Andhra Pradesh: అయ్యో ఎలుకా .. ఇంత పని చేశావా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఓ ఎలుక ఏకంగా ఒక ఊరిని కాల్చి వేసింది.. ఏంటి నిజమా అంటే నిజమే అని చెప్పాలి.. తాజాగా జరిగిన ఘటన వింటే ఎవ్వరికైనా మైండ్ బ్లాక్ అవుతుంది.. ఓ మహిళ పెట్టిన దీపాన్ని దొంగిలించిన ఎలుక ఊరినే కాల్చివేసింది..ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ లో వెలుగు చూసింది.. ఈ ఘటనలో ప్రాణ నష్టం జరగలేదు కానీ భారీగా ఆస్తి నష్టం జరిగిందని సమాచారం..
వివరాల్లోకి వెళితే.. విజయనగరం జిల్లాలో ఈ ఘటన జరిగింది..మెంటాడ మండలం కొండ లింగాల వలసలో అకస్మాత్తుగా అగ్నిప్రమాదం సంభవించింది. ఆ మంటల కారణంగా సుమారు ఎనిమిది ఇళ్లు అగ్నికి ఆహుతయ్యాయి..ఇంట్లో ఉన్న రెండు గ్యాస్ సిలెండర్స్ పెద్ద పెద్ద శబ్దాలతో పేలాయి. శబ్దాల ధాటికి గ్రామమంతా ఉలిక్కి పడింది. అసలే మండుతున్న ఎండలు దానికి తోడు గాలులు.. ఇక చెప్పేదేముంది నిమిషాల్లో మంటలు దావానంలా పాకాయి… మంటలను ఆర్పెందుకు ప్రయత్నించినా పెద్దగా ప్రయోజనం లేకపోయింది.. ఇక చేసేదేమిలేక అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు..
Also Read
- Vangalapudi Anitha: రోడ్డెక్కడం కాదు.. అసెంబ్లీకి రావాలి.. వైసీపీకి అనిత సూచన
- YS Jagan Slams AP PPP Policy: ‘ఆంధ్రప్రదేశ్ ఫర్ సేల్’లా కొత్త PPP పాలసీ.. జగన్ తీవ్ర విమర్శలు
- YS Jagan: ‘డీఎస్సీలో పనిచేసే ఉద్యోగికే ఫస్ట్ ర్యాంక్’.. లోకేష్ రాజీనామా చేయాల్సిందే.. జగన్ సంచలన వ్యాఖ్యలు
- YS Jagan: ప్రజా సమస్యలపై మరింత గట్టిగా పోరాడాలి.. వైసీపీ నేతలకు జగన్ దిశానిర్దేశం
వెంటనే సిబ్బంది అక్కడకు చేరుకొని దాదాపు గంటపాటు శ్రమించి మంటలను ఆర్పేశారు..అయితే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగింది.. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. తరువాత గ్రామస్తులు అగ్నిప్రమాదం కి గల కారణాల పై ఆరా తీశారు.. అసలు విషయం తెలుసుకొని షాక్ అయ్యారు.. ఎలుక దీపం ను తీసుకొని వెళ్లడంతో అక్కడ ఉన్న పూరి గుడిసె దగ్ధం అయ్యింది.. మరో రెండు రోజుల్లో పండుగ ఉండటంతో ఊర్లో సందడి వాతావరణం నెలకొంది.. ఇక ఓ పూరింట్లో దేవుడికి పూజ చేసి దీపం వెలిగించి కొద్ది సేపటి తరువాత బయటకు వెళ్ళిపోయారు కుటుంబసభ్యులు. ఇంతలో ఓ ఎలుక ఇల్లంతా తిరిగి దీపం ను తీసుకెళ్లటానికి ప్రయత్నించింది. ఆ ప్రయత్నంలో నూనె తో ఉన్న దీపం ఇంటి పూరి కప్పుకు తగిలి ఒక్కసారిగా మంటలు ప్రారంభమయ్యాయి…
ఒకవైపు ఎండ మరోవైపు గాలి వేగంగా వీస్తుండటంతో మంటలు ఆటోమెటిక్ గా పెరిగాయి.. ఫైర్ ఇంజన్ వచ్చి మంటలను అదుపు చేసినప్పటికి భారీ నష్టం జరిగింది.. ఈ మంటలు ఇంకా కొన్ని ఇళ్లకి తాకి పెను ప్రమాదానికి దారి తీసింది. ఈ ప్రమాదంతో భాదితులు ఇళ్లు వాకిలి లేక కట్టుబట్టలతో రోడ్డున పడ్డారు. గ్రామంలో పండుగ వేడుకలు జరగాల్సిన సమయంలో ఎలుక పెట్టిన ఈ మంటలు మా ప్రాణాల పైకి తెచ్చింది అంటూ గుండెలు బాదుకుంటున్నారు.. ఈ ప్రమాదంలో దాదాపు రూ.5 లక్షలకు పైగా ఆస్తి నష్టం జరిగిందని అంచనా..కేసు నమోదు చేసుకున్న పోలీసులు మరిన్ని వివరాలను సేకరించే పనిలో ఉన్నారు..
తాజావార్తలు
-
NTR : ఎన్టీఆర్కు సర్జరీ..కిమ్స్ ఆస్పత్రి హెల్త్ బులెటిన్ విడుదల
-
Yashwant Varma: జస్టిస్ యశ్వంత్ వర్మకు షాక్.. విచారణ కమిటీ సంచలన రిపోర్ట్
-
Tollywood : ఈమధ్య సినిమాలు ఫ్లాప్ అవడానికి కారణమిదేనా?
-
PM Modi: ప్రధాని మోడీ, ప్రియాంకా గాంధీల మధ్య సరదా సంభాషణ..‘‘మీరు మారిపోయారు’’ అని ఖర్గే కౌంటర్..
-
Independence Day 2026: యుద్ధాలు.. జనాభా మార్పులు..! మన ముందు తరాలు చూడబోయే భారతావని ఎలా ఉండబోతోంది?
ట్రెండింగ్
-
Rahul Dravid Records: రాహుల్ ద్రవిడ్ ఈ 3 రికార్డులు ఎవరూ బ్రేక్ చేయలేరు.. సచిన్ వల్లనే సాధ్యం కాలేదు!
-
Homemade Anti-Aging Cream: ముఖంపై ముడతలు తగ్గి ‘గ్లో’ రావాలా..? ఇంకెందుకు ఆలస్యం ఈ హోంమేడ్ క్రీమ్ ట్రై చేయండి.!
-
AI పెట్టుబడుల వేళ Oracleలో ఉద్యోగాల కోతలు.. వేలాది ఉద్యోగాలపై వేటు?
-
N Chandrasekaran: టాటా గ్రూప్లో కీలక పరిణామం.. చైర్మన్ పదవికి ‘చంద్రశేఖరన్’ రాజీనామా?
-
Akhil NRD: “ప్రేమ పెళ్లి”.. కండక్టర్తో లేచిపోయిన ప్రముఖ యూట్యూబర్ భార్య..