YSRCP Protest: డీజిల్, పెట్రోల్ కొరత.. ఆందోళనలకు వైసీపీ పిలుపు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
YSRCP Protest: రాష్ట్రంలో డీజిల్, పెట్రోల్ కొరత తీవ్రతరమవుతున్న నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలకు పిలుపునిచ్చింది. ఇవాళ పలు ప్రాంతాల్లో పెట్రోల్ బంకుల వద్ద శాంతియుత నిరసనలు చేపట్టనున్నట్లు పార్టీ నాయకత్వం ప్రకటించింది. రైతాంగం, వాహనదారులు, సాధారణ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని వైసీపీ ఆవేదన వ్యక్తం చేసింది. ఈ అంశంపై మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ స్పందిస్తూ రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. కృత్రిమ కొరత సృష్టించి డీలర్లు, కూటమి నేతలు కలిసి ప్రజలను దోచుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’లో ట్వీట్ చేశారు. ఎక్కడ సమస్య వచ్చినా దానిని అవకాశంగా మార్చుకుని లాభాలు పొందడం చంద్రబాబుకు అలవాటైందని జగన్ విమర్శించారు. విత్తనాలు, ఎరువులు, యూరియా, వంటగ్యాస్ తర్వాత ఇప్పుడు పెట్రోల్, డీజిల్ కూడా అదే జాబితాలో చేరాయని అన్నారు.
Also Read
- Speaker Ayyanna Patrudu: ఉచిత పథకాలపై స్పీకర్ అయ్యన్నపాత్రుడు సంచలన వ్యాఖ్యలు
- COVID-19: ఏపీలో మళ్లీ కరోనా కలకలం.. నలుగురు మృతి.. ప్రజలకు కీలక సూచనలు
- AP Rain Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలో వర్షాలు.. ఏ జిల్లాల్లో అంటే..
- Talliki Vandanam Scheme: గుడ్న్యూస్.. రూ.10,049 కోట్లు విడుదల.. 'తల్లికి వందనం'కి సొమ్ము ఖాతాల్లో పడేది ఎప్పుడంటే..?
పొరుగున ఉన్న తమిళనాడు, కర్నాటక, తెలంగాణ రాష్ట్రాల్లో ఎక్కడా ఇలాంటి కొరత లేదని, సరఫరాలో ఎలాంటి అంతరాయం లేదని జగన్ పేర్కొన్నారు. కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం డీలర్లు, కూటమి నేతలు కుమ్మక్కై ఉద్దేశపూర్వకంగా కొరత సృష్టించారని ఆరోపించారు. అయిదు రాష్ట్రాల ఎన్నికలు పూర్తయ్యాక ధరలు పెరిగే అవకాశముందని భావించి డీలర్లు నిల్వలు దాచిపెడుతున్నారని, వారికి కూటమి నాయకులు సహకరిస్తున్నారని అన్నారు. దీనివల్ల ప్రజలు పెద్ద ఎత్తున ఇంధనం కొనుగోలు చేయడంతో డిమాండ్ పెరిగి సమస్య మరింత తీవ్రతరమైందన్నారు.
ఈ కొరత వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని జగన్ తెలిపారు. ట్రాక్టర్లు, వ్యవసాయ యంత్రాలకు డీజిల్ అందక పనులు నిలిచిపోతున్నాయని, రబీ పంటల కోత కాలంలో ఈ పరిస్థితి మరింత దారుణంగా మారిందన్నారు. కోత యంత్రాలకు రోజుకు 100 నుంచి 160 లీటర్ల వరకు డీజిల్ అవసరమవుతుందని, సరఫరా లేక యంత్రాలు పొలాల్లోనే నిలిచిపోతున్నాయని చెప్పారు. ఆక్వా రంగం కూడా ఈ సంక్షోభంతో నష్టపోతుందని జగన్ పేర్కొన్నారు. చేపలు, రొయ్యల పెంపకంలో ఉపయోగించే ఏరియేటర్లు డీజిల్పై ఆధారపడటంతో ఆక్వా రైతులు కూడా ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం పరిస్థితిని చక్కదిద్దాలని, లేకపోతే ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని వైఎస్ జగన్ హెచ్చరించారు.
.@ncbn గారూ, ఎక్కడ ఏ సమస్య వచ్చినా అనుకూలంగా మార్చుకుని దోచుకునే మార్గాలను వెతుక్కోవడం మీకు వెన్నతో పెట్టిన విద్య. లేని కొరత సృష్టించి వ్యాపారులకు సహకరిస్తూ మీరు లాభపడడం అలవాటుగా మారింది. విత్తనాలు, ఎరువులు, యూరియా మొదలు, వంట గ్యాస్ వరకు మన రాష్ట్రంలో అదే జరిగింది.
తాజాగా ఆ… pic.twitter.com/xLLCXcFuHr
— YS Jagan Mohan Reddy (@ysjagan) April 27, 2026
తాజావార్తలు
-
Sir Garfield Sobers: ఇక సెలవు.. 6 బంతుల్లో 6 సిక్సర్లు కొట్టిన తొలి మొనగాడు.. రికార్డులు చూస్తే షాక్ అవ్వాల్సిందే!
-
Sir Garfield Sobers: ప్రముఖ క్రికెట్ దిగ్గజం కన్నుమూత.. బర్త్డేకు ముందు గార్ఫీల్డ్ సోబర్స్ మృతి
-
Parthiv Patel: హిట్మ్యాన్ను తక్కువ అంచనా వేయొద్దు’.. రోహిత్ రిటైర్మెంట్ మధ్య మాజీ క్రికెటర్ కీలక వ్యాఖ్యలు
-
Trump: ట్రక్ డ్రైవర్లకు ట్రంప్ బిగ్ షాక్.. భారతీయులపై తీవ్ర ప్రభావం!
-
Vande Mataram Bill: వందేమాతరానికి అవమానం జరిగితే 3 ఏళ్ల జైలు శిక్ష.. కేంద్రం సరికొత్త బిల్లు!
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?