Ambati Rambabu: తప్పు చేస్తే ఎమ్మెల్సీ అయినా చర్యలు తప్పవు..!!
ఏపీలో ఎమ్మెల్సీ అనంత ఉదయభాస్కర్ వ్యవహారం వైసీపీని ఇరుకున పెడుతోంది. తాను డ్రైవర్ సుబ్రహ్మణ్యంను హత్య చేసినట్లు పోలీసుల కస్టడీలో ఎమ్మెల్సీ నేరాన్ని అంగీకరించాడు. దీంతో వైసీపీపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రతిపక్షాలు వైసీపీపై విరుచుకుపడుతున్న తరుణంలో మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. చట్టానికి ఎవరూ అతీతులు కాదని ఆయన స్పష్టం చేశారు. దావోస్లో ఉన్న సీఎం జగన్ కూడా ఎమ్మెల్సీపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారని వెల్లడించారు. తప్పు చేస్తే ఎమ్మెల్సీ అయినా చర్యలు తప్పవని మంత్రి అంబటి రాంబాబు పేర్కొన్నారు.
MLC Anantha Babu: సుబ్రహ్మణ్యం బ్లాక్మెయిల్ చేశాడు.. అందుకే..!!
Also Read
- AP High Court Serious: సీనియర్ ఐఏఎస్ అధికారిపై హైకోర్టు సీరియస్.. మాకే అధికారముంటే ఈ క్షణాన్నే సస్పెండ్..!
- MLC Jayamangala Venkataramana: ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ రాజీనామా తిరస్కరణ..
- AP Heatwave: ఏపీలో పలు ప్రాంతాల్లో 45 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు.. రేపు జాగ్రత్త అంటూ విపత్తుల నిర్వహణ సంస్థ వార్నింగ్..
- Anantapur Honey Trap Case: అనంతపురం హనీ ట్రాప్ కేసులో బిగ్ ట్విస్ట్.. వైసీపీ నేత అరెస్ట్..!
మరోవైపు టీడీపీ నేత నారా లోకేష్పై మంత్రి అంబటి రాంబాబు తీవ్ర విమర్శలు చేశారు. లోకేష్ ఏం పీకారని అడుగుతున్నాడని.. అలా అనడం తప్పు అని.. ఆయన దగ్గర ఏం ఉందని పీకడానికి అని అంబటి రాంబాబు చురకలంటించారు. లోకేష్కు పొట్టకొస్తే అక్షరం ముక్క రాదని.. అమెరికా వెళ్లి చదువుకున్నాడో లేదా స్విమ్మింగ్ పూల్లో అమ్మాయిలతో బీర్ తాగుతూ తిరిగాడో తెలియదని ఎద్దేవా చేశారు. లోకేష్ పక్కన తిరిగేవాళ్లే టీడీపీ పనిఅయిపోయిందని అభిప్రాయపడుతున్నారని మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. తన గురించి లోకేష్ పిచ్చిపిచ్చిగా వాగుతున్నాడని.. తాను తిరిగి మాట్లాడితే ఆయన ఇంటిల్లిపాదీ మీడియా ముందు ఏడుస్తూ కూర్చుంటారని విమర్శించారు. లోకేష్ ఓ మాలోకం అని.. బడుద్దాయి అని.. సంచులు మోసే సన్నాసి అని మంత్రి అంబటి రాంబాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
కాగా జగన్ పనితీరు చూసి ప్రతిపక్షాలకు భయం పట్టుకుందని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. జగన్ను సింగిల్గా ఢీ కొట్టలేక టీడీపీ పవన్ కళ్యాణ్, బీజేపీని వెంటతెచ్చుకునే తంటాలు పడుతోందని ఎద్దేవా చేశారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీని మరోసారి ప్రజలు చిత్తు చేయడం ఖాయమన్నారు. వైసీపీని ప్రజలు మళ్ళీ గెలిపిస్తారని ధీమా వ్యక్తం చేశారు. టీడీపీది ‘బాదుడే బాదుడు’ కార్యక్రమం కాదని.. జగన్ పాలన చూసి ‘ఏడుపే ఏడుపు’ కార్యక్రమం అని ఆరోపించారు.
తాజావార్తలు
-
India New Gaming Rules 2026: సర్కార్ సరి కొత్త గేమింగ్ రూల్స్.. ప్రయోజనకరమా లేక హానికరమా..?
-
Sanju Samson: సంజూ శాంసన్ వీర విహారం.. దెబ్బకు ఆ రికార్ట్స్ అన్నీ బ్రేక్..
-
Elections 2026: ఓటర్ల సునామీ.. బెంగాల్, తమిళనాడులో 1947 తర్వాత రికార్డ్ పోలింగ్
-
MI vs CSK: వాంఖడేలో భావోద్వేగ క్షణం.. తల్లిని కోల్పోయినా మైదానంలోకి దిగిన సీఎస్కే ప్లేయర్ ముఖేష్ చౌదరి
-
North Korea: 10 ఏళ్ల ప్లానింగ్, 2 గంటల్లో ఎస్కేప్.. ఉత్తర కొరియా నుంచి కుటుంబం పరార్..
ట్రెండింగ్
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!
-
Lava Bold N1 5G కొత్త వేరియంట్ లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
Moong Dal Pakoda Recipe: శనగపిండి వాడకుండా ఆరోగ్యకరంగా, రుచిగా ఉండే ‘పెసరపప్పు పకోడీ’లను చేసేయండి ఇలా..!
-
మిడ్-రేంజ్లో ఫ్లాగ్షిప్ ఫీచర్లు.. 200MP కెమెరా, 5-స్టార్ డ్రాప్ & క్రష్ సర్టిఫికేషన్, 7000mAh బ్యాటరీతో HONOR 600 సిరీస్ లాంచ్..!
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!