సింహాచలం భూముల వ్యవహారం.. దేవాదాయశాఖ కీలక ఆదేశాలు..
అన్యాక్రాంతం అయిన సింహాచలం భూములపై ప్రభుత్వం దూకుడు పెంచింది. బాధ్యులైన సూత్రధారులు, పాత్రధారుల లెక్కలు బయటపెట్టేం దుకు విజిలెన్స్ విచారణ వేగవంతం అయ్యింది. 2016-2017లో దేవస్థానం ఆస్తుల జాబితా నుంచి 862 ఎకరాలు తొలగించినట్లు దేవాదాయశాఖ త్రిసభ్య కమిటీ గుర్తించి నివేదిక ఇచ్చింది. ఈ రిపోర్ట్ ఆధారంగా ప్రాప ర్టీ రిజిస్టర్ నుంచి నిబంధనలకు విరుద్ధంగా తొలగించిన భూముల విలువ బహిరంగ మార్కెట్లో 10వేల కోట్ల రూపాయలనేది ఓ వాదన. దీంతో దేవుడి సొమ్మును కొల్లగొట్టిన వా రిని ఆధారాలతో సహా పట్టించాలనే పట్టుదలతో ఉంది. ఇందులో భాగంగానే 862ఎకరాల భూములను నిషేధిత జాబితాలో చేర్చింది. దీంతో క్రయ విక్రయాలు జరిపే వీలు లేదు. ఇప్పటికే ఈ భూములు చేతులు మారిపోగా…చాలా అపార్ట్ మెంట్లు, భవనాలు, లే అవుట్లు పుట్టుకొచ్చాయి.
బీఆర్టీఎస్కు ఆను కుని సింహాచలం, వేపగుంట ప్రాంతాల్లో కొత్తకొత్త అపార్ట్ మెంట్లు నిర్మాణం కాగా… వీటిలో చాలా భాగం దేవస్థానం భూముల వివాదంలో ఉన్నాయి. ఇక్కడ అమ్మకాలు, కొనుగోళ్లు చేసేప్పుడు జాగ్రత్త లు పాటించకపోతే ఇబ్బందులు తప్పవంటున్నారు అధికారులు. సింహచలం దేవస్థానానికి చెందిన భూములు ప్రాపర్టీ రిజిస్టర్ నుంచి తొలగించారనేది నిర్ధారణ అయింది. అయితే వీటిని ఎందుకు, ఎవరికి కేటాయించారనేది లెక్క తేలాల్సి ఉంది. అదే సమయంలో అధికార పరిధిని దాటి అప్పటి ఈవో రామ చంద్ర మోహన్, అసిస్టెంట్ కమిషనర్ సుజాత పనిచేశారని తేలడంతో వేటు వేసింది ప్రభుత్వం. విజిలెన్స్ విచారణలో మరింత మంది బండా రం బయటపడే అవకాశం ఉంది. ఇదే సమయంలో 862 ఎకరాలను నిషేధిత జాబితాలో చేర్చడం అక్రమార్కులకు కునుకు లేకుండా చేస్తోంది.
Also Read
- Gudivada Amarnath: డేటా సెంటర్పై మాజీ మంత్రి ఫైర్.. పలు అంశాలపై సూటి ప్రశ్నలు.!
- Exam Malpractice: పరీక్షల్లో మాల్ ప్రాక్టీస్ చేస్తూ పట్టుబడ్డ 20 మంది వైద్య విద్యార్థులు..
- Fuel Shortage: పెట్రోల్ బంక్లకు మంత్రి నాదెండ్ల వార్నింగ్..
- AP Education Department: టీచర్ పోస్టుల సర్దుబాటుపై ఫోకస్ పెట్టిన విద్యాశాఖ.. బదిలీల్లో ట్విస్ట్..!
తాజావార్తలు
-
UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్లో పవర్ స్ట్రగుల్..
-
PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
-
Payal Rajput: రిపోర్టర్ ప్రశ్నకు ఏడుస్తూ ఈవెంట్ నుంచి వెళ్లిపోయిన పాయల్ రాజ్పుత్
-
The Lalit Hotel: ఢిల్లీలోని లగ్జరీ హోటల్కు వెయ్యి కోట్ల పెనాల్టీ! ఎందుకో తెలుసా?
-
S-400 air defence system: పాకిస్తాన్కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో