Site icon NTV Telugu

JC Prabhakar Reddy: తాడిపత్రిలో జన్మించిన ప్రతి ఒక్కరూ పుణ్యాత్ములు.. జేసీ ఆసక్తికర వ్యాఖ్యలు

Jc

Jc

JC Prabhakar Reddy: తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నేత, తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి.. ఎప్పుడూ వార్తల్లో ఉంటారు.. తాజాగా కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు జేసీ.. తాడిపత్రిలో జన్మించిన ప్రతి ఒక్కరూ పుణ్యాత్ములు అని పేర్కొన్నారు జేసీ.. “తాడిపత్రిలో తినడానికి మూడు పూటలా అన్నం దొరుకుతుంది. ఈ భూమి ఎంతో శక్తివంతమైనది. చరిత్రలో శ్రీ కృష్ణదేవరాయలు తాడిపత్రిలో ఆలయాలు నిర్మించడానికి ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నారు..” అని వెల్లడించారు..

Read Also: Pratyusha Death Case: “నా బిడ్డ శరీరాన్ని వాళ్ల ఇష్టం వచ్చినట్లు వాడుకున్నారు”.. ప్రత్యూష తల్లి సరోజిని

ఇక, తాడిపత్రి భూమి మీద ఉన్న శక్తిని చాటుతూ, “ఇక్కడ సూర్యశక్తి (సోలార్) ప్రాజెక్ట్‌ను రెండు నెలల్లో పూర్తిచేస్తాము. ఈ ప్రాజెక్ట్ ద్వారా మున్సిపాలిటీకి నెలకు 20 లక్షల ఆదాయం వస్తుంది,” అని జేసీ ప్రభాకర్ రెడ్డి వివరించారు. మరోవైపు.. నా శత్రువు కూడా నా గురించి ఆలోచించి మాట్లాడే విధంగా చేసుకోవడం నా కోరిక.. ఎక్కడైనా, తాడిపత్రిలో బ్రతకలేని వ్యక్తి దేశంలో ఎక్కడ బ్రతకలేడు, అని ఆయన తమ పట్టణం గురించి గొప్పగా చెప్పుకొచ్చారు.. జేసీ ప్రభాకర్ రెడ్డి, తాడిపత్రి చరిత్ర, ప్రస్తుత పరిస్థితులు మరియు భవిష్యత్తు అభివృద్ధిపై గౌరవంతో మాట్లాడారు. ఆయన మున్సిపాలిటీకి సౌరశక్తి ఆధారిత ప్రాజెక్టు ద్వారా ఆదాయాన్ని పెంచడంపై దృష్టి సారించామని తెలిపారు..

Exit mobile version