YSRCP: ఆంధ్రప్రదేశ్లో డీఎస్సీ నియామకాలపై వివాదం కొనసాగతూనే ఉంది.. విమర్శలు, ఆరోపణలు, సవాళ్ల పర్వం కొనసాగుతుంగా.. డీఎస్సీ నియామకాలలో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలను ఉధృతం చేయాలని నిర్ణయించింది. ఈ వ్యవహారంపై సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ పలు దశల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు ప్రకటించింది.
ఈ నెల 31న రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లకు వినతిపత్రాలు సమర్పించనున్నట్లు వెల్లడించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.. అనంతరం ఆగస్టు 3, 4 తేదీల్లో అన్ని నియోజకవర్గాల్లో టౌన్ హాల్ సమావేశాలు నిర్వహించి డీఎస్సీ నియామకాలపై ప్రజలకు వివరించనున్నట్లు తెలిపింది. ఆగస్టు 6 నుంచి 9వ తేదీ వరకు అన్ని నియోజకవర్గాల్లో రిలే నిరాహార దీక్షలు చేపట్టనున్నట్లు ప్రకటించింది. అనంతరం ఆగస్టు 10న రాష్ట్రవ్యాప్తంగా భారీ నిరసన ర్యాలీలు నిర్వహించి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని నిర్ణయించింది. డీఎస్సీ నియామకాలలో జరిగినట్లు ఆరోపిస్తున్న అక్రమాలపై పూర్తి స్థాయి విచారణ జరిపించాలని, అభ్యర్థులకు న్యాయం జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వైసీపీ డిమాండ్ చేసింది.

