Most Wanted Terrorsts Arrest: ఏపీలో మరోసారి ఉగ్ర కలకలం.. ఇద్దరు మోస్ట్వాంటెడ్ ఉగ్రవాదుల అరెస్ట్..!
- ఆంధ్రప్రదేశ్లో మరోసారి ఉగ్ర కలకలం..
- ఇద్దరు మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదుల అరెస్ట్..
- అన్నమయ్య జిల్లా రాయచోటిలో ఘటన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Most Wanted Terrorsts Arrest: ఆంధ్రప్రదేశ్లో మరోసారి ఉగ్ర కలకలం సృష్టిస్తోంది.. అన్నమయ్య జిల్లా రాయచోటిలో ఇద్దరు మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులను అరెస్ట్ చేశారు తమిళనాడు పోలీసులు.. పలు బాంబ్ బ్లాస్ట్ కేసులో నిందితులుగా ఉన్న ఇద్దరు ఉగ్రవాదునలు.. రహస్యంగా అదుపులోకి తీసుకున్నారు తమిళనాడు పోలీసులు.. స్థానిక పోలీసుల సహకారంతో ఈ రోజు మధ్యాహ్నం 3 గంటల సమయంలో అదుపులోకి తీసుకొని తమిళనాడుకు తరలించారు.. అయితే, చాలా కాలంగా రహస్యంగా రాయచోటిలో ఈ ఇద్దరు ఉగ్రవాదులు తలదాచుకున్నట్టు సమాచారం..
Read Also: YS Jagan: జగన్కు జడ్ ప్లస్ కేటగిరి భద్రత కల్పించండి.. హైకోర్టులో పిటిషన్
Also Read
- Madanapalli Girl Murder: మదనపల్లి చిన్నారి హత్య కేసులో బిగ్ ట్విస్ట్.. సూసైడ్ చేసుకున్న నిందితుడు!
- Minor Girl Murder: నేడు సైకో చేతిలో హత్యకు గురైన చిన్నారికి అంత్యక్రియలు..
- Madanapalle Minor Girl Case: మదనపల్లె చిన్నారి పోస్టుమార్టంలో సంచలన విషయాలు..
- Software Engineers Death: పోటీపడి 19 బీర్లు తాగారు.. మద్యం ఎక్కువై ఇద్దరు సాఫ్ట్వేర్ ఉద్యోగులు మృతి
అనేక ఉగ్ర కేసుల్లో 30 ఏళ్లుగా పరారీలో ఉన్న ఈ ఇద్దరు మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టులను ఏటీఎస్ అదుపులోకి తీసుకుంది.. అన్నమయ్య జిల్లా జిల్లాలో అబూబక్కర్ సిద్దీక్క్ (నాగూర్), మొహమ్మద్ అలీ అలియాస్ యూనుస్ (మేళపలయం)ను తమిళనాడు యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (ATS) అరెస్ట్ చేసింది.. ఈ ఇద్దరు ఉగ్రవాదులను తమిళనాడు న్యాయమూర్తి ఎదుట హాజరుపర్చనుంది ఏటీఎస్.. అయితే, 1995 నుండి పరారీలో ఉన్నాడట అబూబక్కర్ సిద్దీక్.. 1995లో చెన్నై చింతాద్రిపేటలో హిందూ మున్నాని కార్యాలయంలో బాంబు పేలుడు. 1995లో నాగూరులో పార్శిల్ బాంబు పేలుడు (తంగం మరణం).. 1999లో చెన్నై, తిరుచ్చి, కోయంబత్తూరు, కేరళలో 7 చోట్ల బాంబులు పెట్టడం.. చెన్నై పోలీస్ కమిషనర్ కార్యాలయం లక్ష్యంగా చేసుకోవడం.. 2011లో మధురైలో ఎల్.కె. అద్వానీ రథయాత్ర సమయంలో పైప్ బాంబు.. 2012లో వెల్లూరులో డాక్టర్ అరవింద్ రెడ్డి హత్య.. 2013లో బెంగళూరు మల్లేశ్వరంలో బీజేపీ కార్యాలయం సమీపంలో బాంబు పేలుడు కేసుల్లో నిందితుడిగా ఉన్నాడట.. మరోవైపు.. 26 ఏళ్లుగా పరారీలో ఉన్నాడట మొహమ్మద్ అలీ.. 1999లో తమిళనాడు, కేరళలో బాంబు ఉంచే ఘటనల్లో భాగస్వామిగా ఉన్నాడని తెలుస్తోంది.. అయితే, ఈ ఘటన మరోసారి ఏపీలో కలకలం రేపుతోంది.
తాజావార్తలు
-
Trump-Iran: పశ్చిమాసియా రౌడీ చనిపోయాడు.. ఇరాన్పై ట్రంప్ తీవ్ర వ్యాఖ్యలు
-
Sunil Gavaskar: విమర్శించే వారే మళ్లీ బీసీసీఐ దగ్గరకు వస్తారు.. అంతా డబ్బు మహిమ: సునీల్ గావస్కర్
-
DGP CV Anand: “ఇకపై నో ఫ్రెండ్లీ పోలీసింగ్”.. వాళ్లను అస్సలు వదలమన్న డీజీపీ సీవీ ఆనంద్
-
Pakistan: పాకిస్తాన్పై మీర్పూరీ ముస్లింల తిరుగుబాటు..
-
Ireland: ఐర్లాండ్లో అల్లర్లు.. తగలబడ్డ కార్లు, భవనాలు
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!