Site icon NTV Telugu

ఏపీలో కొత్త‌గా 103 క‌రోనా కేసులు

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో క‌రోనా కేసులు క్ర‌మంగా త‌గ్గుతూ వ‌స్తున్నాయి. తాజాగా ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర ఆరోగ్య శాఖ విడుద‌ల చేసిన హెల్త్ బులిటెన్ ప్ర‌కారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 28,670 శాంపిల్స్‌ పరీక్షించగా.. 103 పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. మరో ఇద్ద‌రు కోవిడ్‌ బాధితులు మృతి చెందారు. ఇక, ఇదే సమయంలో 175 మంది కోవిడ్‌ నుంచి పూర్తి స్థాయిలో కోలుకున్నారు.

https://ntvtelugu.com/dk-aruna-criticizes-trs-leaders/

దీంతో.. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన కరోనా నిర్ధారణ పరీక్షల సంఖ్య 3,10,67,410 కు చేరుకోగా… మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2076077 కు పెరిగింది.. ఇక, 2060236 మంది పూర్తిస్థాయిలో కోలుకోగా.. 14,483 మంది కోవిడ్‌ బాధితులు మృతి చెందారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా యాక్టివ్‌ కేసులు 1358 గా ఉన్నాయని పేర్కొంది ఏపీ ప్రభుత్వం.

Exit mobile version