జనం కొడతారని పారిపోయి ఢిల్లీ పారిపోయిన వ్యక్తి రఘురామ కృష్ణంరాజు అని వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు అన్నారు. నీచమైన పనులు చేసే వ్యక్తిని చంద్రబాబు వెనకేసుకు వస్తున్నారు. చట్టం తన పని తాను చేసుకుని పోతుంటే కుట్రదారులందరూ రంగంలోకి దిగారు అని తెలిపారు. ఢిల్లీలో కూర్చుని చంద్రబాబు కోసం లాబీయింగ్ చేస్తున్నాడు. చంద్రబాబు స్క్రిప్ట్ ప్రకారమే రఘురామ కృష్ణంరాజు మాట్లాడుతున్నారు అని పేర్కొన్నారు. జైలుకు వెళ్ళకుండా డైరెక్ట్ గా హాస్పిటల్ కు వెళ్ళాలని, పోలీసుల పై అభాండాలు వేయాలనే కుట్రకు తెర తీశారు అని అంబటి అన్నారు.