Andhra Pradesh: అయ్యో ఎలుకా .. ఇంత పని చేశావా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఓ ఎలుక ఏకంగా ఒక ఊరిని కాల్చి వేసింది.. ఏంటి నిజమా అంటే నిజమే అని చెప్పాలి.. తాజాగా జరిగిన ఘటన వింటే ఎవ్వరికైనా మైండ్ బ్లాక్ అవుతుంది.. ఓ మహిళ పెట్టిన దీపాన్ని దొంగిలించిన ఎలుక ఊరినే కాల్చివేసింది..ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ లో వెలుగు చూసింది.. ఈ ఘటనలో ప్రాణ నష్టం జరగలేదు కానీ భారీగా ఆస్తి నష్టం జరిగిందని సమాచారం..
వివరాల్లోకి వెళితే.. విజయనగరం జిల్లాలో ఈ ఘటన జరిగింది..మెంటాడ మండలం కొండ లింగాల వలసలో అకస్మాత్తుగా అగ్నిప్రమాదం సంభవించింది. ఆ మంటల కారణంగా సుమారు ఎనిమిది ఇళ్లు అగ్నికి ఆహుతయ్యాయి..ఇంట్లో ఉన్న రెండు గ్యాస్ సిలెండర్స్ పెద్ద పెద్ద శబ్దాలతో పేలాయి. శబ్దాల ధాటికి గ్రామమంతా ఉలిక్కి పడింది. అసలే మండుతున్న ఎండలు దానికి తోడు గాలులు.. ఇక చెప్పేదేముంది నిమిషాల్లో మంటలు దావానంలా పాకాయి… మంటలను ఆర్పెందుకు ప్రయత్నించినా పెద్దగా ప్రయోజనం లేకపోయింది.. ఇక చేసేదేమిలేక అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు..
Also Read
- TTD: శ్రీవారి భక్తులకు అలర్ట్.. నేడు అక్టోబర్ దర్శనం టిక్కెట్ల విడుదల
- Andhra Pradesh: సర్కార్ కీలక నిర్ణయం.. భూ రికార్డుల శాశ్వత భద్రతకు బ్లాక్ చెయిన్..
- Uday Krishna Reddy: అనాథగా పెరిగి ఐపీఎస్ దాకా.. ముఖ్యమంత్రిచే ప్రశంసలు.. ఉదయ్ కృష్ణారెడ్డి బ్యాగ్రౌండ్ తెలిస్తే కన్నీళ్లు ఆగవు!
- CM Chandrababu: ఢిల్లీలో సీఎం చంద్రబాబు మార్క్ రాజకీయం.. భోగాపురం ఎయిర్పోర్ట్, విశాఖ మెట్రోపై స్పీడ్..
వెంటనే సిబ్బంది అక్కడకు చేరుకొని దాదాపు గంటపాటు శ్రమించి మంటలను ఆర్పేశారు..అయితే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగింది.. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. తరువాత గ్రామస్తులు అగ్నిప్రమాదం కి గల కారణాల పై ఆరా తీశారు.. అసలు విషయం తెలుసుకొని షాక్ అయ్యారు.. ఎలుక దీపం ను తీసుకొని వెళ్లడంతో అక్కడ ఉన్న పూరి గుడిసె దగ్ధం అయ్యింది.. మరో రెండు రోజుల్లో పండుగ ఉండటంతో ఊర్లో సందడి వాతావరణం నెలకొంది.. ఇక ఓ పూరింట్లో దేవుడికి పూజ చేసి దీపం వెలిగించి కొద్ది సేపటి తరువాత బయటకు వెళ్ళిపోయారు కుటుంబసభ్యులు. ఇంతలో ఓ ఎలుక ఇల్లంతా తిరిగి దీపం ను తీసుకెళ్లటానికి ప్రయత్నించింది. ఆ ప్రయత్నంలో నూనె తో ఉన్న దీపం ఇంటి పూరి కప్పుకు తగిలి ఒక్కసారిగా మంటలు ప్రారంభమయ్యాయి…
ఒకవైపు ఎండ మరోవైపు గాలి వేగంగా వీస్తుండటంతో మంటలు ఆటోమెటిక్ గా పెరిగాయి.. ఫైర్ ఇంజన్ వచ్చి మంటలను అదుపు చేసినప్పటికి భారీ నష్టం జరిగింది.. ఈ మంటలు ఇంకా కొన్ని ఇళ్లకి తాకి పెను ప్రమాదానికి దారి తీసింది. ఈ ప్రమాదంతో భాదితులు ఇళ్లు వాకిలి లేక కట్టుబట్టలతో రోడ్డున పడ్డారు. గ్రామంలో పండుగ వేడుకలు జరగాల్సిన సమయంలో ఎలుక పెట్టిన ఈ మంటలు మా ప్రాణాల పైకి తెచ్చింది అంటూ గుండెలు బాదుకుంటున్నారు.. ఈ ప్రమాదంలో దాదాపు రూ.5 లక్షలకు పైగా ఆస్తి నష్టం జరిగిందని అంచనా..కేసు నమోదు చేసుకున్న పోలీసులు మరిన్ని వివరాలను సేకరించే పనిలో ఉన్నారు..
తాజావార్తలు
-
Crude Oil Price Today: బ్యారెల్కు 100 డాలర్లకు చేరువలో ముడి చమురు.. భారత్లో పెట్రోల్, డీజిల్ ధరలపై ప్రభావం ఎంత?
-
Students Protest : ఢిల్లీలో విద్యార్థులపై పోలీసుల లాఠీఛార్జ్ ఘటనపై సల్మాన్ ఖాన్ ట్వీట్ వైరల్
-
CJP Protest: విద్యార్థుల మాటున అసాంఘిక శక్తులు.. CJP నిరసనలపై పోలీసుల సంచలన ప్రకటన..
-
Dharmendra Pradhan: కేంద్ర విద్యాశాఖ మంత్రిని తప్పించకపోవడానికి 5 బలమైన కారణాలివే..
-
Silver Cleaning Tips: వెండి పాత్రలు, ఆభరణాలు నల్లబడ్డాయా?.. ఇంట్లోనే మెరిపించే ఈజీ టెక్నిక్ ఇదే
ట్రెండింగ్
-
అల్ట్రా స్లిమ్ డిజైన్, 200MP కెమెరా, 5000mAh బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్ Samsung Galaxy Z Fold8 Ultra లాంచ్.!
-
Samsung కొత్త స్మార్ట్వాచ్లు వచ్చేశాయి.. AI హెల్త్ ట్రాకింగ్తో Samsung Galaxy Watch9, Ultra2 లాంచ్..!
-
IND vs ZIM 1st T20: నేడు జింబాబ్వేతో తొలి టీ20.. వైభవ్పై భారీ అంచనాలు.. ప్లేయింగ్ 11, లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Samsung Intelligent Eyewear లాంచ్.. మెసేజ్లు చదవడం నుంచి లైవ్ ట్రాన్స్లేషన్ వరకు ఎన్నో ఫీచర్లు.!
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి