫలితాలు..

  • OTR: ముగ్గురు అధ్యక్షులు, ముచ్చటగా మూడు జిల్లాలు.. కానీ క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ ఎక్కడ?

ట్రెండింగ్‌

  • JIO Offer: రూ. 339లకే 31 రోజుల వాలిడిటీతో రూ. 35 వేల విలువైన గూగుల్ జెమిని ప్రో ఫ్రీ!

  • బడ్జెట్ ధరలో ‘బ్యాటరీ కింగ్’.. అదిరిపోయే ఫీచర్లతో వచ్చేస్తున్న REDMI A7 Pro 5G..!

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions