Smart Meters: మోటార్లకు మీటర్లు.. ఇళ్లల్లో స్మార్ట్ మీటర్లు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వ్యవసాయ మోటార్లకు మీటర్ల విషయంలో కొన్ని రాష్ట్రాలు అభ్యంతరం వ్యక్తం చేస్తుండగా.. మరికొన్ని రాష్ట్రాలు బిగించేపనిలో ఉన్నాయి.. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగించాలని నిర్ణయాన్ని సక్సెస్ఫుల్గా అమలు చేస్తున్న ఇంధన శాఖ.. ఇప్పుడు తాజాగా మరో అడుగు ముందుకేసింది. ఇళ్లల్లోని కరెంట్ కనెక్షన్లకు స్మార్ట్ మీటర్లు బిగించాలని నిర్ణయం తీసుకుంది. గృహ వినియోగ కనెక్షన్లకే కాకుండా.. పరిశ్రమలు, వాణిజ్య, ప్రభుత్వానికి సంబంధించి ఉన్న విద్యుత్ కనెక్షన్లకు స్మార్ట్ మీటర్లు బిగించాలని డిసైడ్ అయింది. ఈ స్మార్ట్ మీటర్ల బిగింపు చర్యలను ఒకే విడతలో కాకుండా.. రెండు విడతల్లో దీన్ని పూర్తి చేసేలా సర్కార్ చర్యలు చేపడుతోంది.
Read Also:Bharat Jodo Yatra: తెలంగాణలో రాహుల్ పాదయాత్రలో స్వల్ప మార్పులు.. ఫైనల్ రూట్ ఇదే..
Also Read
- Minister Nimmala Ramanaidu: జగన్ పాలనపై మంత్రి నిమ్మల రామానాయుడు తీవ్ర విమర్శలు.. మేనమామనని చెప్పి మోసం చేశారు..!
- Gudivada Amarnath: హోంమంత్రి గారు ఆ రోజు మహిళా లోకం గుర్తుకు రాలేదా?.. ఎక్కడైనా ఫిర్యాదు చేసుకోండి!
- AP Weather Today: ఏపీకి వాతావరణ హెచ్చరిక.. ఆ రెండు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ!
- Pawan Kalyan: అభిమాని కష్టంలో ఉన్నాడని తెలిసి ఇంటికే వెళ్లిన పవన్ కళ్యాణ్.. కుటుంబానికి భరోసా!
అయితే గృహ వినియోగానికి సంబంధించినంత వరకు అన్ని కనెక్షన్లకు కాకుండా.. 200 యూనిట్ల విద్యుత్ వినియోగం దాటే మీటర్లకు మాత్రమే స్మార్ట్ మీటర్లను బిగించాలని నిర్ణయించుకుంది జగన్ సర్కార్. ఈ క్రమంలో మొత్తంగా ఉన్న 18.73 లక్షల విద్యుత్ కనెక్షన్లకు స్మార్ట్ మీటర్లు బిగించుకునేందుకు ఆర్డీఎస్ఎస్ స్కీమ్ కింద అనుమతి లభించింది. వీటిని రెండు విడతల్లో స్మార్ట్ మీటర్లు బిగించుకునేందుకు ప్రణాళికలు సిద్దం చేసుకుంటున్న పరిస్థితి కన్పిస్తోంది. తొలి విడతలో 4.70 లక్షల మీటర్లకు.. రెండో విడతలో సుమారుగా 14 లక్షలకు పైగా స్మార్ట్ మీటర్లను బిగించనుంది ఇంధన శాఖ. ఇక, పరిశ్రమలు.. వాణిజ్య, ప్రభుత్వ కార్యాలయాల్లోని విద్యుత్ కనెక్షన్లకు స్మార్ట్ మీటర్లు బిగించనుంది. వాణిజ్యపరమైన విద్యుత్ కనెక్షన్ల విషయానికొస్తే.. మొత్తంగా 15.48 లక్షలు కనెక్షన్లుంటే.. వాటిల్లో తొలి విడతలోనే ఏకంగా 15.47 లక్షల స్మార్ట్ మీటర్లను బిగించి..
ఇక, రెండో విడతలో కేవలం 1200 మీటర్లను బిగించనున్నారు. అలాగే పరిశ్రమలు, ప్రభుత్వ కార్యాలయాలకు చెందిన విద్యుత్ కనెక్షన్లకు తొలి విడతలోనే స్మార్ట్ మీటర్ల బిగింపు ప్రక్రియను పూర్తి కానిచ్చేనున్నాయి డిస్కంలు. పరిశ్రమలకు సంబంధించి 1.19 లక్షల కనెక్షన్లు.. ప్రభుత్వ కార్యాలయాలకు 3.22 లక్షల కనెక్షన్లను ఒకేసారి బిగించనున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రతిపాదనలను డిస్కంలు ఏపీఈఆర్సీకి పంపాయి. ఈ నెలాఖరులోగా జుడిషీయల్ ప్రివ్యూ నుంచి క్లారిటీ రాగానే.. టెండర్ల ఖరారుకు సంబంధించి స్పష్టత రానుంది. బహుశా ఈ నెలాఖరు లేదా.. వచ్చే నెల నుంచి స్మార్ట్ మీటర్ల బిగింపు ప్రక్రియ ప్రారంభమయ్యే సూచనలు కన్పిస్తున్నాయి.
తాజావార్తలు
-
Sharwanand : మళ్ళీ సంక్రాంతిపై కన్నేసిన శర్వా
-
Melodi: ‘‘ఇన్స్టాలో మనమే ఫేమస్ కపుల్’’.. జీ7లో స్పెషల్ అట్రాక్షన్గా మోడీ-మెలోనీ
-
“Aadarsha Kutumbam” కి రీషూట్లు! జాగ్రత్తపడ్డ త్రివిక్రమ్
-
Twisha Sharma: ఇంకా బయటకు రాని ట్విషా శర్మ రెండో పోస్ట్మార్టం రిపోర్ట్.. కారణమిదేనా?
-
Vijay Deverakonda: దేవరకొండకు క్రికెట్ అసోసియేషన్ షాక్!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Controversy: వైభవ్ అవుట్పై వివాదం.. థర్డ్ అంపైర్ నిర్ణయంపై అఫ్గాన్ ప్లేయర్స్ అసంతృప్తి!
-
Ragi Bun Dosa: ఆరోగ్యం, రుచి రెండూ ఒకేచోట.. స్పాంజీ లాంటి ‘రాగి బన్ దోస’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Wedding Expenses: పెళ్లి ముహూర్తాలకు వేళాయే.. తక్కువ టైమ్ ఉండటంతో తెలుగు ఇళ్లల్లో బడ్జెట్ టెన్షన్!!
-
Ayodhya Ram Mandir: రాముడికి ప్రసాదంగా ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మామిడి పండ్లు.!
-
Historical Day: నేడు ట్రిపుల్ ధమాకా.. టీమిండియా ఫ్యాన్స్కు పండగే.. 12 గంటల పాటు నాన్స్టాప్ ఎంటర్టైన్మెంట్!