Smart Meters: మోటార్లకు మీటర్లు.. ఇళ్లల్లో స్మార్ట్ మీటర్లు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వ్యవసాయ మోటార్లకు మీటర్ల విషయంలో కొన్ని రాష్ట్రాలు అభ్యంతరం వ్యక్తం చేస్తుండగా.. మరికొన్ని రాష్ట్రాలు బిగించేపనిలో ఉన్నాయి.. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగించాలని నిర్ణయాన్ని సక్సెస్ఫుల్గా అమలు చేస్తున్న ఇంధన శాఖ.. ఇప్పుడు తాజాగా మరో అడుగు ముందుకేసింది. ఇళ్లల్లోని కరెంట్ కనెక్షన్లకు స్మార్ట్ మీటర్లు బిగించాలని నిర్ణయం తీసుకుంది. గృహ వినియోగ కనెక్షన్లకే కాకుండా.. పరిశ్రమలు, వాణిజ్య, ప్రభుత్వానికి సంబంధించి ఉన్న విద్యుత్ కనెక్షన్లకు స్మార్ట్ మీటర్లు బిగించాలని డిసైడ్ అయింది. ఈ స్మార్ట్ మీటర్ల బిగింపు చర్యలను ఒకే విడతలో కాకుండా.. రెండు విడతల్లో దీన్ని పూర్తి చేసేలా సర్కార్ చర్యలు చేపడుతోంది.
Read Also:Bharat Jodo Yatra: తెలంగాణలో రాహుల్ పాదయాత్రలో స్వల్ప మార్పులు.. ఫైనల్ రూట్ ఇదే..
Also Read
- YS Jagan: ప్రజా సమస్యల నుంచి దృష్టి మళ్లించేందుకే అరెస్టులు: వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు
- AP Govt: ఆంధ్రప్రదేశ్ రైతులకు భారీ శుభవార్త.. రూ. 50 వేల వరకు వడ్డీ లేని రుణం..
- Instagram Reel: ఇంద్రకీలాద్రిపై ఇన్స్టాగ్రామ్ రీల్ వివాదం.. పోలీసులకు దేవస్థానం ఫిర్యాదు..
- Tirumala Laddu: 311 ఏళ్లు పూర్తి చేసుకున్న తిరుమల శ్రీవారి లడ్డూ..!
అయితే గృహ వినియోగానికి సంబంధించినంత వరకు అన్ని కనెక్షన్లకు కాకుండా.. 200 యూనిట్ల విద్యుత్ వినియోగం దాటే మీటర్లకు మాత్రమే స్మార్ట్ మీటర్లను బిగించాలని నిర్ణయించుకుంది జగన్ సర్కార్. ఈ క్రమంలో మొత్తంగా ఉన్న 18.73 లక్షల విద్యుత్ కనెక్షన్లకు స్మార్ట్ మీటర్లు బిగించుకునేందుకు ఆర్డీఎస్ఎస్ స్కీమ్ కింద అనుమతి లభించింది. వీటిని రెండు విడతల్లో స్మార్ట్ మీటర్లు బిగించుకునేందుకు ప్రణాళికలు సిద్దం చేసుకుంటున్న పరిస్థితి కన్పిస్తోంది. తొలి విడతలో 4.70 లక్షల మీటర్లకు.. రెండో విడతలో సుమారుగా 14 లక్షలకు పైగా స్మార్ట్ మీటర్లను బిగించనుంది ఇంధన శాఖ. ఇక, పరిశ్రమలు.. వాణిజ్య, ప్రభుత్వ కార్యాలయాల్లోని విద్యుత్ కనెక్షన్లకు స్మార్ట్ మీటర్లు బిగించనుంది. వాణిజ్యపరమైన విద్యుత్ కనెక్షన్ల విషయానికొస్తే.. మొత్తంగా 15.48 లక్షలు కనెక్షన్లుంటే.. వాటిల్లో తొలి విడతలోనే ఏకంగా 15.47 లక్షల స్మార్ట్ మీటర్లను బిగించి..
ఇక, రెండో విడతలో కేవలం 1200 మీటర్లను బిగించనున్నారు. అలాగే పరిశ్రమలు, ప్రభుత్వ కార్యాలయాలకు చెందిన విద్యుత్ కనెక్షన్లకు తొలి విడతలోనే స్మార్ట్ మీటర్ల బిగింపు ప్రక్రియను పూర్తి కానిచ్చేనున్నాయి డిస్కంలు. పరిశ్రమలకు సంబంధించి 1.19 లక్షల కనెక్షన్లు.. ప్రభుత్వ కార్యాలయాలకు 3.22 లక్షల కనెక్షన్లను ఒకేసారి బిగించనున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రతిపాదనలను డిస్కంలు ఏపీఈఆర్సీకి పంపాయి. ఈ నెలాఖరులోగా జుడిషీయల్ ప్రివ్యూ నుంచి క్లారిటీ రాగానే.. టెండర్ల ఖరారుకు సంబంధించి స్పష్టత రానుంది. బహుశా ఈ నెలాఖరు లేదా.. వచ్చే నెల నుంచి స్మార్ట్ మీటర్ల బిగింపు ప్రక్రియ ప్రారంభమయ్యే సూచనలు కన్పిస్తున్నాయి.
తాజావార్తలు
-
SS Rajamouli : బాహుబలి కాదట.. తనని బిగ్ లీగ్ లో చేర్చిన సినిమా ఎదో చెప్పిన రాజమౌళి
-
Naga Vamsi : నాగవంశీని చింటూ అని ఎందుకు పిలుస్తారో తెలుసా?
-
Tata దూకుడు మాములుగా లేదుగా.. Nexon నుంచి ప్రీమియం Avinya X వరకు భారీ ప్లాన్..!
-
Revolt RVX Electric Bike: స్మార్ట్ కీ, రివర్స్ మోడ్.. రివోల్ట్ RVX ఎలక్ట్రిక్ బైక్లో ఉన్న ఫీచర్లు ఇవే!
-
India Medal Tally: కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత్ చరిత్ర.. 39 పతకాలతో ఘన ముగింపు.. మెడల్స్ ఫుల్ లిస్ట్ ఇదే!
ట్రెండింగ్
-
8100mAh భారీ బ్యాటరీ, 108MP కెమెరా వంటి క్రేజీ ఫీచర్లతో Honor X7e Plus (4G) లాంచ్..!
-
Vegetable Cleaning : కూరగాయలను ఉప్పు నీటితో కడుగుతున్నారా.? ఈ విషయాలు తప్పక తెలుసుకోండి.!
-
Car Maintenance: కారులో ఎలుకల బెడదా? ఈ 5 చిట్కాలతో వేల రూపాయల నష్టాన్ని తప్పించుకోండి.!
-
Door Mat Cleaning : డోర్మ్యాట్ ఇలా వాష్ చేస్తే చాలు.. దుమ్ము, దుర్వాసన, క్రిములు మాయం.!
-
Oil-Free Poori: చుక్క నూనె లేకుండా పూరీలు.. చేసేయండి ఇలా..!