AndhraPradesh Woman: మానవ సేవే “మాధవి” సేవ. అంతిమ ‘సంస్కారం’ చూపుతున్న ఆంధ్రప్రదేశ్ మహిళ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AndhraPradesh Woman: సమాజంలో నేటికీ కొన్ని కట్టుబాట్లు ఉన్నాయి. మహిళలను స్మశాన వాటికల్లోకి రానీయకపోవటం వాటిలో ఒకటి. శవ దహనానికి పేర్చిన కట్టెల గుట్ట (కాష్టం) దగ్గరికి ఆడవాళ్లు వస్తే ‘పాపం’ అని కొన్ని వర్గాల వాళ్లు ఇప్పటికీ భావిస్తున్నారు. అయితే ఆ సామాజిక నిబంధనల కన్నా అంతిమ ‘సంస్కారం’ మిన్న అని ఆంధ్రప్రదేశ్కి చెందిన ఓ మహిళ నిరూపిస్తున్నారు. మానవత్వం పరిమళించిన మంచి మనిషిగా పేరు తెచ్చుకుంటున్నారు. ఆమే కానూరి శేషు మాధవి. కృష్ణా జిల్లా గన్నవరానికి చెందిన ఈమె.. స్వగ్రామంతోపాటు వెల్దిపాడులో వృధాశ్రమాన్ని నిర్వహిస్తున్నారు.
బాలకోటేశ్వరరావు పేరిట సేవా సంఘాన్ని స్థాపించి సోషల్ సర్వీస్ చేస్తున్నారు. పట్టెడన్నం దొరకని పండుటాకులను, ‘నా’ అనేవారులేని అనాథలను చేరదీయటంతోపాటు వాళ్ల చివరి ప్రయాణాన్ని గౌరవప్రదంగా ముగిస్తున్నారు. ఆ నలుగురిలో నేను సైతం అంటూ ఆదర్శంగా నిలుస్తున్నారు. కొవిడ్ సమయంలో ఆమె నిర్భయంగా అందించిన నిస్వార్థ సేవలను పలువురు మెచ్చుకుంటున్నారు. శేషు మాధవిని శెభాష్ మాధవీ అని మనసారా ప్రశంసిస్తున్నారు.
Also Read
- Junior Doctors Strike: ఏపీలో జూడాల సమ్మె సైరన్
- OTR : అసెంబ్లీకి వైసీపీ..? DSC రచ్చ వేళ కూటమి అలర్ట్.. బీసీ బిల్లుపై కీలక నిర్ణయం..!
- Shocking Murder Case: ఆస్తి కోసం సొంత బామ్మర్దినే చంపిన బావ.. 27 రోజుల తర్వాత బయటపడ్డ అసలు నిజం!
- Nara Lokesh: బాధిత కుటుంబాలకు భరోసా.. ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం: మంత్రి నారా లోకేష్
read also: Arvind Dharmapuri: కేసీఆర్ ని ఇక పరుషంగా విమర్శించను
మాధవి చేస్తున్న ఈ మానవ సేవలో ఆమె పిల్లలు కూడా పాలు పంచుకుంటూ ఉండటం విశేషం. మాధవి కుమార్తె సునీత, కుమారుడు అశోక్ ఒక వైపు బీటెక్ చదువుతూనే మరో వైపు తల్లికి చేదోడు వాదోడుగా ఉంటున్నారు. ఆమె చేసే ప్రతి పనిలో తమకు చేతనైనంత సాయం చేస్తున్నారు. కొవిడ్ మొదటి దశలో ఎంతో మంది అభాగ్యులకు మాధవి నీడనిచ్చారు. పోలీసులు, ఇతర సామాజిక కార్యకర్తలు దిక్కూ మొక్కూ లేనోళ్లను ఈమె దగ్గరికే తీసుకొచ్చేవారు. కులమతాలకు అతీతంగా మాధవి అందిస్తున్న సేవల గురించి సమీప గ్రామానికి చెందిన ఓ రిటైర్డ్ ఇంజనీర్ గొప్పగా చెప్పారు.
