ఓవైపు కరోనా సెకండ్ వేవ్లో ఇంకా భారీగా కొత్త కేసులు వెలుగుచూస్తూనే ఉన్నాయి.. మరోవైపు.. కోవిడ్ థర్డ్ వేవ్పై హెచ్చరికల నేపథ్యంలో.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అప్రమత్తం అవుతోంది.. మూడో దశ కరోనాను ఎదుర్కొనేందుకు సిద్ధమవుతోంది సర్కార్.. మూడో దశలో చిన్న పిల్లలకు కరోనా సోకుతుందనే అంచనాతో అలర్ట్ అయిన సర్కార్.. పిడీయాట్రిక్ కోవిడ్-19 టాస్క్ఫోర్స్ కమిటీ ఏర్పాటు చేసింది.. ఏపీఎంఎస్ఐడీసీ చంద్రశేఖర్ రెడ్డి నేతృత్వంలో 8 మంది సభ్యులతో టాస్క్ఫోర్స్ కమిటీ ఏర్పాటైంది.. మూడో దశలో చిన్న పిల్లలకు కోవిడ్ సోకితే ఎలాంటి చర్యలు తీసుకోవాలి.. కోవిడ్ ప్రొటోకాల్స్ ఏ విధంగా ఉండాలనే అంశాలపై అధ్యయనం చేయనుంది టాస్క్ఫోర్స్. చిన్న పిల్లలకు ఇవ్వాల్సిన కరోనా చికిత్సపై వైద్యారోగ్య సిబ్బందికి శిక్షణపై నివేదిక కూడా ఇవ్వనుంది.. వారం రోజుల్లోగా ప్రాథమిక నివేదిక ఇవ్వాల్సిందిగా టాస్క్ ఫోర్స్ కమిటీని ఆదేశించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.
కరోనా థర్డ్ వేవ్ ఎదుర్కొనేందుకు సర్కార్ రేడీ.. టాస్క్ఫోర్స్ ఏర్పాటు..
cm jagan