Smart Meters: మోటార్లకు మీటర్లు.. ఇళ్లల్లో స్మార్ట్ మీటర్లు..!
వ్యవసాయ మోటార్లకు మీటర్ల విషయంలో కొన్ని రాష్ట్రాలు అభ్యంతరం వ్యక్తం చేస్తుండగా.. మరికొన్ని రాష్ట్రాలు బిగించేపనిలో ఉన్నాయి.. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగించాలని నిర్ణయాన్ని సక్సెస్ఫుల్గా అమలు చేస్తున్న ఇంధన శాఖ.. ఇప్పుడు తాజాగా మరో అడుగు ముందుకేసింది. ఇళ్లల్లోని కరెంట్ కనెక్షన్లకు స్మార్ట్ మీటర్లు బిగించాలని నిర్ణయం తీసుకుంది. గృహ వినియోగ కనెక్షన్లకే కాకుండా.. పరిశ్రమలు, వాణిజ్య, ప్రభుత్వానికి సంబంధించి ఉన్న విద్యుత్ కనెక్షన్లకు స్మార్ట్ మీటర్లు బిగించాలని డిసైడ్ అయింది. ఈ స్మార్ట్ మీటర్ల బిగింపు చర్యలను ఒకే విడతలో కాకుండా.. రెండు విడతల్లో దీన్ని పూర్తి చేసేలా సర్కార్ చర్యలు చేపడుతోంది.
Read Also:Bharat Jodo Yatra: తెలంగాణలో రాహుల్ పాదయాత్రలో స్వల్ప మార్పులు.. ఫైనల్ రూట్ ఇదే..
Also Read
- Student Suicide: నిండు ప్రాణాన్ని బలితీసుకున్న నిరుద్యోగం.. కలల కొలువు దక్కకపోవడంతో బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య
- CM Chandrababu: స్టేజ్పైనే అధికారులకు సీఎం చంద్రబాబు క్లాస్.. పనితీరుపై సీరియస్ వార్నింగ్..
- Ambati Rambabu: అమరావతి నా జన్మలోనే కాదు.. చంద్రబాబు, లోకేష్ జన్మలో కూడా పూర్తి కాదు..!
- CM Chandrababu: ఏపీ ప్రజలకు NDA వల్ల మరోసారి స్వాతంత్య్రం.. చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
అయితే గృహ వినియోగానికి సంబంధించినంత వరకు అన్ని కనెక్షన్లకు కాకుండా.. 200 యూనిట్ల విద్యుత్ వినియోగం దాటే మీటర్లకు మాత్రమే స్మార్ట్ మీటర్లను బిగించాలని నిర్ణయించుకుంది జగన్ సర్కార్. ఈ క్రమంలో మొత్తంగా ఉన్న 18.73 లక్షల విద్యుత్ కనెక్షన్లకు స్మార్ట్ మీటర్లు బిగించుకునేందుకు ఆర్డీఎస్ఎస్ స్కీమ్ కింద అనుమతి లభించింది. వీటిని రెండు విడతల్లో స్మార్ట్ మీటర్లు బిగించుకునేందుకు ప్రణాళికలు సిద్దం చేసుకుంటున్న పరిస్థితి కన్పిస్తోంది. తొలి విడతలో 4.70 లక్షల మీటర్లకు.. రెండో విడతలో సుమారుగా 14 లక్షలకు పైగా స్మార్ట్ మీటర్లను బిగించనుంది ఇంధన శాఖ. ఇక, పరిశ్రమలు.. వాణిజ్య, ప్రభుత్వ కార్యాలయాల్లోని విద్యుత్ కనెక్షన్లకు స్మార్ట్ మీటర్లు బిగించనుంది. వాణిజ్యపరమైన విద్యుత్ కనెక్షన్ల విషయానికొస్తే.. మొత్తంగా 15.48 లక్షలు కనెక్షన్లుంటే.. వాటిల్లో తొలి విడతలోనే ఏకంగా 15.47 లక్షల స్మార్ట్ మీటర్లను బిగించి..
ఇక, రెండో విడతలో కేవలం 1200 మీటర్లను బిగించనున్నారు. అలాగే పరిశ్రమలు, ప్రభుత్వ కార్యాలయాలకు చెందిన విద్యుత్ కనెక్షన్లకు తొలి విడతలోనే స్మార్ట్ మీటర్ల బిగింపు ప్రక్రియను పూర్తి కానిచ్చేనున్నాయి డిస్కంలు. పరిశ్రమలకు సంబంధించి 1.19 లక్షల కనెక్షన్లు.. ప్రభుత్వ కార్యాలయాలకు 3.22 లక్షల కనెక్షన్లను ఒకేసారి బిగించనున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రతిపాదనలను డిస్కంలు ఏపీఈఆర్సీకి పంపాయి. ఈ నెలాఖరులోగా జుడిషీయల్ ప్రివ్యూ నుంచి క్లారిటీ రాగానే.. టెండర్ల ఖరారుకు సంబంధించి స్పష్టత రానుంది. బహుశా ఈ నెలాఖరు లేదా.. వచ్చే నెల నుంచి స్మార్ట్ మీటర్ల బిగింపు ప్రక్రియ ప్రారంభమయ్యే సూచనలు కన్పిస్తున్నాయి.
తాజావార్తలు
-
Buchi Babu: ‘పెద్ది’ని గుండెల్లోంచి తీసేయడం ఎవరికీ సాధ్యం కాదు.. బుచ్చిబాబు
-
Cylinder Vs Hotels: ‘సిలిండర్ రేట్లు పెరిగాయ్.. అందుకే ధరలు పెంచాం’.. కస్టమర్లకు చుక్కలు చూపిస్తున్న హోటల్స్..
-
Petrol-Diesel prices: పెట్రోల్-డీజిల్పై రూ. 4-5, LPGపై రూ. 40-50 పెరిగే ఛాన్స్..?
-
Sukumar: శిష్యుడిని మెచ్చుకున్న గురువు.. ‘పెద్ది’ లాంటి కమర్షియల్ ఎమోషనల్ రైడ్ ఈ మధ్య రాలేదు: సుకుమార్
-
Bengal Repolling: పశ్చిమ బెంగాల్లో రీపోలింగ్.. 15 కేంద్రాల్లో మళ్లీ ఓటింగ్..
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!