AP GOVT : ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్ లో నీ ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.. HOD కార్యాలయాలు మరియు సెక్రటేరియట్, హైకోర్టు అలాగే అసెంబ్లీ వంటి విభాగాల లో పని చేస్తున్న ఉద్యోగులకు 5 రోజులు పనిచేసే విధానాన్ని మరో సంవత్సరం పాటు పొడిగిస్తున్నట్లు తెలిపింది..ఈ విషయం పై జరిగిన చర్చలో సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం తో నేడు ఉత్తర్వులు విడుదల చేసారు. ప్రభుత్వ ఉద్యోగులకు ఉదయం 10 నుంచి సాయంత్రం 5.30 వరకూ పనివేళలు ఉండనున్నాయి.గతం లో ఇదేవిధంగా పొడిగించిన గడువు ఈనెల 27తో ముగియ బోతుంది.. దీనితో ఉద్యోగ సంఘాల చేసిన వినతి మేరకు ప్రభుత్వం మరో సంవత్సరం పాటు గడువుని పొడిగించింది. దీంతో సీఎం జగన్కు ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు అయిన వెంకట్రామిరెడ్డి ధన్యవాదాలు తెలిపినట్లు సమాచారం.
వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు కూడా ముఖ్యమంత్రి నిర్ణయంతో హర్షం వ్యక్తం చేసినట్లు సమాచారం.. 2016 లోమొదట ఈ విధానాన్ని అప్పటి టీడీపీ ప్రభుత్వం ప్రారంభించింది. రాష్ట్రం విడిపోయిన తర్వాత సచివాలయం ఉద్యోగులను హైదరాబాద్ నుంచి అమరావతి వచ్చి విధంగా వారిని ప్రోత్సహించేందుకు అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం 5 రోజుల పని విధానాన్ని ప్రవేశపెట్టింది.ప్రతి సంవత్సరం కూడా ఈ విధానాన్ని పొడిగిస్తూ ఉంది.జగన్ అధికారంలో కి వచ్చిన తర్వాత కూడా ఈ విధానాన్ని కొనసాగిస్తూ వస్తున్నట్లు సమాచారం.. తాజాగా మరో సంవత్సరం ఈ విధానాన్ని పొడిగించారు.ఎన్నికల సంవత్సరం కావడం తో జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారు అని కొంతమంది వారి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.జగన్ ప్రభుత్వం ఉద్యోగులకు ఫ్రెండ్డ్లీ ప్రభుత్వం అని ఉద్యోగులకు ఎప్పుడూ అనుకూలంగా వుంటుందనీ.ఉద్యోగులకు ఎటువంటి ఇబ్బంది కలుగకుండా ఎల్లప్పుడూ వారి శ్రేయస్సు ను కోరుకుంటుందని మంత్రులు తెలియజేస్తున్నారు.
Also Read
- Love Couple Attacked: ప్రేమ వివాహం చేసుకున్న నవ దంపతులపై దాడి.. తాళిబొట్టు తెంచి..!
- Pawan Kalyan: నీట్ నిరసనలపై పవన్ కీలక వ్యాఖ్యలు.. విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలి..
- Pawan Kalyan : ఎర్రచందనం మాఫియాకు పవన్ వార్నింగ్.. మూలాలతో సహా నిర్మూలించాలి..
- Swarnagiri Gold Mine : జొన్నగిరి గోల్డ్ మైన్ ఇకపై ‘స్వర్ణగిరి గోల్డ్ మైన్’
తాజావార్తలు
-
Sonam Wangchuk: విద్యార్థులపై కేసులుండవు, ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలకు పరిహారం.. కేంద్రం ఇచ్చిన హామీలు ఇవే!
-
Stock Market Crash: ఒకే ఒక్క నిర్ణయం.. కుప్పకూలిన భారత స్టాక్ మార్కెట్, భారీ నష్టాల్లో టాప్ 10 షేర్లు
-
Vaibhav Sooryavanshi: బుడ్డోడి బ్యాటింగ్ మిస్ అయ్యారా?.. వైభవ్ మెరుపు ఇన్నింగ్స్ ఫుల్ వీడియో మీకోసమే!
-
Love Couple Attacked: ప్రేమ వివాహం చేసుకున్న నవ దంపతులపై దాడి.. తాళిబొట్టు తెంచి..!
-
Student Protest: నేడు రాష్ట్రవ్యాప్తంగా విద్యా సంస్థల బంద్..
ట్రెండింగ్
-
ఒక్కసారి ఛార్జ్ చేస్తే 526 కి.మీ రేంజ్, Level-2 ADASతో Kia Syros EV లాంచ్.. రూ.13.49 లక్షల ప్రారంభ ధరతో.!
-
రూ.8,599కే 90Hz డిస్ప్లే, IR బ్లాస్టర్ ఫీచర్, మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీతో ZENO 100 Pro లాంచ్.. పవర్ బ్యాంక్లు కూడా.!
-
Vaibhav Sooryavanshi Records: మూడు వరల్డ్ రికార్డులు బద్దలు కొట్టిన వైభవ్.. ఇక ఎవరికీ సాధ్యం కాదు!
-
Water Manifestation Technique: “నీటి మానిఫెస్టేషన్ టెక్నిక్” అంటే ఏమిటి.? నిజంగా పనిచేస్తుందా.?
-
Shreyas Iyer: ఆ ఇద్దరే మ్యాచ్ గెలిపించారు.. మాటలు రావడం లేదు.. తొలి విజయంపై శ్రేయస్ భావోద్వేగం!