NTV Telugu Site icon

ఏపీ అప్పుల్లో వుంది.. కేంద్ర నిధులతో అభివృద్ధి జరుగుతోంది

కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఇవాళ నుంచి జన ఆశీర్వాద యాత్రను ప్రారంభించారు. కేంద్రమంత్రి అయిన తర్వాత జనం ఆశీర్వాదం తీసుకునేందుకు కిషన్ రెడ్డి ఈ యాత్ర చేపట్టారు. తిరుపతికి చేరుకున్న కేంద్ర మంత్రి అక్కడ నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొన్నారు. కాగా, ఈ సభలో పాల్గొన్న ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ముఖ్యమంత్రి జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ఆయన మాట్లాడుతూ.. అప్పులతో ఏపీలో పాలనా జరిగితే.. కేంద్ర నిధులతో ఏపీలో అభివృద్ధి జరుగుతోందన్నారు. జాతీయ రహదారుల విస్తరణ కేంద్ర నిధులతోనే జరుగుతోంది. అభివృద్ధి విషయంలో బీజేపీతో వైసీపీ చర్చకు రావాలని సవాల్ చేశారు.
భారతదేశమే కుటుంబంగా భావించిన వ్యక్తి నరేంద్రమోడీ అని వీర్రాజు కొనియాడారు. దేశాన్ని అన్ని విధాలుగా ప్రధాని అభివృద్ధి చేస్తున్నారు. వేంకటేశ్వరస్వామి అంటే కిషన్ రెడ్డికి ఎంతో భక్తి.. శ్రీవారిపై ఉన్న భక్తి వల్లే తిరుపతి నుంచి జనఆశీర్వాద యాత్రను తిరుపతి నుంచే ప్రారంభించారు’ అని సోము వీర్రాజు తెలిపారు.