AP Collectors Conference: నేడు రెండో రోజు కలెక్టర్ల సమావేశం.. ఐటీ, రెవెన్యూ శాఖలపై సీఎం చంద్రబాబు సమీక్ష..
- అమరావతి: నేడు రెండో రోజు కలెక్టర్ల సమావేశం..
- ఐటీ, రెవెన్యూ శాఖలపై సీఎం చంద్రబాబు ప్రత్యేక సమీక్ష..
- సాయంత్రం శాంతి- భద్రతలపై కలెక్టర్లు, ఎస్పీలతో సమీక్షించనున్న సీఎం..
- లా అండ్ ఆర్డర్పై కొత్త ఎస్పీలకు సూచనలు ఇవ్వనున్న సీఎం చంద్రబాబు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Collectors Conference: అమరావతిలోని ఏపీ సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరుగుతున్న కలెక్టర్ల సదస్సు రెండో రోజు కూడా కొనసాగనుంది. అయితే, ఇవాళ ఐటీ, రెవెన్యూ శాఖలపై ప్రత్యేకంగా సీఎం చర్చించనున్నారు. ఆదాయం వచ్చే శాఖలకు సంబంధించి కీలక సమీక్ష జరపనున్నారు. ఈ సందర్భంగా హెచ్ఆర్ డీ, హెల్త్ కు సంబంధించి రెండో రోజు కలెక్టర్ల సమావేశంలో చర్చ జరిగే అవకాశం ఉంది. ఈ రోజు సాయంత్రం రాష్ట్రంలోని శాంతి భద్రతలపై జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో ప్రత్యేకంగా చర్చించనున్నారు. అలాగే, శాంతి భద్రతలతో పాటు డ్రగ్స్, గంజాయిని అరికట్టడంపై కూడా కీలక సూచనలు చేసే ఛాన్స్ ఉంది. ఇక, మహిళలు, చిన్న పిల్లలపై జరుగుతున్న దాడులు వీటికి సంబంధించిన అంశాలపై సమీక్షించనున్నారు. ఈ సందర్భంగా లా అండ్ ఆర్డర్ పై కొత్త ఎస్పీలకు సీఎం చంద్రబాబు కీలక సూచనలు ఇవ్వనున్నారు.
Read Also: Aarogyasri: నేటి నుంచి ఆరోగ్య శ్రీ సేవలు బంద్..!
Also Read
- YS Jagan: డీఎస్సీ బాధితులకు జగన్ భరోసా.. అండగా ఉంటాం.. న్యాయపోరాట ఖర్చులన్నీ భరిస్తాం..
- CM Chandrababu: తెలంగాణలో పవన్ కల్యాణ్ సభకు అడ్డంకులపై స్పందించిన చంద్రబాబు.. ఆసక్తికర వ్యాఖ్యలు..
- DSC Candidates: డీఎస్సీ నియామకాల్లో అన్యాయం.. జగన్కు ఫిర్యాదు చేసిన అభ్యర్థులు
- Tamballapalle MLA: చావడానికైనా, చంపడానికైనా సిద్ధం.. తంబళ్లపల్లె ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు!
ఇక, నిన్న ప్రారంభమైన కలెక్టర్ల సమావేశంలో సీఎం చంద్రబాబు పలు శాఖలపై సమీక్షించారు. ఈ సందర్భంగా విజయవాడలోని రాజరాజేశ్వరిపేటలో విజృంభిస్తున్న డయేరియా వ్యాప్తిని అరికట్టకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. RR పేట ఇష్యూ మానవ తప్పిదమన్న ఆయన.. రాజ రాజేశ్వరి పేటలో డయేరియా కట్టడిలో అధికారులు వైఫల్యం చెందారన్నారు. అలాగే, గుంటూరు జిల్లా తురకపాలెం ఘటనను కేస్ స్టడీగా తీసుకోవాలని సూచించారు. అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఇక, అసంపూర్తిగా ఉన్న మెడికల్ కాలేజీల నిర్మాణంపై పీపీపీ (ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యం) పద్ధతిలోనే ముందుకు పోతామని స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
Pakistan: జపాన్లో మసీదు వివాదం.. పాకిస్తాన్ పరువు పోయిందిగా..
-
YS Jagan: డీఎస్సీ బాధితులకు జగన్ భరోసా.. అండగా ఉంటాం.. న్యాయపోరాట ఖర్చులన్నీ భరిస్తాం..
-
Karnataka: కర్ణాటక సీఎంగా డీకే.శివకుమార్ ప్రమాణస్వీకారం
-
Mahalakshmi Rajyoga: జూన్ 11 నుంచి మహాలక్ష్మీ రాజయోగం.. ఈ రాశుల వారికి డబ్బే డబ్బు..
-
Chicken Keema Paratha Recipe: యమ్మీ.. యమ్మీ.. చికెన్ కీమా పరోటా.. సింపుల్గా ఇలా ఇంట్లోనే చేసుకోండి..!
ట్రెండింగ్
-
Motorola Edge 2026 లాంచ్.. 6.3 అంగుళాల 1.5K AMOLED డిస్ప్లే, Dimensity 7450 చిప్తో.!
-
Pest Control : చెదల బెడదకు చెక్.. ఇంట్లోనే ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Traditional Desserts : జీర్ణక్రియకు మేలు చేసే బూడిద గుమ్మడికాయ ‘హల్వా’.. సింపుల్ గా ఇలా చేసుకొండి.!
-
Neredu Jam : పిల్లలకు నేరేడు పండ్లు తినిపించే సీక్రెట్ ఇదే.! ఈ విధంగా జామ్ చేస్తే ప్లేట్ ఖాళీ..!
-
Mamidikaya Pappucharu: ‘మామిడికాయ పప్పుచారు’ ఇలా చేయండి.. దీని ముందు స్టార్ హోటల్ వంటలూ దిగదుడుపే.!