NTV Telugu Site icon

Anakapalli: 9వ తరగతి విద్యార్థినిపై ఓ సైకో కత్తితో దాడి చేసి హత్య..

Anakapalli

Anakapalli

Anakapalli: అనకాపల్లి జిల్లాలోని రాంబిల్లి మండలం పరిధిలోనీ కొప్పు గొండు పాలెంలో దారుణం చోటు చేసుకుంది. తొమ్మిదవ తరగతి చదువుతున్న విద్యార్థినిపై ఓ సైకో కత్తితో దాడి చేసి హత్య చేశాడు. అయితే, కొప్పుగొండు గ్రామంలో జులాయిగా తిరుగుతూ.. బాలికను ప్రేమ పేరుతో వేధించడంతో విషయం సదరు బాలిక తల్లిదండ్రులకు చెప్పింది.. దీంతో విద్యార్థి తల్లిదండ్రులు పోలీసులకు కంప్లైంట్ చేయడంతో.. ఆ సైకో సురేష్ పై ఫోక్సో కేసు పెట్టిన పోలీసులు జైలుకు పంపారు. 20 రోజుల క్రితం బెయిల్ పై బయటకు వచ్చిన సురేష్.. జైలుకు పంపించారని కక్ష మనస్సులో పెట్టుకుని ఈ ఘాతుకానికి సురేష్ పాల్పడ్డారు. నిన్న సాయంత్రం స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన మైనర్ బాలిక.. అప్పటికే రెక్కీ నిర్వహించి ఇంట్లోకి చొరబడిన సురేష్.. తన వెంట తెచ్చుకున్న కత్తితో ఆ తొమ్మిదవ తరగతి విద్యార్థి పీక కోసి పరార్ అయ్యాడు.

Read Also: Happy Birthday MS Dhoni: కెప్టెన్‌లలో ‘ఎంఎస్ ధోనీ’ వేరే లెవెల్.. టాప్ రికార్డ్స్ ఇవే!

ఇక, సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, క్లూస్ టీం.. నిందితుడు సురేష్ కోసం పోలీసు ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టారు. బాలిక మృతదేహాన్ని అనకాపల్లి ఎన్టీఆర్ హాస్పిటల్ కు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి.. విచారణ చేస్తున్నారు. అయితే, ఈ దారుణ ఘటనపై ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత స్పందించారు. అనకాపల్లి జిల్లా ఎస్పీతో ఫోన్ లో మాట్లాడిన హోంమంత్రి అనిత.. వెంటనే నిందితుడిని పట్టుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.