ఏపీ అసెంబ్లీ సమావేశాల సమయాన్ని పొడగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. ఈ నెల 26 వ తేదీ వరకు ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలను కొనసాగించాలని కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఇవాళ జరిగిన బీఏసీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. 15 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలను జరుపాలని టీడీపీ డిమాండ్ చేసింది.. కేవలం వారం రోజుల పాటు పొడగిస్తూ.. ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అలాగే.. కరోనా నియమ నిబంధనాలు పాటిస్తూ.. అసెంబ్లీ సమావేశాలకు ప్రజా ప్రతినిధులు హాజరు కావాలని స్పీకర్ తమ్మినేని సీతారాం స్పష్టం చేశారు. కాగా.. మొదట ఒక్క రోజు మాత్రమే అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తామని జగన్ సర్కార్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.