NTV Telugu Site icon

ఏపీ క‌రోనా అప్డేట్‌: ఈరోజు కేసులు ఎన్నంటే…

రాష్ట్రంలో క‌రోనా కేసులు క్ర‌మంగా త‌గ్గుతున్నాయి.  నిన్న ఉద‌యం 9 గంట‌ల నుంచి ఈరోజు ఉద‌యం 9 గంట‌ల వ‌ర‌కు 61,298 శాంపిల్స్‌ను ప‌రీక్షించగా, 1540 పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి.  దీంతో రాష్ట్రంలో ఇప్ప‌టి వ‌ర‌కు న‌మోదైన మొత్తం క‌రోనా కేసుల సంఖ్య 19,57,932కి చేరింది.  ఇందులో 19,23,675 మంది కోలుకొని డిశ్చార్జ్ అయిన‌ట్టు బులిటెన్‌లో పేర్కొన్నారు.  24 గంట‌ల్లో రాష్ట్రంలో 2,304 మంది క‌రోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.  ఇక‌పోతే, రాష్ట్రంలో ప్ర‌స్తుతం 20,965 యాక్టీవ్ కేసులు ఉన్నట్టు రాష్ట్ర ఆరోగ్య‌శాఖ బులిటెన్ పేర్కొన్న‌ది.  రాష్ట్రంలో కొత్త‌గా క‌రోనాతో 19 మంది మృతిచేందారు.  ఇప్ప‌టి వ‌ర‌కు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో న‌మోదైన మొత్తం క‌రోనా మ‌ర‌ణాల సంఖ్య 13,292కి చేరింది.  చిత్తూరులో 280, కృష్ణాజిల్లాలో 263, నెల్లూరులో 210 కేసులు న‌మోద‌య్యాయి.  

Read: రోల్స్ రాయిస్ కేసులో విజయ్ కు ఊరట