NTV Telugu Site icon

JC Prabhakar Reddy: గంజాయి అమ్మితే గ్రామ బహిష్కరణ.. జేసీ వార్నింగ్‌..

Jc Prabhakar Reddy

Jc Prabhakar Reddy

JC Prabhakar Reddy: గంజాయి అమ్మేవారికి సీరియస్‌ వార్నింగ్‌ ఇచ్చారు జేసీ ప్రభాకర్‌ రెడ్డి… గంజాయి అమ్మేవారిపై పోలీసుల సహకారంతో పీడీ యాక్ట్‌ నమోదు చేసి గ్రామ బహిష్కరణ చేస్తామని హెచ్చరించారు.. గంజాయి వాడకంపై పెరిగిపోవడంతో.. దానిని అరికట్టే విధంగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది.. ఇప్పటికే చాలా మంది ప్రముఖులు గంజాయిపై వీడియోలు విడుదల చేస్తున్నారు.. ఇప్పుడు గంజాయిపై ఓ వీడియో రిలీజ్ చేశారు తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేపీ ప్రభాకర్ రెడ్డి.. తాడిపత్రిలో గంజాయి వాడకం ఎక్కువైందని ఆవేదన వ్యక్తం చేసిన ఆయన.. పార్టీలకు అతీతంగా ఈ పరిణామాలను ఖండించాలని పిలుపునిచ్చారు.. గంజాయి వాడకం వల్ల తాడిపత్రి చెడిపోపోతందన్నారు.. గతంలో పంజాబ్ దేశంలో నెంబర్ వన్ గా ఉండేది. రాజకీయ నాయకులు గంజాయిని కూకటివేళ్లతో తొలగిస్తామని చెప్పినా.. కిందిస్థాయిలో కష్టంగా ఉందన్నారు.. గంజాయి వల్ల ఆరోగ్యం చెడిపోతుంది. తాడిపత్రి ప్రజలందరూ కలిసి గంజాయిని అరికట్టాలని పిలుపునిచ్చారు.. ఇక, గంజాయి అమ్మేవారిపై కఠిన చర్యలు తీసుకుంటాం.. పోలీసుల సహకారంతో పీడీ యాక్ట్‌ నమోదు చేసి గ్రామ బహిష్కరణ చేస్తామని హెచ్చరించారు తెలుగుదేశం పార్టీ నేత, తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేపీ ప్రభాకర్ రెడ్డి.

Read Also: Samsung Galaxy M15 5G Price: 10 వేలకే శాంసంగ్‌ 5జీ ఫోన్.. సూపర్ కెమెరా, బిగ్‌ బ్యాటరీ!