JC Prabhakar Reddy: ఇదే లాస్ట్ దీపావళి అంటే మేం చూస్తూ ఊరుకోవాలా..? మేం మొదలు పెడితే తట్టుకోలేరు.. జేసీ వార్నింగ్..
- వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలకు జేసీ ప్రభాకర్ రెడ్డి సీరియస్ వార్నింగ్..
- కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి.. ఇదే మీకు లాస్ట్ దీపావళి అంటున్నాడు..
- ఇదే లాస్ట్ దీపావళి అంటే మేము చూస్తూ ఊరుకోవాలా..?..
- మేము మొదలు పెడితే మీరు తట్టుకోలేరు.. అంటూ వార్నింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
JC Prabhakar Reddy: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి.. చంద్రబాబు నాయుడు మంచి వ్యక్తి.. ఆయన అడ్డుపడుతున్నాడు కాబట్టి.. మీరు ఇలా ఉన్నారంటూ హెచ్చరించారు.. వైసీపీ నేత, ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి.. ఇదే మీకు లాస్ట్ దీపావళి అంటున్నాడు.. అంటే.. ఇదే లాస్ట్ దీపావళి అంటే మేము చూస్తూ ఊరుకోవాలా..? మేము మొదలు పెడితే మీరు తట్టుకోలేరు.. అంటూ వార్నింగ్ ఇచ్చారు.. మాట్లాడేటప్పుడు ఒక సారి ఆలోచించి మాట్లాడండి అని హితవు చెప్పారు.. నీకు భవిష్యత్తు చాలా వుంది దానిని నాశనం చేసుకోకు అని సూచించారు.. ముఖ్యమంత్రి నారా చంద్ర బాబు నాయుడు మంచి వాడు కాబట్టే.. మీరు ఇలా మాట్లాడుతున్నారు అని వ్యాఖ్యానించారు జేసీ.
Read Also: Tamil Nadu Rain: తమిళనాడును ముంచెత్తిన భారీ వర్షాలు.. విమాన రాకపోకలకు అంతరాయం
Also Read
- Thopudurthi Prakash Reddy Vs MLA MS Raju: తోపుదుర్తి–ఎంఎస్ రాజు వివాదంలో బిగ్ ట్విస్ట్.. అద్దె ఇంటి కొనుగోలుతో సంచలనం..
- Minister Satyakumar: అమరావతిపై జగన్కు మంత్రి సత్యకుమార్ సవాల్.. ఎన్నికలకు వెళ్దామా..?
- Topudurthi Prakash Reddy: టిప్పర్తో ఢీకొట్టి నన్ను హత్య చేయాలని కుట్ర.. తోపుదుర్తి సంచలన ఆరోపణలు
- Thopudurthi Prakash Reddy: సోదరుడి అరెస్ట్పై తోపుదుర్తి ఫైర్.. మా అన్న అరెస్ట్ అక్రమం
తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇక ఎప్పటికీ ఎమ్మెల్యే కాలేడు అని జోస్యం చెప్పారు జేసీ ప్రభాకర్ రెడ్డి.. నేను మూడేళ్లే ఉంటానని పెద్దారెడ్డి చెబుతున్నాడు.. దేవుని ఆశిస్సులు ఉంటే పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పలేమన్న ఆయన.. అయితే, కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి చిన్నవాడు.. ప్రజల్లో ఉండే వ్యక్తి కాబట్టి.. మళ్లీ అవకాశం ఉండొచ్చు.. కానీ, పెద్దారెడ్డి మాత్రం ఎప్పటికీ ఎమ్మెల్యే కాలేడని పేర్కొన్నారు.. మరోవైపు, అసలు మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేస్తే ఏమైంది..? దానిపై గగ్గోలు పెట్టాల్సిన అవసరం ఏముంది? అని ప్రశ్నించారు.. సెంట్రల్ రైలు సర్వీసులు ప్రైవేటీకరణ చేయలేదా..? ప్రభుత్వం ఎన్నో సంస్థలను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించలేదా? అని ప్రశ్నించారు.. అసలు, వైసీపీ నాయకులు మాట్లాడుతుంటే టీడీపీ నాయకులు ఏమి చేస్తున్నారు..? అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు జేసీ.. చివరకు నేను కూడా తాడిపత్రి మున్సిపాలిటీలో ప్రైవేట్ వ్యక్తులతో పనులు చేయించుకుంటున్నానని తెలిపారు జేసీ ప్రభాకర్ రెడ్డి..
తాజావార్తలు
-
Jantar Mantar: కాక్రోచ్ వేదికపై కానిస్టేబుల్ రాజీనామా.. అసలు నిజం తెలిసి అంతా షాక్..
-
Chips Packet Empty: చిప్స్ ప్యాకెట్ సగం ఖాళీగా ఎందుకు ఉంటుంది..? 99 శాతం మందికి తెలియని నిజం ఇదే..
-
England Team: ఇంగ్లాండ్ జట్టు తదుపరి కెప్టెన్ ఎవరు..? కెప్టెన్సీ రేసులో సీనియర్ బ్యాటర్..
-
PM Modi: ఇన్స్టాగ్రామ్ వాడండి, యూత్కు దగ్గరకండి.. మంత్రులకు మోడీ క్లాస్..
-
Bhatti Vikramarka : సింగరేణి బ్లాకులు ప్రైవేట్ పరమైతే తీవ్ర ప్రమాదం
ట్రెండింగ్
-
Rainy Season Kitchen Tips : వర్షాల్లో బియ్యానికి పురుగులా? ఇలా చేస్తే సమస్యే లేదు.!
-
కేవలం రూ. 8,999 లకే120Hz డిస్ప్లే, 6000mAh బ్యాటరీతో Lava Virat V1 5G, Virat V1 స్మార్ట్ఫోన్లు లాంచ్..!
-
రూ. 19,499లకే 50MP సోనీ కెమెరా, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో iQOO Z11 Lite 5G లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: సక్సెస్ను తలకెక్కించుకోను.. బుద్దిగా ఉంటా.. వైభవ్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Kakarakaya Ulli Karam: చేదు లేకుండా కమ్మటి ‘కాకరకాయ ఉల్లి కారం’.. ఇలా చేస్తే పిల్లలు కూడా వదలకుండా తింటారు!