Site icon NTV Telugu

CM YS Jagan: రేపు ప్రకాశం జిల్లాకు సీఎం జగన్‌

Cm Ys Jagan

Cm Ys Jagan

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి బిజీ బిజీగా గడుపుతున్నారు.. ఓవైపు అధికారిక కార్యక్రమాలు, మరోవైపు పార్టీ కార్యక్రమాలు.. మధ్యలో పెళ్లిళ్లు, శుభకార్యాలకు హాజరవుతూ వస్తున్నారు.. ఇక, రేపు సీఎం వైఎస్‌ జగన్‌ ప్రకాశం జిల్లా దర్శిలో పర్యటించనున్నారు.. దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్‌ తనయుడి వివాహ రిసెప్షన్‌కు హాజరుకాబోతున్నారు ఏపీ సీఎం.. దీని కోసం.. రేపు ఉదయం అంటే ఈ నెల 20వ తేదీన ఉదయం 10 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి ఉదయం 11 గంటలకు దర్శి చేరుకోనున్న ఆయన.. ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్‌ తనయుడి వివాహ రిసెప్షన్‌లో పాల్గొంటారు.. వధూవరులను ఆశీర్వదించి తిరుగు ప్రయాణం అవుతారు. మధ్యాహ్నం 12 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి.. మధ్యాహ్నం 1 గంటకు తాడేపల్లిలోని తన నివాసానికి చేరుకోనున్నారు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి.. ఇక, ఇవాళ ఎస్ఈబీ పై సమీక్ష చేపట్టారు సీఎం జగన్.. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో జరుగుతోన్న ఈ సమావేశానికి హోంమంత్రి తానేటి వనిత, సీఎస్ జవహర్ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.. స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో కార్యక్రమాలపై ఈ సమావేశంలో సమీక్ష నిర్వహిస్తున్నారు.

Read Also: Top Headlines @ 1 PM: టాప్‌ న్యూస్‌

Exit mobile version