రేపటి నుండి ఆనందయ్య మందు పంపిణీ జరగనుంది. రెండు వేలమందికి తొలిరోజు మందు పంపిణీ చేసే అవకాశం ఉంది. మొదటిగా సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలకు మాత్రమే మందు పంపిణీ జరగనుంది. ఇతర ప్రాంతాల వారు ఎవరు రావద్దు అని పేర్కొన్నారు. ఇక కృష్ణపట్నంలో ప్రస్తుతం 144 సెక్షన్ కొనసాగుతుంది. ఆధార్ కార్డు పరిశీలించి తరువాత గ్రామంలోకి అనుమతిస్తున్న పోలీసులు… గ్రామంలోకి ఇతరులను అనుమతించడం లేదు. అయితే ఆనందయ్య మందు పంపిణీ పై వివాదాలు కొనసాగుతున్నాయి. నకిలీ వెబ్ సైట్ ద్వారా కోట్ల దోచుకోవాలని కాకాని చూస్తున్నాడన్న మాజి మంత్రి సోమిరెడ్డి అన్నారు. ఈ విషయం పై పై నేడు సైబర్ క్రైం ఫిర్యాదు చేయనున్నారు సోమిరెడ్డి.