Minister Roja Dance: హంసధ్వని పుస్తకావిష్కరణలో.. పాటకు స్టెప్పులేసిన మంత్రి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Srikakulam Roja Dance: శ్రీకాకుళం జిల్లాలో శిల్పారామం ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆర్.కె. రోజా వెల్లడించారు. 76 వ స్వాతంత్య్రం సందర్భంగా కళ్లేపల్లిలోని ఆనందోబ్రహ్మ, స్పిరిట్యువల్ టాబ్లెట్స్ వారిచే హంస ధ్వని తొమ్మిదో వార్షికోత్సవం సందర్భంగా.. 12వ తేదీ నుండి 14 వరకు మూడు రోజుల పాటు ఏర్పాటు చేసిన కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా పర్యాటక శాఖ మంత్రి రోజా హాజరై హంసధ్వని పుస్తకాన్ని రోజా ఆవిష్కరించారు.
అనంతరం చామంతి పువ్వా పువ్వా… అనే పాటకు స్టెప్ లు వేసి జనాలను మంత్రి రోజా ఉత్సాహ పరుస్తూ.. వారితోపాటు మంత్రి రోజా స్టెప్పులు వేశారు. దీంతో ఆప్రాంతమంతా ఆటపాటలతో సంతోమయమైంది. మంత్రి రోజా ఎక్కడుంటే అక్కడ సందడే అనడానికి నిర్వచణంగా ఆప్రాంతమంతా నిదర్శనమైంది. అనంతరం మంత్రి రోజా మట్లాడుతూ.. ఎంతో చరిత్రకలిగిన శ్రీకాకుళం సంప్రదాయ గురుకుళంలో గత మూడు రోజులుగా జరుగుతున్న హంసధ్వని మెగా ఈవెంట్ లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. యావత్ భారత దేశమంతా ఘనంగా నిర్వహిస్తున్న ఆజాదీకా అమ్రుత్ మహోత్సవంలో భాగంగా ఇంత గొప్ప కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు స్వాతి సోమనాథన్, జిల్లా కలెక్టర్, ఇతర అధికారులందరికీ ప్రత్యేకంగా అభినందించారు. మూడు రోజుల పాటు ధ్యాన, నాట్య, సంగీత ప్రదర్శనలను నిర్వహించేందుకు ఏర్పాటు చేసిన ఈ హంసధ్వని ద్వారా.. గొప్ప సందేశాన్ని ఇక్కడున్న ప్రజలకు అందించారని పేర్కొన్నారు.
Also Read
- Schools Closed: విద్యార్థులకు బిగ్ అలర్ట్.. ఎల్లుండి స్కూల్స్, కాలేజీలు బంద్..
- AP Govt: రైతులకు, భూ యజమానులకు బిగ్ రిలీఫ్.. మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ఏపీ ప్రభుత్వం..
- Pawan Kalyan: ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన తాగునీరు లక్ష్యం.. జల్ జీవన్ మిషన్పై పవన్ కీలక ఆదేశాలు
- AP Coronavirus Cases: ఏపీలో భయపెడుతోన్న కరోనా..! పర్యాటకులపై ఆంక్షలు
మన దేశానికి స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లు పూర్తిచేసుకున్న సందర్భంలో వజ్రోత్సవాలను మనం ఘనంగా నిర్వహించుకుంటున్నామని తెలిపారు. ఇలాంటి వజ్రోత్సవాలలో భాగంగా.. మన దేశంలోనే వజ్రం లాంటి సంప్రదాయ గురుకులంకి నేను రావడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఈకార్యక్రమ ఉద్దేశం ధ్యానం మంచి ఆరోగ్యానికి సహకరించే సాధనా ప్రక్రియ అని రోజా పేర్కొన్నారు. అటువంటి ధ్యాన సంబంధ పిరమిడ్ల నిర్మాణానికి సహకరించే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని రూపొందించడం అభినందనీయమన్నారు మంత్రి రోజా. పోటీ ప్రపంచంలో.. మార్కుల కోసం, ర్యాంకుల కోసం పరుగుల తీస్తున్న పిల్లలకి, వారిలో ఒత్తిడిని వారు జయించడానికి ఇలాంటి మంచి కళలు, సంగీతం, నాట్యం. క్రీడల వైపు కాస్త ద్రుష్టి మల్లించేల తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కోరుకుంటున్నానని రోజా తెలిపారు.
PM Narendra Modi: భారత్.. ప్రజాస్వామ్యానికి తల్లిలాంటిది
తాజావార్తలు
-
Sonam Wangchuk: హామీ ఇస్తే దీక్ష విరమిస్తా.. కేంద్రానికి సోనమ్ వాంగ్చుక్ లేఖ..
-
Schools Closed: విద్యార్థులకు బిగ్ అలర్ట్.. ఎల్లుండి స్కూల్స్, కాలేజీలు బంద్..
-
Toxic: ‘టాక్సిక్’లో రొమాన్స్, వైలెన్స్ డోస్ ఎక్కువైందా? యష్ మూవీపై సోషల్ మీడియాలో హాట్ డిబేట్!
-
Petrol Price: పెట్రోల్ ధరలు తగ్గనున్నాయా? నిపుణులు ఏమంటున్నారంటే..?
-
Anupama – Dhruv Vikram: మోస్ట్ వైలెంట్ బ్రేకప్.. అసలు ఇద్దరూ ఎందుకు విడిపోయారు?
ట్రెండింగ్
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Light Flip 5G Phone: సోషల్ మీడియా లేని 5G ఫోన్.. 50MP కెమెరాతో Light Flip కొత్త కాన్సెప్ట్.!
-
10 రోజుల బ్యాటరీ, 80+ స్పోర్ట్స్ మోడ్లు.! స్క్రీన్ లేకుండానే హెల్త్ ట్రాకింగ్.. Garmin CIRQA స్మార్ట్ బ్యాండ్ లాంచ్.!