మరణాల రేటు తక్కువగా ఉన్న రాష్ట్రాల్లో ఏపీ ఒకటి : సీఎం జగన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నాలుగు బోధనాసుపత్రుల్లో సీటీ, ఎంఆర్ఐ పరికరాలను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు ముఖ్యమంత్రి వైయస్.జగన్. రాష్ట్రంలోని 11 టీచింగ్ ఆస్పత్రులు ప్రస్తుతం ఉంటే కేవలం 7 ఆస్పత్రుల్లో మాత్రమే సీటీ, ఎం ఆర్ఐ సదుపాయాలు ఉన్నాయి. ఈ ఏడింటిలో కూడా పీపీపీ పద్దతిలో, టెక్నాలజీ అప్డేట్స్ లేకుండా ఉన్నాయి. 4 చోట్ల అస్సలు ఇలాంటి పరికరాలు, సదుపాయాలు లేవు. మనం 16 కొత్త టీచింగ్ ఆస్పత్రులను తీసుకు వస్తున్నాం. వ్యాధి నిర్ధారణ పరికరాలు అందుబాటు ఉండాలనే దృక్పథంతో అడుగులు ముందుకు వేస్తున్నాం. ఈ పరికరాలన్నింటినీ ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకు వచ్చి, ఆరోగ్య శ్రీ లబ్ధిదారులకు ఉచితంగా పరీక్షలు చేయాలనీ అన్నారు. నిర్వహణ వ్యయం ఆరోగ్యశ్రీ ట్రస్ట్ చూసుకుంటుంది. రాబోయే రోజుల్లో అప్గ్రేడ్తో, ఎప్పటికీ పనిచేసేలా ఈపరికరాలు ఉంటాయి. ప్రభుత్వ ఆస్పత్రుల్లో విప్లవాత్మక మార్పులు తీసుకు వస్తునాం అన్నారు.
ఆస్పత్రులను జాతీయ ప్రమాణాల స్థాయిలో అభివృద్ధి చేస్తున్నాం. శ్రీకాకుళం, ఒంగోల, నెల్లూరు, కడపల్లో కొత్తగా సీటీ, ఎంఆర్ఐ పరికరాలు. ఈ పరికరాలకు 3 సంవత్సరాల వారెంటీ ఉంటుంది, మరో 7 ఏళ్లపాటు నిర్వహణను కంపెనీలు నిర్వహిస్తాయి. మిగిలిన 7 బోధనాసుపత్రుల్లో ఉన్న పరికరాల అప్డేషన్, కొత్త పరికరాలు ఏర్పాటు చేస్తాం. ఆరోగ్య శ్రీ ట్రస్టు ద్వారా వీటిని నిర్వహిస్తాం. ఆరోగ్యశ్రీ ద్వారా మరో అడుగు, అలాగే నాడు – నేడు ద్వారా మరో అడుగు ముందుకేస్తున్నాం. ఆస్పత్రుల్లోని వైద్యులు, నర్సులు, శానిటేషన్ సిబ్బంది, ఆశ వర్కర్లు, వాలంటీర్లు కోవిడ్ సమయంలో కష్ట పడుతున్నారు. ఎంతో ఒత్తిడి ఉన్నా… ప్రజలకు అందుబాటులో ఉండి సేవలందిస్తున్నారు. వీరి సేవలగురించి ఎంత పొగిడినా తక్కువే. అందరి ప్రశంసలు మీకు ఉంటాయి అని జగన్ తెలిపారు.
Also Read
- YS Jagan: సుగాలి ప్రీతి కేసుపై వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు..
- Mega DSC 2025: మెగా డీఎస్సీ-2025పై దుష్ప్రచారం చేస్తే క్రిమినల్ కేసులు.. పాఠశాల విద్యాశాఖ తీవ్ర హెచ్చరిక
- Vizag Bhimili Murder: ప్రియుడి మోజులో పచ్చని సంసారంలో నిప్పులు.. భర్తను చున్నీతో చంపేసిన ఇల్లాలు!
