Site icon NTV Telugu

Indian Students: ఉక్రెయిన్ నుంచి విద్యార్థుల తరలింపుపై ఫోకస్

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో అక్కడ చిక్కుకున్న భారతీయులు, విద్యార్ధులను తీసుకువచ్చేందుకు విదేశాంగ శాఖ శక్తివంచన లేకుండా పనిచేస్తోంది. సుమారు 2 వేల నుంచి 3 వేల మంది భారతీయ విద్యార్థులు ఉక్రెయిన్‌ యుద్ధ జోన్లలో ఉండొచ్చని అంచనా వేసింది విదేశాంగ శాఖ. ఇదిలా వుంటే.. ఉక్రెయిన్ నుంచి రాష్ట్ర విద్యార్థుల తరలింపుకు స్పెషల్ ఫోకస్ పెట్టింది ఏపీ ప్రభుత్వం. ఉక్రెయిన్ సరిహద్దు దేశాలకు రాష్ట్ర ప్రతినిధుల్ని పంపిస్తోంది.

హంగేరీలోని బుడాపెస్ట్ కు చేరుకున్నారు ఏపీఎన్ఆర్టీఎస్ అధ్యక్షుడు వెంకట్ మేడపాటి. బుడాపెస్ట్ లో ఉన్న రాష్ట్ర విద్యార్థులను కలసి ఏర్పాట్లను అడిగి తెలుసుకున్నారు మేడపాటి. బుడాపెస్ట్ నుండి ఇండియాకు వచ్చే విమానాల సంఖ్య తగ్గించిన నేపథ్యంలో ఆందోళన వ్యక్తం చేశారు ఏపీ విద్యార్థులు. ఈ విషయాన్ని కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ దృష్టికి తీసుకు వెళ్లమని కోరారు విద్యార్థులు. దీనిపై ఏపీఎన్ఆర్టీఎస్ సానుకూలంగా స్పందించింది.

వచ్చే 24 గంటల్లో మరో 8 వేల మంది విద్యార్థులు భారత్‌కు రానున్నారు. 18 విమానాల్లో ఉక్రెయిన్‌ నుంచి తీసుకొస్తోంది భారత ప్రభుత్వం. యుద్ధం ప్రారంభం అయినప్పటినుంచీ ఇప్పటి వరకూ భారత్‌కు సురక్షితంగా చేరారు 20 వేల మంది భారతీయులు.

Exit mobile version