CM Jagan: కుమార్తెను చూసి గర్వపడిన సీఎం జగన్-భారతి దంపతులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీ సీఎం జగన్ కుటుంబ సమేతంగా ప్రస్తుతం ప్యారిస్ పర్యటనలో ఉన్నారు. తన రెండో కుమార్తె హర్షిణి రెడ్డి ప్యారిస్లోని ఇన్సీడ్ యూనివర్సిటీ నుంచి మాస్టర్స్ డిగ్రీ పట్టా అందుకుంటున్న సందర్భంగా తమ కుమార్తె కాన్వకేషన్ కార్యక్రమంలో పాల్గొనేందుకు సీఎం జగన్ అక్కడికి వెళ్లారు. ఈ సందర్భంగా శుక్రవారం నాడు ఈ పట్టా ప్రదానం జరిగింది. ఈ కార్యక్రమంలో జగన్, ఆయన భార్య భారతి పాల్గొన్నారు. తమ కుమార్తె డిగ్రీ పట్టా అందుకున్న తరుణంలో సీఎం జగన్ చేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
Read Also: Pawan Kalyan: సమాజ క్షేమమే.. జనసేన పార్టీ ధ్యేయం
Also Read
- CM Chandrababu: కాగితాలు తీసుకుని కార్లో వదిలిపెట్టొద్దు, పరిష్కారం చూపండి.. కలెక్టర్లకు సీఎం ఆదేశాలు!
- CM Chandrababu: మంత్రుల రివ్యూకు మినహాయింపు ఉండదు.. సీఎం చంద్రబాబు వార్నింగ్!
- Weather Forecast Today: తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ హెచ్చరిక.. రెండు రోజుల పాటు పిడుగులతో కూడిన వర్షాలు!
- What's Today : ఈ రోజు ఏమున్నాయంటే..?
‘డియర్ హర్షా చాలా గర్వంగా ఉంది. నీవు ఎదిగిన తీరు అమిత సంతోషాన్నిచ్చింది. దేవుడు నీ పట్ల కృప చూపించాడు. ఈ రోజు ఇన్సీడ్ నుంచి డిస్టింక్షన్తో గ్రాడ్యుయేషన్ పూర్తి చేయడం నాకు గర్వంగా ఉంది’ అంటూ జగన్ తన ట్వీట్లో తెలిపారు. తన కుమార్తెకు డిస్టింక్షన్తో పాటు డీన్స్ జాబితాలోనూ చోటు దక్కడం చాలా సంతోషంగా ఉందని ఆయన పేర్కొన్నారు. అంతేకాకుండా హర్షిణి రెడ్డితో జగన్ దంపతులు దిగిన ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. తల్లిదండ్రుల సమక్షంలోనే హర్షిణి రెడ్డి పట్టా పుచ్చుకున్నట్లు ఈ ఫోటోలో చూడొచ్చు. రేపు సాయంత్రం ప్యారిస్ పర్యటన ముగించుకుని సీఎం జగన్ గన్నవరం చేరుకోనున్నారు. కాగా ప్రఖ్యాత యూనివర్సిటీ నుంచి హర్షిణి రెడ్డి డిగ్రీ పట్టా అందుకోవడంపై సోషల్ మీడియాలో నెటిజన్ల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
Dear Harsha, it’s been a wonderful journey watching you grow up. God has been abundantly gracious. Today I’m proud to see you graduate from INSEAD with distinction and on the Dean’s list. Wishing you God’s very best! pic.twitter.com/7FuZcXp4uT
— YS Jagan Mohan Reddy (@ysjagan) July 2, 2022
తాజావార్తలు
-
Amit Shah: గంగోత్రి నుంచి గంగాసాగర్ వరకు బీజేపీ..
-
Pakistan: ‘‘భారత సైన్యం ఎందుకు ఇంగ్లీష్లో మాట్లాడుతుంది.?’’.. పాక్ ఆర్మీ ప్రశ్నపై ట్రోల్స్..
-
Arshdeep Singh: అర్ష్దీప్ సింగ్కు షాకిచ్చిన బీసీసీఐ..! ఇక, కుదరదు..
-
China: జిన్పింగ్ పీఠానికే ఎసరు? చైనా మాజీ రక్షణ మంత్రుల మరణశిక్ష వెనుక ‘అసలు’ మిస్టరీ ఇదేనా!
-
Kerala Chief Minister: కేరళ సీఎం ఈయనేనా.?