స్పోర్ట్స్ కోటాలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి చర్యలు తీసుకుంటామని ప్రకటించారు ఏపీ మంత్రి అవంతి శ్రీనివాస్… టూరిజం శాఖపై సమీక్ష నిర్వహించిన ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఉద్యోగాల భర్తీలో 2 శాతం మేర స్పోర్ట్స్ కోటాకు రిజర్వేషన్ ఉంది.. ఈ మేరకు స్పోర్ట్స్ కోటాలో భర్తీ చేయాల్సిన పోస్టుల జాబితా సిద్ధం చేయాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు.. టూరిజం అభివృద్ధి కోసం రాష్ట్రాన్ని నాలుగు టూరిజం సర్క్యూట్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామన్న ఆయన.. రాయల సీమ, కృష్ణా-గుంటూరు, ఉభయ గోదావరి, ఉత్తరాంధ్ర సర్క్యూట్ల ఏర్పాటుకు కసరత్తు జరుగుతోందన్నారు.. మూడు సర్క్యూట్లల్లో ఒబెరాయ్ హోటళ్ల ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నామని.. ఫారెస్ట్ టూరిజం, టెంపుల్ టూరిజం వంటి వాటిపై ఎక్కువ ఫోకస్ పెడుతున్నట్టు వెల్లడించారు. ఇక, ప్రతి జిల్లాలో టూరిజం ఫెస్టివల్స్ నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నామన్న మంత్రి అవంతి.. కోవిడ్ థర్డ్ వేవ్ ప్రభావం లేకుంటే ప్రతి జిల్లాలోనూ క్రీడా పోటీల నిర్వహిస్తామని.. గ్రామీణ ప్రాంత క్రీడాకారులకు ప్రొత్సహించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామన్నారు.