Andhra Pradesh: అయ్యో ఎలుకా .. ఇంత పని చేశావా?
ఓ ఎలుక ఏకంగా ఒక ఊరిని కాల్చి వేసింది.. ఏంటి నిజమా అంటే నిజమే అని చెప్పాలి.. తాజాగా జరిగిన ఘటన వింటే ఎవ్వరికైనా మైండ్ బ్లాక్ అవుతుంది.. ఓ మహిళ పెట్టిన దీపాన్ని దొంగిలించిన ఎలుక ఊరినే కాల్చివేసింది..ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ లో వెలుగు చూసింది.. ఈ ఘటనలో ప్రాణ నష్టం జరగలేదు కానీ భారీగా ఆస్తి నష్టం జరిగిందని సమాచారం..
వివరాల్లోకి వెళితే.. విజయనగరం జిల్లాలో ఈ ఘటన జరిగింది..మెంటాడ మండలం కొండ లింగాల వలసలో అకస్మాత్తుగా అగ్నిప్రమాదం సంభవించింది. ఆ మంటల కారణంగా సుమారు ఎనిమిది ఇళ్లు అగ్నికి ఆహుతయ్యాయి..ఇంట్లో ఉన్న రెండు గ్యాస్ సిలెండర్స్ పెద్ద పెద్ద శబ్దాలతో పేలాయి. శబ్దాల ధాటికి గ్రామమంతా ఉలిక్కి పడింది. అసలే మండుతున్న ఎండలు దానికి తోడు గాలులు.. ఇక చెప్పేదేముంది నిమిషాల్లో మంటలు దావానంలా పాకాయి… మంటలను ఆర్పెందుకు ప్రయత్నించినా పెద్దగా ప్రయోజనం లేకపోయింది.. ఇక చేసేదేమిలేక అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు..
Also Read
- Hundi Income: విజయవాడ కనకదుర్గమ్మ ఆలయ హుండీ లెక్కింపు.. కళ్లు చెదిరే ఆదాయం..
- Govt Employee Turns Chain Snatcher: షేర్ మార్కెట్ నష్టాలు.. ప్రభుత్వ ఉద్యోగి దొంగగా మారిన షాకింగ్ ఘటన..!
- AP Liquor Scam Case: లిక్కర్ స్కామ్లో కీలక మలుపు.. రంగంలోకి దిగిన ఐటీ అధికారులు
- Minister Gottipati Ravikumar: విద్యుత్ కోతలకు నో.. నిరంతర సరఫరా ఉండాల్సిందే.. మంత్రి గొట్టిపాటి ఆదేశాలు
వెంటనే సిబ్బంది అక్కడకు చేరుకొని దాదాపు గంటపాటు శ్రమించి మంటలను ఆర్పేశారు..అయితే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగింది.. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. తరువాత గ్రామస్తులు అగ్నిప్రమాదం కి గల కారణాల పై ఆరా తీశారు.. అసలు విషయం తెలుసుకొని షాక్ అయ్యారు.. ఎలుక దీపం ను తీసుకొని వెళ్లడంతో అక్కడ ఉన్న పూరి గుడిసె దగ్ధం అయ్యింది.. మరో రెండు రోజుల్లో పండుగ ఉండటంతో ఊర్లో సందడి వాతావరణం నెలకొంది.. ఇక ఓ పూరింట్లో దేవుడికి పూజ చేసి దీపం వెలిగించి కొద్ది సేపటి తరువాత బయటకు వెళ్ళిపోయారు కుటుంబసభ్యులు. ఇంతలో ఓ ఎలుక ఇల్లంతా తిరిగి దీపం ను తీసుకెళ్లటానికి ప్రయత్నించింది. ఆ ప్రయత్నంలో నూనె తో ఉన్న దీపం ఇంటి పూరి కప్పుకు తగిలి ఒక్కసారిగా మంటలు ప్రారంభమయ్యాయి…
ఒకవైపు ఎండ మరోవైపు గాలి వేగంగా వీస్తుండటంతో మంటలు ఆటోమెటిక్ గా పెరిగాయి.. ఫైర్ ఇంజన్ వచ్చి మంటలను అదుపు చేసినప్పటికి భారీ నష్టం జరిగింది.. ఈ మంటలు ఇంకా కొన్ని ఇళ్లకి తాకి పెను ప్రమాదానికి దారి తీసింది. ఈ ప్రమాదంతో భాదితులు ఇళ్లు వాకిలి లేక కట్టుబట్టలతో రోడ్డున పడ్డారు. గ్రామంలో పండుగ వేడుకలు జరగాల్సిన సమయంలో ఎలుక పెట్టిన ఈ మంటలు మా ప్రాణాల పైకి తెచ్చింది అంటూ గుండెలు బాదుకుంటున్నారు.. ఈ ప్రమాదంలో దాదాపు రూ.5 లక్షలకు పైగా ఆస్తి నష్టం జరిగిందని అంచనా..కేసు నమోదు చేసుకున్న పోలీసులు మరిన్ని వివరాలను సేకరించే పనిలో ఉన్నారు..
తాజావార్తలు
-
Playoff Venues: ఐపీఎల్ ప్లే ఆఫ్ వేదికలపై కీలక అప్డేట్.. ఇంపాక్ట్ ప్లేయర్ రూల్కు చరమగీతం..?
-
Texas Shooting: అమెరికాలో కాల్పుల కలకలం.. ఇద్దరు మృతి!
-
NTV Exclusive: సమంత ‘మా ఇంటి బంగారం’ సైలెన్స్ ఎందుకు?
-
MI Vs CSK: నిప్పులు చెరిగిన చెన్నై బౌలర్లు.. పెవిలియన్కు క్యూ కట్టిన ముంబై బ్యాటర్స్.. టార్గెట్ ఎంతంటే..
-
Vaibhav Sooryavanshi: బిగ్ షాక్.. వైభవ్ సూర్యవంశీని ఐపీఎల్ నుంచి తొలగించాలంటూ డిమాండ్స్..
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!