‘మాధవి లాగా ఎవరూ చేయలేరేమో. వయసు మీద పడి, అనారోగ్యంతో కన్నుమూసినవాళ్లను స్మశాన వాటికకు పంపే ముందు తలస్నానం చేయించి, ఒంటి మీద ఏమైనా గాయాలుంటే శుభ్రంగా కడిగి మరీ సాగనంపుతుంది. అంతటి విశాల హృదయం ఎంత మందికి ఉంటుంది?’ అని ఆయన అన్నారు. కరోనా ఫస్ట్ వేవ్లో ఓ 60 ఏళ్ల మహిళ మాధవి దగ్గరే ఉండేది. కొవిడ్ ట్రీట్మెంట్ తీసుకుంటూ చనిపోయింది. మహమ్మారి పట్ల సర్వత్రా భయానక పరిస్థితులు నెలకొన్న ఆ రోజుల్లో ఆమె మృతదేహాన్ని ఖననం చేయటానికి మాధవికి తోడుగా ఎవరూ ముందుకు రాలేదు.
దీంతో ఆ దయనీయ స్థితిలో డెడ్ బాడీని స్మశానవాటికకు ఒక్కతే తీసుకెళ్లి అంతిమక్రియలను పూర్తిచేసింది. మాధవి పడుతున్న బాధను చూసి ఆమె దగ్గర పనిచేసే ఇద్దరు ఉద్యోగులు మాత్రమే సాయంగా వచ్చారు. మంగమ్మ అనే మరో మహిళకు అంత్యక్రియలు చేసేటప్పుడూ ఇలాంటి పరిస్థితులే ఎదురయ్యాయి. చిన్నతనంలో, పెళ్లయ్యాక అనుభవించిన అష్టకష్టాలే తనను ఇలా సంఘ సేవ వైపు మరల్చాయని కానూరి శేషు మాధవి చెప్పారు. మానవ సేవే మాధవ(దేవుడి) సేవ అంటారు కదా. దానికి ఈ మాధవే సరైన నిదర్శనం.
తాజావార్తలు
-
International Credit Cards: భారతీయులకు క్రెడిట్ కార్డులు ఇచ్చేందుకు నిరాకరిస్తున్న గ్లోబల్ బ్యాంక్స్.. ఎందుకంటే?
-
Ravi Teja -Vivek : రవితేజ – వివేక్ ఆత్రేయ సినిమాకు నిర్మాతగా దిల్ రాజు పాత స్నేహితుడు
-
Aroopi OTT Release: తరతరాల శాపం… బొమ్మలో బంధించిన యక్షిణి.. ఓటీటీని వణికించేందుకు వస్తున్న ‘అరూపి’!
-
890cc V-Twin ఇంజిన్, కొత్త చాసిస్, కొత్త లుక్ తో Ducati Monster V2 లాంచ్.. ధర ఎంతంటే..?
-
Ajinkya Rahane: టీమిండియా టెస్ట్ టీమ్ కోసం మేం ముగ్గురం ఎంతో కష్టపడ్డాం!
ట్రెండింగ్
-
64MP కెమెరా, 9.49 మి.మీ. మందం, AI కెమెరా ఫీచర్లతో ఆగస్టు 25న రానున్న Boltt Ace 5G..!
-
7,000mAh బ్యాటరీ, 50MP సోనీ కెమెరా, FHD+ LCD 120Hz డిస్ప్లేతో వచ్చేందుకు సిద్దమైన Moto G Max..!
-
రూ.8,499కే Lava Smart 4 లాంచ్.. మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 5000mAh బ్యాటరీ, 90Hz LCD డిస్ప్లేతో బడ్జెట్ ఫోన్..!
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!