YSRCP Protest: డీజిల్, పెట్రోల్ కొరత.. ఆందోళనలకు వైసీపీ పిలుపు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
YSRCP Protest: రాష్ట్రంలో డీజిల్, పెట్రోల్ కొరత తీవ్రతరమవుతున్న నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలకు పిలుపునిచ్చింది. ఇవాళ పలు ప్రాంతాల్లో పెట్రోల్ బంకుల వద్ద శాంతియుత నిరసనలు చేపట్టనున్నట్లు పార్టీ నాయకత్వం ప్రకటించింది. రైతాంగం, వాహనదారులు, సాధారణ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని వైసీపీ ఆవేదన వ్యక్తం చేసింది. ఈ అంశంపై మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ స్పందిస్తూ రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. కృత్రిమ కొరత సృష్టించి డీలర్లు, కూటమి నేతలు కలిసి ప్రజలను దోచుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’లో ట్వీట్ చేశారు. ఎక్కడ సమస్య వచ్చినా దానిని అవకాశంగా మార్చుకుని లాభాలు పొందడం చంద్రబాబుకు అలవాటైందని జగన్ విమర్శించారు. విత్తనాలు, ఎరువులు, యూరియా, వంటగ్యాస్ తర్వాత ఇప్పుడు పెట్రోల్, డీజిల్ కూడా అదే జాబితాలో చేరాయని అన్నారు.
Also Read
- AP NDA: కూటమి భారీ ప్లాన్.. రెండేళ్ల పాలన ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కార్యాచరణ
- NDA Meeting Andhra Pradesh: ఎన్డీఏ భేటీలో రాజ్యసభ స్థానాల పంపకం.. టీడీపీకి 3, జనసేనకు 1..?
- Pawan Kalyan: పాత వీడియో షేర్ చేసిన పవన్ కల్యాణ్.. తెలంగాణపై నా వైఖరి ఇదే..!
- AP Cabinet Key Decisions: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు.. అభివృద్ధి అజెండాపై ఫోకస్.. 37 అంశాలకు గ్రీన్ సిగ్నల్..
పొరుగున ఉన్న తమిళనాడు, కర్నాటక, తెలంగాణ రాష్ట్రాల్లో ఎక్కడా ఇలాంటి కొరత లేదని, సరఫరాలో ఎలాంటి అంతరాయం లేదని జగన్ పేర్కొన్నారు. కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం డీలర్లు, కూటమి నేతలు కుమ్మక్కై ఉద్దేశపూర్వకంగా కొరత సృష్టించారని ఆరోపించారు. అయిదు రాష్ట్రాల ఎన్నికలు పూర్తయ్యాక ధరలు పెరిగే అవకాశముందని భావించి డీలర్లు నిల్వలు దాచిపెడుతున్నారని, వారికి కూటమి నాయకులు సహకరిస్తున్నారని అన్నారు. దీనివల్ల ప్రజలు పెద్ద ఎత్తున ఇంధనం కొనుగోలు చేయడంతో డిమాండ్ పెరిగి సమస్య మరింత తీవ్రతరమైందన్నారు.
ఈ కొరత వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని జగన్ తెలిపారు. ట్రాక్టర్లు, వ్యవసాయ యంత్రాలకు డీజిల్ అందక పనులు నిలిచిపోతున్నాయని, రబీ పంటల కోత కాలంలో ఈ పరిస్థితి మరింత దారుణంగా మారిందన్నారు. కోత యంత్రాలకు రోజుకు 100 నుంచి 160 లీటర్ల వరకు డీజిల్ అవసరమవుతుందని, సరఫరా లేక యంత్రాలు పొలాల్లోనే నిలిచిపోతున్నాయని చెప్పారు. ఆక్వా రంగం కూడా ఈ సంక్షోభంతో నష్టపోతుందని జగన్ పేర్కొన్నారు. చేపలు, రొయ్యల పెంపకంలో ఉపయోగించే ఏరియేటర్లు డీజిల్పై ఆధారపడటంతో ఆక్వా రైతులు కూడా ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం పరిస్థితిని చక్కదిద్దాలని, లేకపోతే ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని వైఎస్ జగన్ హెచ్చరించారు.
.@ncbn గారూ, ఎక్కడ ఏ సమస్య వచ్చినా అనుకూలంగా మార్చుకుని దోచుకునే మార్గాలను వెతుక్కోవడం మీకు వెన్నతో పెట్టిన విద్య. లేని కొరత సృష్టించి వ్యాపారులకు సహకరిస్తూ మీరు లాభపడడం అలవాటుగా మారింది. విత్తనాలు, ఎరువులు, యూరియా మొదలు, వంట గ్యాస్ వరకు మన రాష్ట్రంలో అదే జరిగింది.
తాజాగా ఆ… pic.twitter.com/xLLCXcFuHr
— YS Jagan Mohan Reddy (@ysjagan) April 27, 2026
తాజావార్తలు
-
Shreyas Iyer: చరిత్రను లిఖించనున్న శ్రేయస్ అయ్యర్.. 2028 వరకు కెప్టెన్గా సర్పంచ్ సాబ్..
-
Hyderabad: బంధాల్ని తెంచుతున్న వివాహేతర సంబంధాలు.. తెలుగు రాష్ట్రాల్లో కలకలం
-
NTR Viral Tweet: కుకీలు పంపమన్న అభిమాని.. ఎన్టీఆర్ క్రేజీ రిప్లై ట్వీట్ వైరల్!
-
Natural gas: భారత్కు జాక్పాట్.. అండమాన్లో గ్యాస్ నిల్వలు..
-
Mohali Love Murder: కిరాతకుడిగా మారిన సహోద్యోగి.. ఆఫీస్లోనే యువతి హత్య
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!