నూతన సంవత్సర వేడుకలకు అంతా సిద్ధమవుతున్న సమయంలో.. మంద్య షాపులు, బార్లకు కాస్త వెలసుబాటు కల్పిస్తూ.. మందు బాబులకు గుడ్న్యూస్ చెప్పింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. మద్యం విక్రయాల సమయం గంట సేపు పొడిగించింది.. రాష్ట్రంలోని బార్లు, రీటైల్ మద్యం దుకాణాలు, ఇన్ హౌస్సులో మద్యం విక్రయాల సమయంలో వెసులుబాటు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది… డిసెంబర్ 31 అర్ధరాత్రిలో మద్యం విక్రయాలకు అనుమతి ఇస్తూ ఆదేశాలు ఇచ్చింది.. ఈవెంట్స్ తో పాటు పర్యాటక లైసెన్సులు కలిగిన హోటళ్లల్లో విక్రయానికి అనుమతి ఇస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొంది.
Read Also: వస్త్రాలపై జీఎస్టీ పెంపు నిర్ణయం వాయిదా..
సాధారణంగా రోజువారీగా రాత్రి 9 గంటల వరకు మద్యం దుకాణాలు, రాత్రి 11 గంటల వరకు బార్లల్లో మద్యం విక్రయాలు సాగుతుంటాయి.. కానీ, ప్రభుత్వం కల్పించిన తాజా వెసులుబాటు ప్రకారం.. మద్యం దుకాణాల్లో రాత్రి 10 గంటల వరకు, బార్లలో రాత్రి 12 గంటల వరకు మద్యం విక్రయాలకు అవకాశం లభించింది.