ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఈరోజు మళ్ళీ పెరిగింది. ఏపీ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 57, 345 శాంపిల్స్ పరీక్షించగా.. 1084 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. తాజా టెస్ట్లతో కలుపుకుని.. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు నిర్వహించిన టెస్ట్ల సంఖ్య 2,82,35, 650 కు చేరింది. ఇక, మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 20,49,314 కి పెరగగా.. ఇప్పటి వరకు కోలుకున్నవారి సంఖ్య 20,23,496 కు చేరుకుంది.. మరోవైపు.. ఇప్పటి వరకు 14,163 మంది కోవిడ్ బాధితులు రాష్ట్రంలో మృతిచెందగా.. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 11,655 గా ఉన్నాయని పేర్కొంది ఏపీ ప్రభుత్వం.
ఏపీలో పెరిగిన కరోనా కేసులు..కొత్తగా 1084 కేసులు
