NTV Telugu Site icon

Minister Nimmala Ramanaidu: హంద్రీనీవా దుస్థితికి వైసీపీ ప్రభుత్వమే కారణం.. మేం నమ్మకాన్ని నిలబెట్టుకుంటాం..

Nimmala

Nimmala

Minister Nimmala Ramanaidu: హంద్రీనీవా దుస్థితికి గత వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వమే కారణం అన్నారు ఆంధ్రప్రదేశ్‌ నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు.. అన్నమయ్య జిల్లా మదనపల్లె సమ్మర్ స్టోరేజిని పరిశీలించిన ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. హంద్రీనీవా దుస్థితికి కారణం వైసీపీ ప్రభుత్వమే అని విమర్శించారు.. 5 శాతం పనులు కూడా పూర్తి చేయకుండానే సంపదను వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం కొల్లగొట్టుకుందన్నారు.. అయితే, తమ ప్రభుత్వం అలా కాదు.. పుంగనూరు బ్రాంచ్ కెనాల్ పనులు త్వరితగతిన పూర్తి చేస్తామని వెల్లడించారు.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటాం అన్నారు.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సహకరించకపోయినా.. ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామని స్పష్టం చేశారు.. ప్రస్తుతం పదనాలుగు లక్షలకోట్లు అప్పు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నెత్తిమీద ఉందన్నారు.. 2014లో రాష్ట్ర విభజనకన్నా.. 2019-24లో వైఎస్‌ జగన్ పాలన వళ్లే రాష్టానికి ఎక్కువ నష్టం జరిగిందన్నారు మంత్రి నిమ్మల రామానాయుడు..

Read Also: Jani Mastar case : కొన్ని ఛానెల్స్ అత్యుత్సాహంతో బన్నీపేరు పెట్టాయి: పుష్ప నిర్మాత

చిత్తూరు జిల్లాలో హంద్రీనీవ ప్రాజెక్ట్ పనులను పరిశీలించారు మంత్రి నిమ్మల.. దుమ్మన బావి దగ్గర పుంగనూరు బ్రాంచ్ కెనాల్, చిప్పిలి ఎస్ ఎస్ ట్యాంకుల పనుల పరిశీలించారు.. మధ్యాహ్నం కుప్పం బ్రాంచ్ కెనాల్ ఆఫ్ టేక్ పాయింట్ , కే-1 పంప్ హౌస్ పరిశీలించనున్నారు.. కుప్పం లో ఇరిగేషన్ అధికారులతో కుప్పం బ్రాంచ్ కెనాల్ పెండింగ్ పనులపై సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు మంత్రి నిమ్మల రామానాయుడు..