సింహాచలం భూముల వ్యవహారం.. దేవాదాయశాఖ కీలక ఆదేశాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అన్యాక్రాంతం అయిన సింహాచలం భూములపై ప్రభుత్వం దూకుడు పెంచింది. బాధ్యులైన సూత్రధారులు, పాత్రధారుల లెక్కలు బయటపెట్టేం దుకు విజిలెన్స్ విచారణ వేగవంతం అయ్యింది. 2016-2017లో దేవస్థానం ఆస్తుల జాబితా నుంచి 862 ఎకరాలు తొలగించినట్లు దేవాదాయశాఖ త్రిసభ్య కమిటీ గుర్తించి నివేదిక ఇచ్చింది. ఈ రిపోర్ట్ ఆధారంగా ప్రాప ర్టీ రిజిస్టర్ నుంచి నిబంధనలకు విరుద్ధంగా తొలగించిన భూముల విలువ బహిరంగ మార్కెట్లో 10వేల కోట్ల రూపాయలనేది ఓ వాదన. దీంతో దేవుడి సొమ్మును కొల్లగొట్టిన వా రిని ఆధారాలతో సహా పట్టించాలనే పట్టుదలతో ఉంది. ఇందులో భాగంగానే 862ఎకరాల భూములను నిషేధిత జాబితాలో చేర్చింది. దీంతో క్రయ విక్రయాలు జరిపే వీలు లేదు. ఇప్పటికే ఈ భూములు చేతులు మారిపోగా…చాలా అపార్ట్ మెంట్లు, భవనాలు, లే అవుట్లు పుట్టుకొచ్చాయి.
బీఆర్టీఎస్కు ఆను కుని సింహాచలం, వేపగుంట ప్రాంతాల్లో కొత్తకొత్త అపార్ట్ మెంట్లు నిర్మాణం కాగా… వీటిలో చాలా భాగం దేవస్థానం భూముల వివాదంలో ఉన్నాయి. ఇక్కడ అమ్మకాలు, కొనుగోళ్లు చేసేప్పుడు జాగ్రత్త లు పాటించకపోతే ఇబ్బందులు తప్పవంటున్నారు అధికారులు. సింహచలం దేవస్థానానికి చెందిన భూములు ప్రాపర్టీ రిజిస్టర్ నుంచి తొలగించారనేది నిర్ధారణ అయింది. అయితే వీటిని ఎందుకు, ఎవరికి కేటాయించారనేది లెక్క తేలాల్సి ఉంది. అదే సమయంలో అధికార పరిధిని దాటి అప్పటి ఈవో రామ చంద్ర మోహన్, అసిస్టెంట్ కమిషనర్ సుజాత పనిచేశారని తేలడంతో వేటు వేసింది ప్రభుత్వం. విజిలెన్స్ విచారణలో మరింత మంది బండా రం బయటపడే అవకాశం ఉంది. ఇదే సమయంలో 862 ఎకరాలను నిషేధిత జాబితాలో చేర్చడం అక్రమార్కులకు కునుకు లేకుండా చేస్తోంది.
Also Read
తాజావార్తలు
-
Story Board : మహా సంక్షోభం ఎవరి చేతుల్లో లేదా? ప్రజలు జాగ్రత్తలు పాటించాల్సిందేనా?
-
PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
-
Off The Record : మొక్కుబడి తంతుగా ట్రైనింగ్ క్యాంపెయిన్
-
Peddi Suspense : రామ్ చరణ్ పెద్దికి లైన్ క్లియర్ అవ్వలేదా?
-
PM Modi: నెదర్లాండ్స్ రాజు, రాణితో మోడీ భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై కీలక చర్చలు
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..