- OTR : Thopudurthi Prakash Reddy ఉక్కిరి బిక్కిర అవుతున్నారా? దిక్కుతోచల స్థితిలో ఉన్నారా..?
కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, డీఎంఅండ్హెచ్ఓలకు కొన్ని సూచనలు చేయదలిచాను. ఫీవర్ సర్వే సరిగ్గా చేయలేదని కొందరు అధికారులు దిగువ స్థాయి సిబ్బందిపై చర్యలు తీసుకుంటన్నారన్న వార్తలు చూశాను. ప్రస్తుత మహమ్మారి ఉన్న సమయంలో ప్రతి ఒక్కరూ కూడా ఒత్తిడిలో ఉన్నారని గుర్తించాలి. మంచిగా వారిచేత పనిచేయించుకోవాలని అధికారులను కోరుతున్నా. నా దగ్గరనుంచి పారిశుద్ధ్య కార్మికుడు వరకూ ప్రతి ఒక్కరూ కూడా కోవిడ్ వల్ల వచ్చే అనూహ్య పరిస్థితులును ఎదుర్కోనే ఒత్తిడిలో ఉన్నారు. రోజుకు 20 వేలకుపైగా కేసులు నమోదవుతున్నాయి. మన దగ్గర మహానగరాలు హైదరాబాద్, చెన్నై, బెంగుళూరు లాంటి నగరాలు లేకపోయినా సరే.. మన రాష్ట్రంలో మరణాల రేటు దేశంలోని అన్నిరాష్ట్రాలతో పోలిస్తే.. తక్కువగా ఉన్న రాష్ట్రాల్లో ఒకటి. ఉద్యోగులంతా బాధ్యతలను చిరునవ్వుతో తీసుకుంటున్నారు కాబట్టి, ఎంత ఒత్తిడి ఉన్నా సరే పనిచేస్తున్నారు సాధ్యం అయ్యింది. ఎవ్వరూ కూడా సహనం కోల్పోవద్దు అని పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Fridge Cleaning Tips: ఇంట్లోనే 5 నిమిషాల్లో తయారయ్యే ఈ నేచురల్ స్ప్రే వాడండి.. మీ ఫ్రిజ్ ఎప్పుడూ తాజాగానే ఉంటుంది..!
-
Ranveer Singh: హైకోర్టు ఆదేశాలతో..చాముండేశ్వరి ఆలయంలో రణ్వీర్ సింగ్ క్షమాపణలు!
-
Virat Kohli: నీ రేంజ్ ఏంటి.. నువ్వు చేసే పనులేంటి కోహ్లీ.! ఫన్నీ యాక్షన్స్ వైరల్..
-
Egg Storage Tips in Summer: వేసవిలో గుడ్లు ఎన్ని రోజులు నిల్వ ఉంటాయి..? తినే ముందు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు
-
Ravi Teja : ఆగస్ట్ రేస్లో మాస్ మహారాజా.. సాలిడ్ హిట్ కొడతాడా?
ట్రెండింగ్
-
Raw Mango Roti Pachadi: అమ్మ చేతి రుచిని గుర్తు చేసే పుల్లటి “మామిడికాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
రూ.11,999కే 6000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Lava SHARK 2 5G లాంచ్..!
-
వాతావరణం మారితే కలర్ మారుతున్న ఫోన్.. 12 కలర్ వేరియంట్స్, సరికొత్త AI ఫీచర్లతో Infinix HOT 70 లాంచ్.!
-
Nitish Kumar Reddy Birthday: టెక్నిక్ + టాలెంట్ + టెంపరమెంట్.. విశాఖ కుర్రాడి జర్నీ.!
-
Chicken Pickle Recipe: 4 నెలలు పాడవకుండా ఉండే ఆంధ్ర స్టైల్ స్పైసీ ‘చికెన్ పచ్చడి’.. ఒకసారి తింటే మళ్లీ మళ్లీ తినాలినిపించేలా చేయండి ఇలా.!