Antarvedi: నేడు అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దివ్య కళ్యాణం
- నేడు రాత్రి అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దివ్య కళ్యాణం..
- లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణానికి 4 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా..
- గోదావరి జిల్లాల నుంచి అంతర్వేదికి 105 ప్రత్యేక బస్సులు..
- దివ్య కళ్యాణం అనంతరం భక్తులకు అక్షింతలు పంపిణీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Antarvedi: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఈరోజు (ఫిబ్రవరి 7) అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహస్వామి దివ్య కళ్యాణం జరగనుంది. నేటి రాత్రి 10:30 గంటలకు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి కళ్యాణం జరగనుంది. అంగరంగ వైభవంగా కళ్యాణం నిర్వహించడానికి అంతర్వేది ఆలయాన్ని ముస్తాబు చేశారు. స్వామి అమ్మవార్లను వధూవరులుగా అలంకరించి భక్తులకు దర్శనమిస్తున్నారు. ఈ కళ్యాణం తిలకించడానికి ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి నాలుగు లక్షల మందికి పైగా భక్తులు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు.
Read Also: Vivekanandan Viral: ‘వివేకానందన్ వైరల్’ అంటూ వస్తున్న దసరా విలన్ . . ఆహా ఓటీటీలోకి కొత్త సినిమా !
Also Read
- Bolishetti Srinivas: ఎమ్మెల్యే బొలిశెట్టి ఆసక్తికర వ్యాఖ్యలు.. పవన్ వల్లే కాపులకు విలువ.. 50-60 సీట్ల లక్ష్యం..!
- Aqua Farmers Crop Holiday: సమస్యలు పరిష్కరించకపోతే క్రాప్ హాలిడే.. ఆక్వా రైతుల డెడ్లైన్
- Aqua Farmers: ఫీడ్ ధరల పెంపుపై ఆక్వా రైతుల ఆగ్రహం.. నేడు రాష్ట్రస్థాయి సదస్సులో కీలక చర్చ
- Konaseema Fishermen: 23 రోజుల తర్వాత శుభవార్త.. గల్లంతైన ఏడుగురు మత్స్యకారులు క్షేమం
ఇక, శ్రీ లక్ష్మీనరసింహస్వామి దివ్య కళ్యాణం కోసం గోదావరి జిల్లాల నలుమూలల నుంచి అంతర్వేదికి 105 ప్రత్యేక బస్సులను నడిపిస్తుంది ఏపీఎస్ ఆర్టీసీ. అలాగే, వెయ్యి మంది పోలీసు సిబ్బందితో 9 సెక్టార్లుగా పోలీస్ బందోబస్తు మరింత పటిష్టంగా నిర్వహిస్తున్నారు. ఎస్పీ, అడిషనల్ ఎస్సీ, 10 మంది డీఎస్పీలు, 40 మంది సీఐలు, 100 మంది ఎస్ఐలతో ఉత్సవాల్లో బందోబస్తును ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మరో 20 డ్రోన్ కెమెరాలతో పరిస్థితులను పర్యవేక్షించనున్నారు. ఎన్టీఆర్ఎఫ్, స్పెషల్ పార్టీ, మెరైన్ పార్టీలతో పర్యవేక్షణ కొనసాగుతుంది. దీంతో పాటు 100 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. డిజిటల్ డిస్ప్లే, 12 ఎస్ఈడీ స్క్రీన్లతో భక్తులు స్వామివారి కళ్యాణం తిలకించే అవకాశం కల్పించారు. క్యూలైన్లలో పటిష్టమైన బారికేడింగ్స్ ఏర్పాటు చేశారు. ఆరు ప్రసాదం కౌంటర్ల ఏర్పాటు చేయగా.. కళ్యాణం తర్వాత భక్తులకు అక్షింతలు పంపిణీ చేయడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.
తాజావార్తలు
-
Hyderabad Liberation Day : హైదరాబాద్ విమోచన దినోత్సవం.. సెప్టెంబర్ 17 చరిత్ర ఇదే!
-
NTV Comment : కంటెంట్ బాగుంటే ఏ సినిమాని ఎవ్వరూ ఆపలేరు బాస్!
-
OTR : చంద్రగిరి కూటమి పార్టీల ముఖ్యుల మధ్య విభేదాలు
-
Story Board: ఆర్థిక ఊబిలో తెలుగు రాష్ట్రాలు
-
Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!